ఆవనూనెతో క్రమం తప్పకుండా రోజూ రెండు పూటలా మర్దన చేస్తుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
కొంచెం దానిమ్మ చిగుళ్లు, సైంధవ లవణం కలిపి నూరాలి. శనగ గింజంత మాత్రలు చేసుకుని ఓక్కొక్కటి మూడు పూటలా తీసుకోవాలాలి.
మిరియాలు ఒక స్పూను, విషముష్టి గింజలు ఒక స్పూను తీసుకుని అల్లం రసంలో మూడు రోజుల పాటు నాన బెట్టాలి. ఆ తర్వాత మెత్తగా చేసి చిన్న చిన్న కంది గింజలంత మాత్రలు చేసుకుని ప్రతిరోజూ రెండు పూటలా ఒక్కొక్కటి చొప్పున వేసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఉల్లిపాయ, ఆవాలు సమ భాగాలుగా తీసుకుని బాగా నూరి కీళ్ల మీద మర్దన చేసుకుంటే వెంటనే నొప్పులు తగ్గుతాయి.
కప్పు నువ్వుల నూనెలో నాలుగు వెల్లుల్లిపాయ రేకులు వేసి బాగా మరగించాలి. చల్లారాక నూనెను వడగట్టి కీళ్ల నొప్పులున్న చోట మర్దన చేయాలి.
No comments:
Post a Comment