Wednesday, January 25

మెదడుకు బలం యాపిల్‌...

శరీరం బాగా నీరసించిపోయినా, మెదడుకు బలాన్ని పుష్టిని కలుగజేసే శక్తి యాపిల్‌కు ఉంది. దానిలో లభించే భాస్వరం, ఐరన్‌ మెదడుకు,శరీరానికి ఉత్సాహాన్ని పుష్టిని కలుగ జేస్తుంది. మండకోడి తనాన్ని నిర్మూలించి కాలెయాన్ని చైతన్యవంతం చేసి శరీర, మెదడుకు శక్తి సామర్థ్యా లను అధికం చేస్తుంది. జ్వరంతో బాధపడే వారికి యాపిల్‌ ఉష్ణాన్ని తగ్గించి క్రమపరుస్తుంది. ధీశక్తిని పెంచుకోవాలనుకుంటే రోజుకు మూడు, నాలుగు యాపిల్‌ పళ్లు తీసుకోవాలి.
* అద్భుత ఫలం :-
భారతీయ శాస్తవ్రేత్తల ప్రకారం యాపిల్‌ పండు పోషక విలువల భాండాగారం, యాపిల్‌ పండు చర్మం ఫాలీఫె నాల్స్‌, పరమాణువులతో కలిస్తే కేన్సర్‌ను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. యాపిల్‌ ఫలాలు కాలేయం, పేగు కేన్సర్‌ నివారణలో ఉపయుక్తంగా ఉంటుంది. సి విటమిన్‌, క్యాల్షియం తదితర ఎన్నో పోషకాలను అందిస్తుంది. టూత్‌బ్రష్‌తో తోమడం కన్నా యాపిల్‌ తినడం వల్ల పళ్ళు మరింత శుభ్రమవుతాయి. అది హృద్రోగాలను కూడా అడ్డుకుంటుంది. అంతేకాకుండా యాపిల్‌లో మ్యాలిక్‌ యాసిడ్‌ కండరాలు, కీళ్ళ వ్యాధు నుంచి కూడా విముక్తినిస్తుంది.

Monday, January 23

పసిపిల్లలకు బొప్పాయి ఎందుకు తినిపించాలంటే..?

పిల్లలు పెద్దయ్యాక ఆరోగ్యంగా ఉండాలంటే, చిన్నప్పటి నుంచే మంచి ఆహారం, అవసరమైన ఆహారం తినిపిస్తూ ఉండాలి. శరీరానికి లాభాన్ని కూర్చే ఏ ఆహారమైనా, చిన్నప్పుడు అలవాటు చేస్తేనే, ఓ వయసులోకి వచ్చాక కూడా ఆ అలవాటుని కంటిన్యూ చేస్తారు. కాబట్టి పాలు మరవగానే కొన్ని ఆహారపు అలవాటు మొదలుపెట్టించాలి. అందులో ఒకటి బొప్పాయి తినటం. మరి బొప్పాయి ఎందుకు తినాలని మీకో డౌట్ రావచ్చు.

* వాతావరణ మార్పిడి వలన, బయట ఎక్కువగా ఆడుకోవటం వలన పిల్లలకి రకరకాల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బొప్పాయిలో విటమిన్ సి ఉంతుంది. ఈ విటమిన్ పిల్లలలో ఇమ్యునిటినీ మెరుగుపరిచి, సాద్యమైనంతవరకు ఇన్ఫెక్షన్స్ ని నివారిస్తుంది.

* బొప్పాయిలో ఫైబర్ కూడా బాగా ఉండటం వలన, తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. మెటబాలిజం సరైన ట్రాక్ లో ఉంటుంది.

* పిల్లలకు మలబద్ధకం సమస్య రావచ్చు. దీన్ని బొప్పాయితో కంట్రోల్ చేయవచ్చు. రోజుకి రెండుపూటలు కొంచెం కొంచెం బొప్పాయి తిన్పించి మన ప్రయత్నం చేయవచ్చు.

* బొప్పాయిని తేనెతో కలిపి ఇస్తే, అది పేగులను శుభ్రంగా ఉంచుతుంది. పిల్లలకు ఈ మిశ్రమం చాలా అవసరం.

* బొప్పాయిలో యాంటిఆక్సిడెంట్స్ బాగా దొరుకుతాయి. ఇవి చిన్నప్పటినుంచే శరీరానికి చాలా అవసరం.

* ఈ ఫలం చర్మ ఆరోగ్యానికి కూడా మంచిది. కాబట్టి మీ పిల్లల చర్మసౌందర్యం కోసమైనా బొప్పాయిని అలవాటు చేయండి.

బరువు పెంచే సహజ ప్రోటీన్ షేక్స్...

రోజు తీసుకునే క్యాలరీల సంఖ్య పెంచుకోటానికి బరువు పెంచే ప్రోటీన్ షేక్స్ ప్రాచుర్యం పొందినవిగా చెప్పవచ్చు. మీరు ఆరోగ్యకర బరువు మరియు కండరాలను పెంచుకోవాలని అనుకుంటున్నారా! అయితే ప్రోటీన్ షేక్స్ లను ద్వారా మీ లక్ష్యాన్ని సులభంగా చేరవచ్చని చెప్పవచ్చు.

బరువు పెరగటానికి ప్రోటీన్ షేక్స్ స్థూలపోషకాలుగా పేర్కొనవచ్చు, వీటితో పాటుగా కార్బోహైడ్రేట్లు మరియు ఆరోగ్యకర కొవ్వు పదార్థాలు కూడా అవసరమే. బరువు పెంచే ప్రోటీన్ షేక్స్ లను ప్రోటీన్ పౌడర్ ల ద్వారా లేదా సహజ ప్రోటీన్ ఆధారితాల ద్వారా కూడా తయారు చేయవచ్చు. తీసుకునే క్యాలోరీల సంఖ్య పెరగటానికి రోజు తినే ఆహరం మరియు పండ్లతో పాటుగా ఈ ప్రోటీన్ షేక్స్ లను కూడా తీసుకోవాలి.


స్ట్రాబెర్రీ ఓట్మీల్ షేక్

ఒక డజన్ చల్లబరచిన స్ట్రాబెర్రీ, 1 కప్పు సోయా పాలు, ఓట్స్, అరటిపండు మరియు ఒక గరిట వెనిలా ప్రోటీన్ పౌడర్ కలిపి గ్రైండ్ చేయటం ద్వారా స్ట్రాబెర్రీ ఓట్మీల్ షేక్ తయారు చేసిన వారవుతారు. స్ట్రాబెర్రీ ఓట్మీల్ షేక్ శరీర బరువు పెరగటానికి సహాయపడటమే కాకుండా, శరీరానికి కావలసిన విటమిన్ 'C' ని కూడా సమకూరుస్తుంది.


అవకాడో షేక్

అవకాడో షేక్ తయారీ కోసం, పైనాపిల్, కొబ్బరినీరు, నిమ్మరసం మరియు సోయా ప్రోటీన్ పౌడర్ ను కలిపి గ్రైండ్ చేయండి. ఈ అవకాడో షేక్ పుష్కలంగా ప్రోటీన్ లను కలిగి ఉండటమే కాకుండా, అధిక మొత్తంలో అన్-సాచురేటేడ్ కొవ్వు పదార్థాలను, విటమిన్ 'K' మరియు పొటాషియంలను కలిగి ఉంటుంది.


చాక్లెట్ బనానా షేక్

చల్లగా ఉండే అరటిపండు, సోయా పాలు, బాదం వెన్న మరియు కోకా పొడితో పాటుగా చాక్లెట్ ప్రోటీన్ పౌడర్ లను కలిపి గ్రైండ్ చేయటం వలన చాక్లెట్ బనానా షేక్ తయారు చేస్తారు. ఈ రకమైన షేక్ శరీర బరువు పెంచటమే కాకుండా, గుండె ఆరోగ్యాన్ని పెంచే కొవ్వు పదార్థాలను, మెగ్నీషియం మరియు విటమిన్ 'E' లను కలిగి ఉంటుంది. ఆరోగ్యకర బరువు పెంచుకోవాలనుకునే వారు, చాక్లెట్ సిరప్ లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే వీటిలో అధిక కొవ్వు పదార్థాలు మరియు సంవిధానపరచిన చక్కెరలను కలిగి ఉండి, అధిక క్యాలోరీలు శరీరానికి అందించబడతాయి.


వేగన్ ప్రోటీన్ షేక్

చల్లబరచిన పైనాపిల్, కొన్ని బొప్పాయిపండు ముక్కలను, జనపనార ప్రోటీన్ పౌడర్ ను, అరటిపండు మరియు నీటిని కలిపి గ్రైండ్ చేయండి. ఈ విధంగా తయారు చేసిన ప్రోటీన్ షేక్ బరువు పెంచుకోవలనుకునే శాఖాహారులకు ఉత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. ఎవరైతే మాంసకృత్తులను తినే ఆహార ప్రణాళికలో కలుపుకోరో, వారి కోసమే ఈ ప్రోటీన్ షేక్ అని చెప్పవచ్చు. మాంసం తినని వారిలో ఈ రకం ప్రోటీన్ షేక్ త్వరగా శరీర బరువు పెంచుతుంది.

ప్రోటీన్ షేక్ ల రూపంలో క్యాలోరీలను తీసుకోవటం వలన అనేక మార్గాలలో శరీర బరువు పెరుగుతుంది. బరువు పెంచే సహజ ప్రోటీన్ షేక్ లను ఇంట్లోనే చల్లబరచిన పండ్లు, ప్రోటీన్ పౌడర్, విత్తనాలు పాల ద్వారా సులభంగా తయారు చేసుకోవచ్చు. బాదం పప్పు, నువ్వుల గింజలు, ఆలివ్ ఆయిల్ నుండి ఆరోగ్యకర కొవ్వు పదార్థాలను అందించే ఆహార పదార్థాలను ప్రోటీన్ షేక్ లలో కలుపుకొని అధిక క్యాలోరీలను పొందవచ్చు.

ప్రోటీన్ షేక్ ల ద్వారా శరీరానికి క్యాలోరీలను అందించి, శరీర బరువు పెంచేటమే కాకుండా, పోషకాలను కూడా అందిస్తుంది. ప్రోటీన్ షేక్ లను తీసుకున్న తరువాత కూడా శరీర బరువు పెరగని ఎడల పోషకాహార నిపుణుల సహాయం తీసుకోండి.

కిడ్నీలు శుభ్రంగా ఉంచుకునే మార్గాలు మీకోసం...


కిడ్నీలు చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. అందుకే ప్రమాదాల బెడద ఎక్కువ వాటికి. టాక్సిన్స్ ఎక్కువగా దాడి చేసేది కిడ్నీలనే. కిడ్నీలను పరిశుభ్రంగా ఉంచుకోకపోతేనే కిడ్నీ ఫేల్యూర్ సమస్యలు, ఇన్ఫెక్షన్ సమస్యలు, కిడ్నీల్లో రాళ్ళు వస్తాయి. కాబట్టి కిడ్నీలను శుభ్రం చేసుకోవాలి ? ఎలా అంటారా ?

* ఆపిల్ సీడెడ్ వెనిగర్ ని ఏ డాక్టర్ అయినా నిర్మొహమాటంగా సజెస్ట్ చేస్తాడు. అలాంటి శక్తివంతమైన పదార్థం ఇది. దీనికి నేచురల్ క్లీన్సేనర్ అనే పేరు కూడా ఉంది. గ్లాసు నీటిలో ఓ రెండు టీస్పూను ఆపిల్ సీడెడ్ వెనిగర్ కలుపుకొని రోజు ఉదయాన్నే తాగితే బాడిలో టాక్సిన్స్ ని బయటకి లాగవచ్చు.

* ఉదయాన్నే నిమ్మరసం తాగే అలావాటు చేసుకున్న మంచిదే. నిమ్మరసం టాక్సిన్స్ ని అవలీలగా బయటకి తీస్తుంది.

* పైనాపిల్, ఆపిల్, ఆరెంజ్, పీచ్ తో కలిపి చేసిన జ్యూస్ కూడా బాగా పనికివస్తుంది.

* పాలకూర, క్యారట్, గ్రీన్ ఆపిల్, పార్స్లీ ఆకులు, కాలే, దోసకాయ కలిపి తయారుచేసే జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. ఉదయం లేవగానే దీన్ని సేవించడం వందరకాలుగా ఉపయోగం.

* బీట్ రూట్ లో పొటాషియం బాగా ఉంటుంది. ఇది మలీనాల్ని ఈజీగా బయటకి తెస్తుంది. కాబట్టి బీట్ రూట్ ని ప్రేమించండి.

* క్రాన్ బెర్రీ జ్యూస్ కిడ్నీల్లో రాళ్ళు ఏర్పడకుండా అడ్డుకుంటుంది. కాని చక్కర కలపకుండా తాగండి.

Sunday, January 22

గుండెపోటుని అడ్డుకునే ఈజీ విధానం...


సమస్య పెద్దగా అయ్యాక, ప్రయత్నాలు మన తాహతుకి మించి చేయడం కన్నా, సమస్య మొదలవకుండా, చిన్ని చిన్ని మార్గాలతోనే పెద్ద పెద్ద సమస్యలను అడ్డుకుంటే బెటర్. అలాంటి ఓ పెద్ద సమస్యే గుండేపాటు. దాన్ని అడ్డుకునే చిన్ని ఆయుధం గుడ్డు. అవును, కోడిగుడ్డు.
సగటున ఒక పెద్ద సైజ్ కోడిగుడ్డులో ఆరు గ్రాముల హై క్వాలిటి ప్రొటీన్, రెండురకాల యాంటిఆక్సిడెంట్స్, విటమిన్ ఏ,డి,ఈ ఉంటాయి. ఇలా న్యూట్రింట్స్ సంపన్న ఆహారం కాబట్టే, రెగ్యులర్ గా ఉడకబెట్టిన గుడ్డుని తీసుకోవడం వలన గుండెపోటు వచ్చే ప్రమాదం 12% తగ్గుతుందట.
ఈ విషయంపై అమెరికాలో ఓ ప్రోఫేసర్ డామినిక్ అలెగ్జాండర్ కొన్నేళ్ళుగా రిసెర్చి చేసారు. ఫలితాలు వెల్లడించిన ప్రొఫేసర్ ” గుడ్డులో యాంటిఆక్సిడెంట్ ప్రపార్టీస్ బాగా ఉండటం వలన ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు ఇంఫ్లేమేషన్ ని అడ్డుకుంటాయి. గుడ్లలో ప్రొటీన్ కూడా బాగా దొరకడంతో ఇవి బ్లడ్ ప్రెషర్ ని కూడా కంట్రోల్ లో ఉంచుతాయి” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ రిసెర్చి ఏదో చిన్నగా జరగలేదు లేండి. మూడు లక్షలమందికి డైట్ లో గుడ్లని రోజూ అందిస్తూ, కొన్నేళ్ళపాటు పరీక్షలు చేశారు. ఆ తరువాత జర్నల్ ఆఫ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ న్యూట్రీషన్, అమెరికన్ ఎగ్ బోర్డ్ ఈ ఫలితాలనయ ప్రకటించారు.

నిద్రకి ముందు ఏమి తినాలి..? ఏమి తినకూడదు..?

రాత్రిపూట ఎలాంటి విరామం లేకుండా, సుఖంగా, ప్రశాంతంగా 7-8 గంటల నిద్రపోవాలని ఎవరికి ఉండదు. అదే మనిషి శరీరానికి అవసరం కూడా. కాని కొందరు ఆహారపు అలవాట్లతో నిద్ర చెడగొట్టుకుంటారు. బాహుషా, నిద్రలోకి జారుకోవడానికి సహాయపడే ఆహారం ఏదో, నిద్రను చెడగొట్టే ఆహారం ఏదో అవగాహన లేకపోవడం వలనేమో. అందుకే నిద్రకి ముందు ఏ ఆహారం తినాలో, ఏం తినకూడదో చూద్దాం.

* రాత్రిపూట లైట్ ఆహారం తీసుకోవడమే మంచిది. వినే ఉంటారు, “డైన్ లైక్ ఏ బెగ్గర్” అనే సామెత. కాబట్టి స్పైసీ, హెవీ ఆహారం వద్దు. ఆసిడ్ రిఫ్లక్స్ సమస్యతో నిద్ర చెడిపోవచ్చు.

* కాఫీ మెదడుని ఉత్తేజపరచడానికి పనిచేస్తుంది. దీన్ని ఉదయంపూట, వర్కింగ్ అవర్స్ లో తీసుకోవాలి. విశ్రాంతి తీసుకునేటప్పుడు కాదు.

* ఆల్కహాల్ తాగడం, నీళ్ళి అతిగా తాగడం కూడా నిద్రకి ముందు చేయకూడని పనులు. మధ్యలో మూత్రవిసర్జన కోసం నిద్ర లేవాల్సి వస్తుంది.

* చెర్రిల్లో నిద్రకు ఉపయోగపడే మెలాటోనిన్ ని ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి ట్రై చేయండి.

* అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం ఉండటం వలన ఇది రిలాక్సేషన్ కి ఉపయోగపడుతుంది.

* స్వీట్ పొటాటోలో కూడా పొటాషియం ఉంటుంది. ఇది కూడా అరటిపండు లాగే నిద్రకి ఉపయోగపడుతుంది.

చిన్న పిల్లలు త్వరగా ఎత్తు పెరగటం ఎలా?

త్వరగా ఎత్తు పెరగటానికి మ్యాజిక్ ట్రిక్ ఏమి లేదు కానీ చిత్తశుద్దితో ప్రణాళికలను పాటిస్తే పాత్రం త్వరగా ఎత్తు పెరుగుతారు.
ఎత్తు పెరగటానికి కింద తెలిపిన ఆహార పదార్థాలను తినటం వలన త్వరగా మంచి ఫలితాలను పొందే అవకాశం ఉండనే చెప్పవచ్చు.
. ఎత్తు పెరగాలి అనుకుంటే మాత్రం అధిక క్యాలోరీలను అందించే ఆహారాలను అనగా కార్బోహైడ్రేట్, ప్రోటీన్ మరియు ఆరోగ్యకర కొవ్వు పదార్థాలను తినటం మంచిది.
కార్బోహైడ్రేట్'లు అధికంగా ఉండే ఆహరం: రైస్, పాస్తా, బ్రెడ్, బంగాళదుంప, బీన్స్, చిలకడదుంప, ఓట్మీల్, పండ్లు మరియు కూరగాయల నుండి ఎత్తు పెరుగుటకు అవసరమయ్యే కార్బోహైడ్రేట్'లను పొందవచ్చు.
ప్రోటీన్'లను అధికంగా కలిగి ఉండే ఆహారాలు: చికెన్, లీన్ బీఫ్, స్టీక్స్, గుడ్లు, సాల్మన్ చేప, పాలు మరియు కాటేజ్ చీస్'లలో ప్రోటీన్'లు అధికంగా ఉంటాయి.
ఆరోగ్యకర కొవ్వు ఉండే ఆహారాలు: ఆలివ్ ఆయిల్, అవకాడో, నట్స్, పీనట్ బటర్ మరియు ఫ్లాక్స్ ఆయిల్'ల నుండి ఆరోగ్యకర కొవ్వు పదార్థాలను పొందవచ్చు.
సరైన సమయంలో తినండి
మీరు త్వరగా ఎత్తు పెరగాలి అనుకుంటే మాత్రం ఆహారాన్ని రోజు ఒకే సమయానికి తీసుకోవాలి
పిల్లల్లొ ఎత్తు పెరగగాలి అనుకునే వాల్లు కొన్ని రకాల ప్రోటిను పౌడర్ లు వాడడము వలన త్వరగా ఎత్తు పెరగవచ్చు అని న్యుట్రిషియను నిపుణులు చెప్తున్నారు

Saturday, January 21

రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడానికి మరో కారణం

వీక్ నెస్ , షుగర్ , బిపి , జీర్ణసమస్యలు , ఆహారం
వంట బట్టక పోవడం , వత్తిడి , డిప్రెషన్ ఉన్న వారికి నరాలు ,కండరాలు త్వరగా అలసిపోతాయి .
హార్మోన్స్ సమతుల్యత ఉండే వారికైతే బాగా పనిచేస్తే నిద్ర బాగా పడుతుంది.

కానీ పై వ్యాధులు ఉండేవారు సాయంత్రం ఎక్కువ
పని చేసి అలసిపోతే నిద్ర సరిగా పట్టదు .
కారణం నరాలు త్వరగా రిలాక్స్ కాకపోవడమే
ఓ ప్రక్క మనసుకు నిద్ర వస్తుంటే , మరోప్రక్క
శరీరంలో అలజడి -ప్రకంపనలు అధికంగా ఉంటాయి.

గ్లూకోజ్ - పొటాషియం - ఇతర విటమిన్లు సరిగా
నరాలకు,కండరాలకు అందకపోవడం -
అరగని వస్తువులు తినడం ,
నరాలను రెచ్చ గొట్టే ఆహారాలు తినడం
టివీ లోబాగా ఇష్టం కలిగే ప్రోగ్రామ్స్ , యాంగ్జయిటీతో చూడటం కారణమవచ్చు
పై వ్యాధులుండే వారు ఇవన్నీ సాయంత్రం నుంచి వదిలేయండి.

ఒకోసారి నిద్ర మాత్ర కంటే సెలైన్ లేదా
అరటిపండు ఉడకబెట్టి త్రాగడం ఉపశమనం కలిగించవచ్చు.

Friday, January 20

కంటి చూపును మెరుగుపరిచే సాధారణ ఉపాయాలు...

కళ్ళు సరిగా ఉంటేనే మనం సౌకర్యంగా ఉంటాము అవునా! కళ్ళు అనారోగ్యంగా ఉంటే అంతర్గతంగా కూడా ఏదో లోటు ఉన్నట్టు అనిపిస్తుంది. కావున ఈ ఉపాయాలతో మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి...
1. కంటి నవ్వును ఆపకండి :-
చూసిన దానికి అనుగుణంగానే మన ప్రతిచర్య ఉంటుంది. స్కూల్, పనిలో మరియు ఇతర సాంఘీక కార్యకలాపాలలో మంచి మంచి దృష్టి కీలక పాత్ర పోషిస్తుంది. దృష్టి లోపాలు మన మానసిక ఆరోగ్యంపై ప్రభావంతో పాటూ మరియు సాంఘీక కార్యకలాపాలలో క్రియారహితంగా చేస్తుంది. మార్కెట్లో లభించే కాంటాక్ట్ లెన్స్ మరియు అద్దాలు కంటి చూపును మెరుగుపరుస్తాయి. కానీ ఇక్కడ తెలిపిన పద్దతులు సహజంగా మన కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
2. కంటి చూపు ఎలా పని చేస్తుందో తెలుసుకోండి :-
కంటి చూపు ఎలా పని చేస్తుందో ముందు తెలుసుకోండి. ఇలా తెలుసుకోవటం వలన ఏ అలవాట్లు కంటి చూపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయో మరియు ఏ అలవాట్లు హని కలిగిస్తాయో తెలుస్తుంది.

3. కంటిని పొడిబారనివ్వకండి :-
కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి మీరు తేమ నిరంతరంగా అందించాలి. కళ్ళలో దురదలుగా, ఎరుపుగా, నొప్పిగా ఉంటే మీ కళ్ళు పొడిగా మారతాయి. కావున ఎక్కువ సమయం TV ముందు కానీ, కంప్యూటర్ ముందు కానీ కుర్చోకండి. మరియు నిరంతరం కనురెప్పలను వాల్చుతూ ఉండండి.
4. వ్యాయామాలు :-
మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండలంటే, మీరు వాటికి నిరంతరం వ్యాయామాలు చేస్తూ ఉండాలి. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును కనీసం 20 సెకన్ల పాటూ చూడండి.
5. విరామాలను తీసుకోండి :-
కూర్చొని ఉండే ఉద్యోగంలో చాలా సమయం పాటూ అలానే ఉంటున్నారా? అయితే క్రమంగా విరామాలు తీసుకోవటం మంచిది. ఇలా విరామలాను తీసుకోవటం వలన కంటిపై పడే ఒత్తిడి తొలగిపోయి వాటంతట అవే నయం అవుతాయి.

పెరుగుతో వీటిని కలిపి తింటే ఆరోగ్యమే ఆరోగ్యం

పెరుగును ఈ పదార్థాలతో విడిగా కలిపి తినండి, ఆరోగ్యపరంగా అద్భుత ఫలితాలు పొందండి...


1. కొద్దిగా జీల‌క‌ర్ర ‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.
2. కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య ‌లు దూర‌మ‌వుతాయి. ప్ర ‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.
3. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.
4. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.
5. ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.
6. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.
7. పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.
8. పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.
9. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.
10. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స ‌ర్ లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర ‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష ‌ న్లు వెంట‌నే త‌గ్గుతాయి.

Thursday, January 19

అధికరక్తపోటును అధిగమించాలంటే...

అంజీర తినాల్సిందే.. బరువు తగ్గాలంటే?
వయసుతో సంబంధం లేకుండా చాలామందిలో అధికరక్తపోటు సమస్య వేధిస్తోంది. దీన్ని అదుపు చేయాలంటే పొటాషియం, సోడియం పుష్కలంగా లభించే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఈ పోషకాలు అంజీరలో లభిస్తాయి. అవి అధికరక్తపోటును అదుపులో ఉంచుతాయి. సంతానం కోరుకునేవారూ అంజీరను ఎంత తీసుకుంటే అంత మంచిది. దీనిలో అధికంగా ఉండే మెగ్నీషియం, మాంగనీసు, జింకు సంతాన సాఫల్యత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఇంకా బరువు తగ్గాలనుకునేవారికి అంజీర ఎంతో మేలు చేస్తుంది. కొన్ని అంజీర ముక్కల్ని భోజనానికి ముందే తీసుకోవడం ద్వారా పొట్ట నిండినట్లుంది. అతిగా తినే సమస్యను దూరం చేసుకోవచ్చు. కొలెస్ట్రాల్ సమస్య ఉండదు.
హృద్రోగాలతో బాధపడేవారు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో అంజీర చేర్చుకుంటే మేలు. ఇందులో పెక్టిన్‌ అనే పదార్థం శరీరంలోని వ్యర్థాలనూ తొలగిస్తుంది. గుండెకూ మేలుచేస్తుంది. మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు రోజూ అంజీర తీసుకోవడం మంచిది. ఇందులో హిమోగ్లోబిన్‌ స్థాయుల్ని పెంచే పోషకాలు అధికం. అందుకే రక్తహీనతను దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

Wednesday, January 18

తేనె ఎంత మధురం..!

చక్కెర తియ్యగా ఉంటుంది. కానీ ఆరోగ్యానికి హానికరం. తేనె కూడా తియ్యగానే ఉంటుంది. కానీ ఔషధభరితం. ఎందుకంటే పూలల్లోని మకరందం, పుప్పొడి పరిమళం కలగలిసిన అద్భుతమైన రుచి దీని సొంతం. అందుకే తేనె మధురాతి మధురం... అమృతాన్ని మరిపించే దివ్యౌషధం!
అలుపన్నదే లేకుండా వేలమైళ్ల దూరం ప్రయాణిస్తూ పువ్వుపువ్వునీ పలకరిస్తూ మకరందాన్ని సేకరించింది మధుపం. రాబోయే కాలం కోసం ఆకుచాటు కొమ్మకి కట్టిన అద్దాల భవంతిలో దాచిపెట్టింది. కానీ డేగ కళ్ల మనిషి దాన్ని చూడనే చూశాడు. భవంతి కూలింది. చేతికందిన మధువులోని తియ్యదనాన్ని తొలిసారిగా రుచి చూశాడు. ఆ తరవాత అందులోని పోషకాలనీ ఆరోగ్య, సౌందర్య గుణాలనీ గుర్తించాడు. ఇంకేముంది... చిటారుకొమ్మన ఉన్న ఆ మిఠాయిపొట్లాలను వేటాడే పనిలేకుండా ఏకంగా తేనెటీగల్ని పెంచి తేనె పిండటమూ తెలుసుకున్నాడు. ఫలితమే రంగురంగుల రకరకాల తేనెలు. పసుపు, బూడిద, ముదురుకాఫీ, నలుపు... ఇలా భిన్న రంగులతోబాటు వర్ణరహిత మైన తేనెలూ ఉన్నాయి. ఒక్కో తేనె ఒక్కో రకమైన రుచినీ సుగంధాన్నీ వెదజల్లుతుంది. యూకలిప్టస్‌, నిమ్మ జాతి పూల తేనె ఘాటైన రుచినీ వాసననీ కలిగి ఉంటుంది. అందుకే బేకింగ్‌ ఉత్పత్తుల్లో చక్కెరకు బదులు తేనె వాడటంవల్ల అవి మరింత రుచిగానూ సువాసనభరితంగానూ ఉంటాయి.
శుద్ధి చేయని ముడి/జుంటి తేనెలో విటమిన్లూ ఎంజైములూ యాంటీఆక్సిడెంట్లూ మరింత పుష్కలం. అందుకే శక్తికోసం తేనెను నేరుగానూ తినొచ్చు. గోరువెచ్చని నీళ్లలో కలిపితే మందులానూ పనిచేస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న ఆహారపదార్థం ఏదయినా ఉందీ అంటే అది తేనె మాత్రమే. ఆయుర్వేదం, అల్లోపతీ అన్న తేడా లేకుండా అన్ని రకాల వైద్యులూ నిర్భయంగా వాడమని చెప్పేది కూడా అదే. గ్రీకులూ రోమన్లూ చైనీయులూ ఈజిప్షియన్లూ అస్సీరియన్లూ భారతీయులూ ప్రాచీనకాలం నుంచీ వైద్యంలో వాడుతూనే ఉన్నారు. ఆయుర్వేదానికి తేనె ప్రాణంలాంటిది. శుశ్రుతసంహిత తేనెను తాగేమందుగా వర్ణించింది. శ్వాసకోశవ్యాధులకు మధువును మించిన ఔషధం లేదనీ, గాయాల నివారణతోబాటు పొట్టకు సంబంధించిన అనేక వ్యాధుల్నీ తగ్గిస్తుందనీ పేర్కొంది. అందుకే ఆధునిక పరిశోధకులు సైతం తేనెలోని ఔషధగుణాలమీద ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నారు.
• ఔషధభరితం!
పంచదారకన్నా ఎంతో తియ్యగా ఉండే తేనెను రోజూ ఆహారంలో భాగంగా తీసుకోవడంవల్ల హృద్రోగాల సంఖ్య బాగా తగ్గినట్లు తేలింది. తేనెలో అధికంగా ఉండే విటమిన్‌-సి, మోనోఫినాలిక్‌లూ ఫ్లేవనాయిడ్లూ పాలీఫినాలిక్‌లూ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేయడమే ఇందుకు కారణం.
  1. * వూబకాయంతో బాధపడేవాళ్లకు క్రమం తప్పకుండా 30 రోజులపాటు రోజూ 70 గ్రా. తేనెను ఇచ్చి చూడగా వాళ్ల బరువులో 1.3 శాతం తేడా ఉండగా కొలెస్ట్రాల్‌ మాత్రం మూడు శాతం వరకూ తగ్గిందట. తేనెలో నిమ్మరసం, దాల్చినచెక్క పొడి కలిపి తీసుకున్నా బరువు తగ్గుతారు. అంతేకాదు, తేనెని గోరువెచ్చని నీళ్లలో కలిపి తీసుకోవడంవల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వులు త్వరగా జీర్ణమవుతాయి.
  2. * ముడి తేనె బీపీని తగ్గిస్తుందన్నది మరో పరిశోధన. అంతేకాదు, శరీరంలో ఇన్సులిన్‌ శాతాన్నీ క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలో చక్కెరనిల్వలు తగ్గకుండా చూస్తుంది. వ్యాయామం తరవాత దీన్ని తీసుకోవడంవల్ల అలసట ఉండదు.
  3. * యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు అధికంగా ఉండే తేనె మంచి యాంటీసెప్టిక్‌ కూడా.
  4. * తేనెలోని న్యూట్రాసూటికల్స్‌ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తూ శరీరంలో హానికరమైన ఫ్రీ-రాడికల్స్‌ను తొలగిస్తాయి. దాంతో క్యాన్సర్‌, హృద్రోగాలను తట్టుకునే శక్తి పెరుగుతుంది.
  5. * తేనె పుండ్లనీ గాయాలనీ త్వరగా తగ్గిస్తుంది. ఇందులోని యాంటీ మైక్రోబియల్‌ లక్షణాలవల్ల ఇది ఆటోలిటిక్‌ డెబ్రిడిమెంట్‌గా పనిచేస్తుంది. పుండ్ల నుంచి వచ్చే చెడువాసనని తొలగిస్తుంది. పచ్చిగాయాలమీద ప్రభావవంతంగా పనిచేస్తుంది. అందుకే మాంఛెస్టర్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు క్యాన్సర్‌ రోగులకు శస్త్రచికిత్స అనంతరం తేనెను వాడే ఆలోచనలో ఉన్నారు.
  6. * మచ్చల్ని మాయం చేయడంలో తేనెని మించింది లేదు.
  7. * స్థానికంగా దొరికే తేనెను తాగడంవల్ల అలర్జీలు త్వరగా రావట. తేనెటీగలు చుట్టుపక్కల మొక్కల నుంచే తేనెను సేకరించడంవల్ల ఆ పరాగరేణువులు శరీరంలో చేరి రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
• ఏ తేనె మంచిది?
తేనె ఉత్పత్తిలో వాడే పూలమీద ఆధారపడి తేనె నాణ్యత, ఔషధగుణాలూ ఆధారపడి ఉంటాయి. కేవలం ఒకే రకం పూలకన్నా రకరకాల పూల నుంచి సేకరించిన తేనెలో ఔషధగుణాలు మరీ ఎక్కువ.
  1. * తేనె ఎప్పటికీ పాడవదు. అది నిజమే అయినప్పటికీ మార్కెట్లో లభించే తేనెలన్నీ కూడా కొంతకాలానికి ముదురురంగులోకి మారుతుంటాయి. అంటే వాటిల్లో సహజంగా ఉండే కొన్ని గుణాలు దెబ్బతిన్నాయన్నమాట. అందుకే మరీ నిల్వ ఉన్నది వాడకూడదు.
  2. * తేనెలో నీటిశాతం 19% కన్నా ఎక్కువగా ఉంటే త్వరగా పులుస్తుంది. రిఫ్రాక్టోమీటర్‌ ద్వారా తేనెలోని నీటిశాతాన్ని లెక్కించవచ్చు. లేదంటే తేనెని స్పూనుతో పైకి తీస్తే వేగంగా కిందకి కారుతున్నా జారుతున్నా అందులో నీటి శాతం ఎక్కువ అని గుర్తించాలి. లేదా ప్రాసెసింగ్‌లో భాగంగా ఎక్కువగా వేడిచేయడంవల్ల గడ్డ కట్టే గుణం తగ్గిపోయిందని గుర్తించాలి. అధిక ప్రాసెసింగ్‌వల్ల సహజంగా ఉండే బ్యాక్టీరియా విటమిన్లూ ఎంజైములూ హరించుకుపోతాయి. కాబట్టి ముడి తేనె వాడటమే మేలు.
  3. * తేనె నాణ్యత కాలంమీద కూడా ఆధారపడి ఉంటుంది. పూలు ఎక్కువగా పూచే వేసవిలో తయారయ్యే తేనె మంచి వాసనతో చిక్కగా ఉంటుంది.
  4. * వడబోసిన తేనె కూడా మంచిది కాదు. తేనెలో ఉన్న పుప్పొడి వల్లే దానికి ఔషధగుణాలు ఉంటాయి. ఆ పుప్పొడి లేని తేనె పంచదారపాకంలాంటిదే. అప్పుడు చక్కెరలానే తేనె కూడా ఆరోగ్యానికి హానికరమే.
• పోషకభరితం!
చక్కెర పదార్థాల సమ్మిశ్రమమే తేనె. ఇందులో ఫ్రక్టోజ్‌ 38%, గ్లూకోజ్‌ 31%, సుక్రోజ్‌ 1%, నీరు 17%, ఇతరత్రా చక్కెరలు 9% ఉంటాయి. కేవలం చక్కెరలకే అంత చిక్కదనం ఎలా అని ఆరాతీస్తే- కూలీ ఈగలు మకరందాన్ని తీసుకువచ్చేటప్పుడు వాటిల్లోని కొన్ని ఎంజైములు అందులో కలుస్తాయి. ఆ తరవాత ఈగలన్నీ తేనెపట్టులోకి చేరి, అక్కడ రెక్కలల్లారుస్తూ ఎగరడం వల్ల మకరందంలోని నీరు ఆవిరై గాఢత పెరిగి తేనెలా మారుతుంది. అందుకే పంచదారతో పోలిస్తే తేనెలో క్యాలరీలు ఎక్కువ.
  1. * అమెరికన్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ లెక్క ప్రకారం ఒక్క టేబుల్‌స్పూను పంచదారలో 15 క్యాలరీలు ఉంటే, తేనెలో 64 క్యాలరీలు ఉంటాయి. పంచదారతో పోలిస్తే చాలా ఎక్కువ. కానీ తేనెలోని పిండిపదార్థాలు సులభంగా గ్లూకోజ్‌గా మారిపోవడంతో తేలిగ్గా జీర్ణమవుతాయి. అందుకే అథ్లెట్లకు తేనె తక్షణ శక్తిగా పనిచేస్తుంది.
  2. * తేనెలో విటమిన్‌-సి, కాల్షియం, ఐరన్‌, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌, జింక్‌, సోడియం... వంటి ఖనిజాలతోబాటు విటమిన్లూ ప్రొటీన్లూ అమైనోఆమ్లాలూ ఉంటాయి. పోషకలేమితో బాధపడేవాళ్లకి తేనె మంచి పోషకాహారం.
• సౌందర్యలేపనం!
చర్మ సౌందర్యానికి తేనెకు సాటిలేదు. మొహానికి ప్యాక్‌లా వేయడం వల్ల చర్మం పునరుజ్జీవితమవుతుంది. ఇది సహజ మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. ఎండిపోయినట్లున్న చర్మం చక్కని నిగారింపుని సంతరించుకుంటుంది. పెదాలను సైతం పగలనివ్వదు. తేనెవల్ల పొడిబారిన జుట్టు కూడా మృదువుగా మారుతుంది.ఇన్ని సుగుణాలున్నాయి కాబట్టే కవి హృదయం మంచిమనసుల్ని తేనెమనసులనీ మంచిమాటల్ని తేనెపలుకులనీ అధరసౌందర్యాన్ని తేనెలూరే పెదాలనీ వర్ణిస్తూ తేనెని మంచికి పర్యాయపదంగా మార్చేసింది.

మధుమేహానికి సెనగల మందు..!

సెనగలు... పెళ్ళిళ్ళకూ, పేరంటాలకూ, ఇంట్లో జరిగే ఇతర ఫంక్షన్లకూ చాలామంది ఎక్కువగా వాడే అపరాలు (కాయధాన్యాలు). నల్ల సెనగల్ని నీళ్ళలో నానబెట్టి, ఆ నానబెట్టిన సెనగల్ని పిల్లలకూ, పెద్దలకూ పంచడం ఊళ్ళలో మనం తరచూ చూసే దృశ్యం. అందరికీ అందుబాటులో, చౌకగా దొరికే ఈ నల్ల సెనగలతో తాజాగా మరో ఆరోగ్య ప్రయోజనం కూడా వెలుగులోకి వచ్చింది. భోజనం చేయడాని కన్నా ముందు మొలకెత్తిన సెనగలు తింటే, మధుమేహ వ్యాధి వచ్చే రిస్కును తగ్గించుకోవచ్చని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది.
మనం సర్వసాధారణంగా వాడే మూడు రకాలైన అపరాల మీద ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ (ఐ.ఐ.సి.టి)కి చెందిన శాస్త్రవేత్తల బృందం అధ్యయనం జరిపింది. సెనగలు,పెసలు, అలాగే సెనగ గింజలలో మరో రకమైన కాబూలీ చన్నాలను ఈ బృందం పరిశీలించింది. కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసుకోవడాన్ని నియంత్రించడంలో ఆ మూడింటి సామర్థ్యాన్నీ ఒకదానితో మరొకటి పోల్చి చూసింది.
పిండిపదార్థాలతో కూడిన ఆహారం తీసుకున్న తరువాత ఒంట్లోని షుగర్‌ స్థాయిలను తగ్గించడంలో సెనగలు సమర్థంగా పనిచేస్తున్నాయని ఆ అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు 50 గ్రాముల మొలకెత్తిన సెనగలను భోజనానికి ముందు తినడం వల్ల ఈ ఉపయోగం ఉందని వారు తేల్చారు. అలా సెనగల్ని భోజనానికి ముందు తినడం వల్ల రక్తంలోని గ్లూకోజ్‌ స్థాయికి అది పగ్గం వేస్తుంది. అలా కాకుండా మామూలుగా అయితే, భోజనం చేసిన వెంటనే మనం తీసుకున్న ఆహారంలోని కార్బోహైడ్రేట్ల పుణ్యమా అని ఒంట్లో షుగర్‌ స్థాయి ఉన్నట్టుండి పెరిగిపోతుందని ఏ.కె. తివారీ అనే శాస్త్రవేత్త నేతృత్వంలోని ఈ బృందం నిర్ధారణ చేసింది.
మధుమేహ వ్యాధిగ్రస్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఏ యే రకాల మొలకెత్తిన ధాన్యాలు అత్యంత ఉపయోగకరమో తెలుసుకోవడం కోసం ఈ అధ్యయనం సాగించారు. ''సర్వసాధారణంగా ఈ మొలకెత్తిన ధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని అందరికీ తెలుసు. అయితే, ఒంట్లో చక్కెర స్థాయి పెరిగిపోకుండా చూసేందుకు సెనగలు ప్రత్యేకించి ఉపయోగపడతాయని ఇప్పుడు మా అధ్యయనంలో తేలింది. భోజనానికి ముందు మొలకెత్తిన సెనగలు తింటే, మధుమేహ వ్యాధిగ్రస్థులకు బాగా పనిచేస్తుంది. ఆ వ్యాధి రావడాన్ని జాప్యం చేయడానికీ, కొందరికైతే ఆ వ్యాధే రాకుండా నిరోధించడానికీ సెనగలు ఉపకరిస్తాయి'' అని శాస్త్రవేత్తల బృందం పేర్కొంది.
పచ్చి సెనగల్ని నీళ్ళలో నానబెట్టి, మొలకెత్తగానే వాటికి ఏమీ కలుపుకోకుండా అలాగే తినాలని వారు చెబుతున్నారు. వాటిలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వాటిని మన జీర్ణ వ్యవస్థ తొందరగా శోషించుకోలేదు. పైపెచ్చు, త్వరితగతిన జీర్ణక్రియ సాగడాన్ని నిరోధించే దీనిలోని అంశాలు కార్బోహైడ్రేట్లు వేగంగా ఒంట్లో శోషణ కాకుండా చూస్తున్నాయి. దాంతో, సెనగల లాంటివి మధుమేహంతో బాధపడుతున్నవారికీ, బాధపడే అవకాశమున్నవారికీ దివ్యౌషధమనే చెప్పాలి. ఈ తాజా అధ్యయనం ఫలితాలు 'జర్నల్‌ ఆఫ్‌ ఫార్మసీ అండ్‌ బయో - ఎలైట్‌ సైన్సెస్‌'లో ప్రచురితమయ్యాయి.

Saturday, January 14

వేడి నీటిని త్రాగడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి...

# వేడి నీరు త్రాగడం వలన ఎప్పటికీ మధుమేహం రాదు.
# ఆర్ధ్రరైటీస్ రాదు .
# కీళ్ళ నొప్పులు బాగా బాధించే వారికి ఆర్ధ్రరైటీస్ సమస్యలు రావు .
# కడుపు ఎప్పటికీ చెడిపోదు .
# ఉదర సమస్యలు , గొంతు సమస్యలు రానే రావు .
# దగ్గు కూడా రాదు .
# పడిశం పట్టదు . జలుబు రాదు .
# న్యూమోనియా వచ్చే అవకాశము లేదు .
#ఎప్పటికీ శరీరం అనవసరంగా బరువు పెరగటం జరుగదు . స్దూలకాయం రాదు .
వేడి నీటిని త్రాగడం వలన మనకు కలిగే ప్రధానమైన ఉపయోగం *మనం వైద్యుణ్ణి సంప్రదించవలసిన అవసరమే రాదు.*
*వేడి నీళ్ళు త్రాగే పద్ధతి :-*
ఉదయమే నిద్రలేచి ఒకటి లేక రెండు గ్లాసులు వీలైతే మూడు గ్లాసులు గోరు వెచ్చని నీరు త్రాగాలి . ఆ తరువాతనే మీరు శౌచక్రియలు , కాలకృత్యాలు తీర్చుకోవాలి . ఇది చాల విలువైన *ఔషధం* . మీరు జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే , మీకు ఔషధాలు అవసరం లేకుండా ఉండాలంటే , మనం ఎప్పుడూ రోగగ్రస్తులం కాకుండా పూర్తిశక్తి సామర్ధ్యాలతో ఉండాలంటే , అందుకు ఇది ఒక్కటే అత్యుత్తమమైన ఔషధం .
* గమనిక :- మీరు నీళ్ళు ఎప్పుడు త్రాగినా గుటక గుటకగా చప్పరిస్తూ త్రాగవలెను .

Thursday, January 12

మ‌ధుమేహం, క్యాన్స‌ర్‌ల‌కు విరుగుడు ఆగాక‌ర‌..!

ఆగాక‌ర‌, ఆకాక‌ర‌, అడ‌వి కాక‌ర‌, బొంతు కాక‌ర‌, బోడ కాక‌ర‌... ఇలా ఈ కూర‌గాయ‌కు చాలా పేర్లే ఉన్నాయి. కాక‌ర‌కాయంత పొడ‌వుగా ఉండ‌దు, దానంత చేదు కూడా ఉండ‌దు. కానీ ఆగాక‌ర‌లో పోష‌కాలు మాత్రం ఎక్కువే ఉంటాయి. వీటిని మ‌న ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఆగాక‌ర కాయ‌లు మ‌ధుమేహం ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తాయి. ఇవి ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. ఇన్సులిన్ లెవ‌ల్స్ ‌ను పెంచుతాయి. మ‌ధుమేహం వ‌ల్ల వ‌చ్చే ఇతర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కూడా దూరం చేస్తాయి.
2. ఆగాక‌ర కాయ‌ల్లో పైటో న్యూట్రియంట్లు స‌మృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్స‌ర్‌ల‌ను న‌యం చేస్తాయి. క్యాన్స‌ర్ క‌ణ‌తుల‌ను పెర‌గ‌నీయ‌కుండా అడ్డుకుంటాయి. క్యాన్స‌ర్ కార‌కాల‌ను నాశ‌నం చేస్తాయి.
3. ఆగాక‌ర కాయ‌ల్లో ఫొలేట్ అధిక మొత్తంలో ఉంటుంది. ఇది చిన్న పిల్ల‌ల‌కు, గ‌ర్భిణీ స్త్రీలకు ఎంత‌గానో అవ‌స‌ర‌మైన ముఖ్య‌మైన పోష‌కం. దీంతో గ‌ర్భ‌స్థ శిశువు చ‌క్క‌గా ఎదుగుతుంది.
4. ఆగాక‌ర కాయ‌ల్లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది. ఇది శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తుంది. ఇన్‌ఫెక్ష‌న్ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతుంది. ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల క‌లిగే న‌ష్టాన్ని నివారిస్తుంది.
5. ఆగాక‌ర కాయ‌ల్లో ఫ్లేవ‌నాయిడ్లు కూడా స‌మృద్ధిగానే ఉంటాయి. ఇవి యాంటీ ఏజింగ్ గుణాల‌ను క‌లిగి ఉంటాయి. ఇందు వ‌ల్ల వృద్ధాప్య ఛాయ‌లు అంత త్వ‌ర‌గా ద‌రి చేర‌వు.
6. ఆగాక‌ర‌లో విట‌మిన్ ఎ కూడా బాగానే ఉంటుంది. ఇది దృష్టి సంబంధ స‌మ‌స్య‌లను తొల‌గిస్తుంది.
7. మూత్ర‌పిండాలు, మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు ఉన్న వారు నిత్యం ఆగాక‌ర కాయ‌ల‌ను తింటుంటే ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
8. జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగు ప‌డుతుంది. గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం, మ‌ల‌బ‌ద్ద‌కం వంటి స‌మ‌స్య‌ల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

Monday, January 9

కొబ్బరి తింటున్నారా!

ఇంట్లో కొబ్బరి ఉందంటే పచ్చడి చేయడమో, కూరల్లో వేయడమో మనలో చాలామంది చేసేదే. అసలు కొబ్బరి ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుందో తెలుసా? 

* పచ్చి కొబ్బరిలో యాంటీ వైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. నాలుగైదు ముక్కలు తింటే చాలు శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. ఎక్కువగా ఆటలాడే పిల్లలకూ దీన్ని పెట్టొచ్చు.
* కొబ్బరి తినడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. చర్మానికీ మేలు జరుగుతుంది. వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉంటాయి.
* గుండె సంబంధిత సమస్యలున్నవారు కొబ్బరి తింటే మంచిది. ఇందులో మేలు చేసే కొలెస్ట్రాల్‌ ఉంటుంది. అది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి కూడా కొబ్బరి మంచిదే.
* థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు కొబ్బరి తినడం వల్ల ఆ సమస్య అదుపులో ఉంటుంది. అలానే మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌లూ తగ్గుముఖం పడతాయి.
* రాగి, సెలీనియం, ఇనుము, మాంగనీస్‌, ఫాస్పరస్‌, జింక్‌ వంటి పోషకాలు ఇందులో లభిస్తాయి. ఇవన్నీ శరీరానికి అందడం వల్ల జీవక్రియ రేటు సరిగా ఉంటుంది. ఎముకలూ, చర్మం, గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
* పచ్చికొబ్బరిలో బికాంప్లెక్స్‌ విటమిన్లు, ఫొలేట్లు, రైబోఫ్లెవిన్‌, నియాసిన్‌, థయామిన్‌ లభిస్తాయి. తరచూ నోటిపూతతో బాధపడేవారు కొబ్బరి తిన్నా, కొబ్బరి పాలు తాగినా ఈ పోషకాలు అంది, ఆ సమస్య త్వరగా తగ్గుతుంది.

వెన్ను నొప్పి త‌గ్గాలంటే ఈ స‌హ‌జ సిద్ధ‌మైన టిప్స్‌ను పాటించండి..!

నిత్యం ఉరుకుల ప‌రుగుల బిజీ జీవితం… ఆందోళ‌న‌, మాన‌సిక ఒత్తిడి, ప్ర‌యాణాలు, ఎక్కువ సేపు నిల‌బ‌డి ఉండడం, ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌దిత‌రాల కార‌ణంగా నేడు అనేక మందిని వెన్ను నొప్పి బాధిస్తోంది. దీంతో అలాంటి వారు చెప్ప‌లేని బాధ‌ను అనుభ‌వించాల్సి వ‌స్తోంది. ఈ క్ర‌మంలో ఆ నొప్పి ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు కూడా దారి తీస్తోంది. అయితే కింద ఇచ్చిన ప‌లు స‌హ‌జ సిద్ధ‌మైన టిప్స్‌ను పాటిస్తే వెన్ను నొప్పిని ఎఫెక్టివ్‌గా త‌గ్గించుకోవ‌చ్చు...


1. కొద్దిగా కొబ్బ‌రినూనె తీసుకుని అందులో కొంత కర్పూరం వేయాలి. అనంత‌రం 5 నిమిషాల పాటు ఈ మిశ్ర‌మాన్ని వేడి చేయాలి. చ‌ల్లారే దాకా ఆగి ఆ మిశ్ర‌మాన్ని ఏదైనా బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. దీన్ని రోజూ సాయంత్రం నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు స‌మ‌స్య ఉన్న ప్రాంతంలో సున్నితంగా మ‌ర్ద‌నా చేస్తూ రాయాలి. దీంతో వెన్ను నొప్పి త‌గ్గుతుంది.
2. గోరు వెచ్చని నీటిలో కొంత యూక‌లిప్ట‌స్ ఆయిల్ క‌లిపి ఆ నీటితో స్నానం చేయాలి. దీంతో వెన్ను నొప్పి మాత్ర‌మే కాదు, ఇత‌ర నొప్పులు కూడా త‌గ్గిపోతాయి.
3. కొంత గ‌ల్లు ఉప్పు (స‌ముద్ర‌పు ఉప్పు) తీసుకుని దాన్ని పెనంపై వేడి చేయాలి. అనంత‌రం ఆ ఉప్పు వేడిగా ఉండ‌గానే దాన్ని ఒక శుభ్ర‌మైన క్లాత్ పీస్‌లోకి తీసుకుని దాంతో స‌మ‌స్య ఉన్న ప్ర‌దేశంలో కాపడం పెట్టుకోవాలి. ఇలా చేసినా వెన్ను నొప్పి త‌గ్గుతుంది.
4. ఆవ‌నూనెను వెన్నుపై పోసి బాగా మ‌ర్ద‌నా చేయాలి. అనంత‌రం ఒక గంట ఆగి స్నానం చేయాలి. అయితే స్నానం వేడి నీటితో చేయాల్సి ఉంటుంది. దీంతో నొప్పి త‌గ్గుతుంది.
5. ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో చిటికెడు ప‌సుపు, కొన్ని చుక్క‌ల తేనెను క‌లిపి నిత్యం నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు తాగాలి. దీంతో నొప్పులు త‌గ్గుతాయి. అంతేకాదు ఈ మిశ్ర‌మం జ‌లుబు, ద‌గ్గుల‌కు కూడా ప‌నిచేస్తుంది.
6. అల్లం బాగా వేసి త‌యారు చేసిన టీని తాగినా వెన్ను నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
7. హెర్బ‌ల్ ఆయిల్‌తో వెన్నును బాగా మ‌సాజ్ చేసి, వేడి నీటితో స్నానం చేయాలి. ఇలా చేసినా నొప్పి త‌గ్గుతుంది.
8. గ‌ల్లు ఉప్పుతో పైన చెప్పిన విధంగానే బియ్యంతో కూడా చేసిన‌ట్ట‌యితే వెన్ను నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.