Sunday, February 26

కరివేపాకు కొబ్బరినూనె రెండూ కలిపిరాస్తే రాలిపోయిన జుట్టు తిరిగొస్తుంది...

పొడవైన, అందమైన మెరిసే జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అయితే పొడవైన జుట్టును కాపాడుకోవడం ఆడవాళ్లకు సవాల్ గా మారింది. ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యల నుండి బయట పడటం చాలా కష్టంగా మారింది. ఆరోగ్యమైన, బలమైన జుట్టు నిర్వహణకు కొన్ని సాధారణ వంట ఇంటి నివారణలున్నాయి. జుట్టు సమస్యల పరిష్కారానికి కరివేపాకు బాగా సహాయపడుతుంది. కరివేపాకులో బీటా – కెరోటిన్ మరియు ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. అంతేకాదు యాంటీ ఆక్సిడెంట్లు సైతం పుష్కలంగా ఉండడం వల్ల తలపై చర్మానికి కావల్సిన తేమను అందించి చుండ్రు నుంచి విముక్తి కలిగిస్తాయి. కరివేపాకుతో కొబ్బరి నూనె కలిస్తే జుట్టు పెరుగుదలలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.
ఇలా చేయాలి:-
ఒక గిన్నెలో కరివేపాకు, కొబ్బరి నూనె వేయాలి. కరివేపాకు నల్లగా అయ్యేవరకు మరిగించాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద నుంచి దించి చల్లారాక జుట్టుకు పట్టించాలి. ఒక గంట తర్వాత తేలికపాటి గాడతలేని షాంపూతో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమం జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ విధంగా వారానికి రెండు సార్లు ఒక నెల పాటు చేస్తే మంచి పలితం కనపడుతుంది. ఈ మిశ్రమంతో వెంట్రుకలు పెరగడమే కాకుండా చిన్న వయసులో జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది.
హెయిర్ మాస్క్ ను తయారు చేయండి:-
కొన్ని తాజా కరివేపాకు ఆకులను గ్రైండ్ చేసి పేస్ట్ లా తయారు చేయండి. ఈ మిశ్రమానికి పెరుగుతో కలిపి పేస్ట్ గా మార్చి తలపై చర్మానికి నేరుగా అప్లయ్ చేయండి. ఇలా 30నిమిషాల పాటు అలానే ఉంచి నీటితో కడిగేయండి. ఈ మాస్క్ ను ప్రతివారం ఒకసారి వాడడం వల్ల జుట్టు పెరుగుదల మెరుగుపడడే కాకుండా వెంట్రుకలు కాంతివంతంగా, మృదువుగా వస్తాయి.

Friday, February 24

శివరాత్రి కి ఏం చేయాలి? ఎలా జరుపుకోవాలి? ఎలాఉండలి?

సనాతన సంస్కృతిలో పండుగలంటే కేవలం విశ్రాంతి కోసమో, ఆహ్లాదం కోసమో ఉద్ద్యేశించబడినవి కావు. ప్రతి సంబరంలోనూ ఆధ్యాత్మికత, దైవికత ఉంటుంది. ప్రతి పండుగకు వైజ్ఞానిక, ఆరోగ్య, శాస్త్రీయ కారణాలుంటాయి. అంతరిక్షం నుంచి ప్రసరించే కాస్మిక్ కిరణాలను, విద్యుత్ అయస్కాంత్ తరంగాలను దృష్టిలో ఉంచుకుని, ఏ రోజున ఏ పని చేయడం వలన మనిషి జీవనం వికసిస్తుందో, ఇంతకముందు ఉన్న స్థితి నుంచి మరింత గొప్ప స్థితికి ఎదిగే అవకాశం లభిస్తుందో, గమనించి ఆయా రోజులలో ప్రత్యేక పర్వదినాలు ఏర్పరిచారు మన #మహర్షులు.
శివరాత్రే యోగరాత్రి. శివరాత్రికి రోజు ప్రకృతిలో ఉండే తరంగాలు, అంతరిక్షం నుంచి వెలువడే కాస్మిక్ కిరణాలు విశ్వ మానవ వికాసానికి, మనిషి తన పరిపూర్ణమైన రూపాన్ని తెలుసుకోవడానికి, ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడుతాయి. అందుకే శివరాత్రికి కొన్ని ప్రత్యేక నియమాలు విధించారు.
1.ఉపవాసం
శివరాత్రికి చేసే ఉపవాసానికి, జాగరణకు విశేష ప్రాధాన్యం ఉంది. #శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చేయాలి. చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది శాస్త్రం.
ఉపవాసం ఉండే ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు మాంసాహారం, గుడ్డు మొదలైనవి తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఎలాగూ ఉపవాసం చేస్తున్నాం కదా, ఉదయం లేస్తే ఆకలి తట్టుకోవడం కష్టమని, ఆలస్యంగా లేస్తారు కొందరు. అలా చేయకూడదు. ఉపవాసం ఉండేరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలపై నుంచి స్నానం చేసి, ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి అర్ధం దగ్గరగా ఉండడం అని. భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్ధాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును తిప్పడం కష్టం.
2. #జీవారాధాన
అట్లాగే మీరు ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగిలుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అష్టమూర్తి తత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే అవుతుంది. అందుకే స్వామి వివేకానంద 'జీవారాధానే శివారాధాన' అన్నారు. ఉపవాస నియమాలు కూడా అవే చెప్తాయి.
శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం లాంటివి చేయకుండా, మీ వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, నిలబడాలి.
3. #మౌనవ్రతం
శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం చాలా అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసికప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించవద్దు. వ్రతంలో త్రికరణములు (మనోవాక్కాయములు) ఏకం కావాలి. మనసును మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివుని పై కేంద్రీకరించాలి. అవసరమైతే శివాలయానికి వెళ్ళండి, అక్కడ రుద్రాభిషేకం చేస్తారు. రుద్రం ఒకసారి చదవటానికి అరగంట పడుతుంది. మీరు అభిషేకం చేయించుకోకపోయిన ఫర్వాలేదు, శివాలయంలో ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులచే చదవబడుతున్న రుద్ర - నమకచమకాలను వినండి. ఆ తర్వాత వచ్చే ఫలితాలను చూడండి.
ఉద్యోగస్తులు, ముఖ్యంగా ప్రైవేటు రంగంలో పని చేస్తున్నవారికి ఆ రోజు సెలవు ఉండకపోవచ్చు. విదేశాల్లో చదువుతున్న విద్యార్ధులకు అదే పరిస్థితి ఎదురుకావచ్చు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? అవసరమైంతవరకే మాట్లాడండి, అనవసరమైన మాటలు కట్టిపెట్టండి. ఎవరితోను గొడవ పడకండి, తిట్టకండి. సాధ్యమైనంత తక్కువ మాట్లాడండి. ఇంటి వచ్చాక, కాళ్ళుచేతులు ముఖం శుభ్రపరుచుకుని, శివుడి ముందో, ఆలయంలోనో కాసేపు కన్నులు మూసుకుని మౌనంగా కూర్చోండి.
4.అభిషేకం
శివుడు అభిషేక ప్రియుడు. శివుడికి కాసిన్ని నీరు పోసిన, సంతోషంతో పొంగిపోతాడు. శివరాత్రి నాడు అందరూ వర్ణ, లింగ, జాతి, కుల భేధం లేకుండా శివుడిని అర్చించడం వలన, అభిషేకించడం వలన సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది.
5.#జాగరణ
శివరాత్రికి చేసే జాగరణ మనలో ఉన్న శివత్వాన్ని జాగృతం చేస్తుంది. జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది, తమస్సును తొలగిస్తుంది. సినిమాలు చూస్తునో, పిచ్చి కబుర్లు చెప్పుకుంటూనో, కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణకు అది జాగరణ అవ్వదు, కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యం రాకపోగా, ఆ సమయంలో మట్లాడిన చెడు మాటల వలన పాపం వస్తుంది.
6.మంత్ర జపం
శివరాత్రి మొత్తం శివనామంతో, ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మహామంత్ర జపం/స్మరణతో జాగరణ మీలో నిక్షిప్తమై ఉన్న అనంతమైన శక్తిని జాగృతం చేస్తుంది. #శివోహం అనే భావనను కలిగిస్తుంది.
శివరాత్రి మరునాడు ఉదయం శివాలయాన్నిసందర్శించి, ప్రసాదం తీసుకుని, ఇంటికి వచ్చి భోజనం చేసి ఉపవాస వ్రతం ముంగించాలి. అందరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్య విషయం, శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసినవారు, తరువాతి రోజు రాత్రి వరకు నిద్రించకూడదు. అప్పుడే సంపూర్ణఫలం దక్కుంతుదని చెప్తారు.kunapuli

Wednesday, February 22

షుగ‌ర్‌ను కంట్రోల్ చేసే స్మాల్ చిట్కాలు..?

మ‌న‌దేశంలో రోజు రోజుకు డ‌యాబెట‌స్ వ్యాధిగ్ర‌స్తులు ఎక్కువ‌వుతున్నారు. డ‌యాబెటిస్ ప్ర‌ధానంగా టైప్-1, టైప్‌-2 అని రెండు రకాలుగా ఉంటుంది. అయితే ఏ త‌రహా షుగ‌ర్ వ్యాధి వ‌చ్చినా దాంతో ప్ర‌మాద‌మే. మ‌నం నిత్యం తీసుకునే ఆహారంలో కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే అవి షుగ‌ర్‌ను కంట్రోల్ చేస్తాయి. ఆవేంటో చూద్దాం...
– దాల్చిన చెక్క‌కు ర‌క్తంలోని చ‌క్కెర‌ను అదుపు చేసే గుణం ఉంది. ఇందులో ఇన్సులిన్ త‌ర‌హా ఔష‌ధ గుణాలు పుష్క‌లంగా ఉన్నాయి. ఇవి ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను త‌గ్గిస్తాయి. అయితే దాల్చిన చెక్క‌ను ఎలా వాడాలంటే… దీనికి చెందిన పొడిని 3 టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకుని ఒక లీట‌ర్ నీటిలో వేసి మ‌రిగించాలి. 20 నిమిషాల పాటు ఆ నీరు బాగా మ‌రిగాక వ‌చ్చే ద్ర‌వాన్ని వ‌డ‌క‌ట్టి రోజూ ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి అర‌గంట ముందు తాగాలి. దీంతో కేవ‌లం కొద్ది రోజుల్లోనే షుగ‌ర్ వ్యాధి అదుపులోకి వ‌స్తుంది.
– టైప్‌-1 డ‌యాబెటిస్‌ను స‌మ‌ర్థ‌వంతంగా న‌యం చేసే గుణాలు తేనెలో ఉన్నాయి. టైప్‌-1 డ‌యాబెటిస్ ఉన్న‌వారు తేనెను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకుంటే దాంతో వారి షుగ‌ర్ స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.
– వెల్లుల్లిలో అలియం సాటివం అనే ఓ ర‌క‌మైన ర‌సాయ‌నం స‌మృద్ధిగా ఉంటుంది. ఇది టైప్‌-2 డ‌యాబెటిస్ వ్యాధిగ్ర‌స్తుల‌కు మంచిది. ఇది వారి ర‌క్తంలోని గ్లూకోజ్ స్థాయిల‌ను అదుపు చేస్తుంది.
– నిత్యం ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున కొన్ని వెల్లుల్లి రేకుల్ని అలాగే ప‌చ్చిగా తింటుంటే దాంతో షుగ‌ర్ వ్యాధి నియంత్ర‌ణ‌లో ఉంటుంది.
– ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను త‌గ్గించే గుణాలు క‌రివేపాకులోనూ ఉన్నాయి. వీటిలోని ఔష‌ధ కార‌కాలు డ‌యాబెటిస్‌ను అదుపు చేస్తాయి. నిత్యం ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి అర‌గంట ముందుగా గుప్పెడు క‌రివేపాకు ఆకుల‌ను తింటే దాంతో చ‌క్కెర వ్యాధి న‌యం అవుతుంది.
– జామ ఆకులు కొన్నింటిని తీసుకుని నీడ‌లో ఎండ‌బెట్టి పొడి చేసుకోవాలి. దీనికి 3 గ్రాముల జీల‌కర్ర పొడి క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని ఒక గ్లాస్ నీటిలో క‌లిపి ఆ నీటిని వ‌డ‌క‌ట్టి తాగేయాలి. ఇలా చేస్తే షుగ‌ర్ వెంట‌నే అదుపులోకి వ‌స్తుంది.
– ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున 8 గ్లాసుల నీటిని తాగి గంట పాటు వాకింగ్ చేయాలి. ఇలా చేసినా షుగ‌ర్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కోవ‌చ్చు.
– మీఠీ ప‌త్తి అని పిల‌వ‌బ‌డే ఓ మొక్క ఆకులు కూడా బ్ల‌డ్ షుగ‌ర్‌ను అదుపు చేస్తాయి. దీన్ని స‌హ‌జ సిద్ధ‌మైన తీపి ప‌దార్థంగా షుగ‌ర్ వ్యాధిగ్ర‌స్తులు వాడుకోవ‌చ్చు కూడా.
– బీట్‌రూట్ దుంప‌, మెంతి ఆకు లేదా మెంతుల పొడి, క‌ల‌బంద‌, వేప‌, తుల‌సి వంటి మొక్క‌ల ఆకుల‌ను ఉద‌యం, సాయంత్రం తింటున్నా షుగ‌ర్ వ్యాధిని అదుపులోకి తేవ‌చ్చు.
– పొడ‌ప‌త్రి ఆకు చూర్ణం నిత్యం ఉద‌యం, సాయంత్రం భోజ‌నానికి అర గంట ముందు నీళ్ల‌లో క‌లిపి తాగాలి. దీని వ‌ల్ల కూడా షుగ‌ర్ అదుపులోకి వ‌స్తుంది.

Monday, February 20

జ‌లుబు, జ్వ‌రం త‌గ్గాలంటే.. ఈ మిశ్ర‌మాన్ని తీసుకోవాలి…

              ఉసిరి కాయ‌ల్లో, తేనెలో ఎంత‌టి పోష‌కాలు ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ ఫంగ‌ల్ వంటి గుణాల‌తోపాటు శ‌రీర వ్యాధినిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేసే ఎన్నో గుణాలు ఈ రెండింటిలోనూ ఉన్నాయి. అయితే వీటిని క‌లిపి మిశ్ర‌మంగా తీసుకుంటే మ‌న‌కు క‌లిగే ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను సుల‌భంగా దూరం చేసుకోవ‌చ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం...
                 ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ జ్యూస్‌లో ఒక టీస్పూన్ తేనెను క‌లిపి ప్రతి రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి. దీంతో కింద చెప్పిన ప‌లు అనారోగ్యాలు దూర‌మ‌వుతాయి.

1. పైన చెప్పిన ఉసిరి జ్యూస్‌, తేనె మిశ్ర‌మం వ‌ల్ల ఊపిరితిత్తుల్లో ఉండే బాక్టీరియా పోతుంది.
2. జ‌లుబు, ద‌గ్గు, ఫ్లూ జ్వ‌రం త్వ‌ర‌గా త‌గ్గుతుంది. వ్యాధి నిరోధ‌క శ‌క్తి బాగా పెరుగుతుంది.
3. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణం వంటివి త‌గ్గిపోతాయి. మ‌లబ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
4. సైన‌స్‌, ఆస్త‌మా వంటి శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది.
5. దృష్టి సంబంధ స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. జుట్టుకు మేలు జ‌రుగుతుంది. వెంట్రుక‌లు దృఢంగా పెరుగుతాయి.
6. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. చ‌ర్మానికి మృదుత్వం చేకూరుతుంది.

Sunday, February 19

వారానికి రెండు సార్లు చేపల పులుసు తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?

లండన్ వైద్యులు చెప్పిన అద్బుత రహస్యం..

వారానికి కనీసం రెండు సార్లు చేపలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? లండన్ వైద్యులు చెప్పిన దానిని మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అవును..ఇప్పుడు ప్రపంచాన్ని పీడిస్తున్న వాటిలో షుగర్ వ్యాధి ఒకటి.. ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. ఇందులో రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి టైప్‌-1, మ‌రొక‌టి టైప్-2. క్లోమ గ్రంథి అస్స‌లు ప‌నిచేయ‌క‌పోతే టైప్‌-1, ప‌నిచేస్తున్నా దాన్నుంచి విడుద‌ల‌య్యే ఇన్సులిన్ ను శ‌రీరం స‌రిగ్గా తీసుకోక‌పోతే అప్పుడు టైప్‌-2 మ‌ధుమేహం వ‌స్తాయి. అయితే ఏది వ‌చ్చినా ఆయా వ్య‌క్తుల శ‌రీరాల్లో గ్లూకోజ్ ఎప్పుడూ ర‌క్తంలో ఉండాల్సిన ప‌రిమాణం క‌న్నా ఎక్కువ‌గానే ఉంటుంది. ఈ క్ర‌మంలో ఈ వ్యాధి శ‌రీరంలో అనేక అవ‌యవాలను ప‌నిచేయ‌కుండా చేస్తుంది. అలాగ‌ని మ‌ధుమేహం మందులకు లొంగేది కాదు. నియంత్ర‌ణ‌తోనే దీన్ని లొంగ‌దీయ‌వ‌చ్చు. అయితే ఎన్నో ర‌కాల డ‌యాబెటిక్ మందులు ఆయా వైద్య విధానాల్లో మన‌కు అందుబాటులో ఉన్నా వారానికి రెండు సార్లు చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.
         ఇది చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు లండన్ వైద్యులు. మధుమేహం కారణంగా అనేక అనారోగ్య సమస్యల వస్తాయని తెలుసు. రోగాలే కాక కంటిచూపు తగ్గుతుందనే విషయం తెలిసిందే. అయితే ఈ సమస్యకు పరిష్కారం వారానికి రెండుసార్లు చేపలను తినడమేనని సూచిస్తున్నారు వైద్యులు. మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడంలో ఒమేగా ఆమ్లాలు క్రియాశీలంగా వ్యవహరిస్తాయని, అందుకే ఇవి పుష్కలంగా ఉండే చేపలను తినడం ద్వారా కంటిచూపును మెరుగుపర్చుకోవచ్చని చెబుతున్నారు. అయితే వారానికి రెండుసార్లు చేపలు తినడం.. 500 మిల్లీ గ్రాముల ఒమేగా–3తో సమానమంట. ఇటీవల లండన్ కు చెందిన డాక్టర్లు 55 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసున్న 3,614 మంది టైప్–2 డయాబెటిస్ రోగులకు వారానికి 500 మిల్లీగ్రాముల ఒమేగా–3 ఆమ్లాలను ఆహారంలోభాగంగా ఇచ్చారు. దీంతో వారిలో డయాబెటిస్ దుష్ఫలితాలు 48 శాతం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.

Sunday, February 12

సిగరెట్ దుష్ప్రభావాన్ని తగ్గించే ఆహారాలు ఇవిగో...

సిగరెట్ శరీరానికి ఎన్నిరకాలుగా అపకారం చేస్తుందో మేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అదంతా మీకు తెలిసిన విషయమే. ఇక సిగరెట్ ఊపిరితిత్తులకి అంతలా హాని తలపెట్టడానికి కారణం నికోటిన్ అనే హానికరమైన టాక్సిన్ అన్న సంగతి కూడా మీకు తెలిసే ఉంటుంది. ఈ నికోటిన్ వలనే శ్వాసలో ఇబ్బందులు, ఈ నికోటిన్ వలనే హై బ్లడ్ ప్రెషర్, ఈ నికోటిన్ వలనే బాడిలో ఎక్కడలేని మలీనాలు. అందుకే మొదట సిగరెట్ అలవాటు మానెయ్యాలి. అయినా నికోటిన్ పూర్తిగా ఒంట్లోంచి బయటకి పోదు. నికోటిన్ ని బయటకి తోయాలంటే డైట్ లో ఈ పదార్థాలు చేర్చుకోవాల్సిందే...

* అసలు రోజు మంచినీరు బాగా తాగే అలవాటే ఉంటే, రోగాలు దగ్గరకి రావడం కూడా కష్టమే. కాబట్టి సిగరెట్ కంపుని, అది మోసుకొచ్చిన ప్రాణాంతక నికోటిన్ ని మంచినీళ్ళు రోజు బాగా తాగి బయటకి తరమండి.
* ఆరెంజ్ లో విటమిన్ సి ఉంటుందని రోజు చదువుకుంటున్నాం. ఇది మెటబాలిజం ని మెరుగుపరిచి నికోటిన్ సాధ్యమైనంత త్వరగా బయటకి వెళ్ళేలా చేస్తుంది.
* దానిమ్మ బ్లడ్ సర్కులేషన్ ని మెరుగుపరుస్తుంది. దాంతో నికోటిన్ బయటకి ఫ్లష్ అవటం సునాయాసం అవుతుంది. కాబట్టి స్మోకింగ్ హ్యాబిట్ మానేసి రోజుకో దానిమ్మ తినాలి.
* అరేంజ్ లో ఉన్నట్టే బ్రోకోలిలో కూడా విటమిన్ సి ఉంటుంది. దాంతోపాటు విటమిన్ బి5 కూడా ఉంటుంది. ఇక్కడ మీకు తెలియని విషయం ఏమిటంటే సిగరెట్ అలవాటు ఒంట్లో విటమిన్ సి శాతాన్ని తగ్గిస్తుంది. విటమిన్ సి శాతం పెరిగి, నికోటిన్ పరుగు తీయాలంటే ఆరెంజ్, బ్రోకోలి ఎక్కువగా తినాలి.
* క్యారట్ జ్యూస్ లో విటమిన్ ఏ, సి, కే, మరియు బి ఉండటం వలన స్మోకర్స్ కి క్యారట్ ని సజెస్ట్ చేస్తారు న్యూట్రిషన్ నిపుణులు.
* పాలకూరని ఇష్టపడండి. దండిగా విటమిన్లు, మినరల్స్ దొరకరడం వలన ఇది ఒంటిని లోపలినుంచి శుభ్రపరుస్తుంది. నికోటిన్ బయటపడటం తేలికవుతుంది.
* ఇవే కాక, బెర్రిస్, కీవి, డ్రై హర్బ్స్ కూడా నికోటిన్ ని బయటకి తీయడంలో సహాయపడతాయి.

Saturday, February 11

ప్రతిరోజూ 5 ఎండుద్రాక్షలు తింటే అద్భుతమైన 11 ప్రయోజనాలు. అన్నిటికంటే చర్మం బాగా మెరుస్తుంది...

ప్రతిరోజూ 5 ఎండుద్రాక్షలు తినడం వల్ల.. అనేక రకాల డైలీ ప్రాబ్లమ్స్ కి చెక్ పెట్టవచ్చు.
కంటిచూపు ఎండుద్రాక్షలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. ఇవి కళ్లను, కంటి చూపుని మెరుగుపరచడానికి సహాయపడతాయి.
పక్క తడపకుండా పిల్లల శరీరానికి ఎండుద్రాక్ష న్యాచురల్ గా వేడిని కలిగిస్తుంది. దీనివల్ల పిల్లలు పక్క తడపకుండా ఉంటారు.
ఇన్ఫెక్షన్స్ ఎండుద్రాక్షలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల.. శరీరంలో ఇమ్యునిటీని మెరుగుపరుస్తాయి. కాబట్టి ప్రతిరోజూ 5ఎండుద్రాక్షలు తీసుకుంటే.. శరీరంలో స్టామినా, ఇమ్యునిటీ రెండూ పెరుగుతాయి. రాత్రంతా ఎండుద్రాక్షను నానబెట్టి.. ఉదయం పాలు, నెయ్యిలో మరిగించి తీసుకోవాలి.
కాన్ట్సిపేషన్(మలబద్దకం) ఎండుద్రాక్షలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది తేలికగా.. కాన్ట్సిపేషన్ సమస్యను తగ్గిస్తుంది. ప్రతిరోజూ రాత్రి ఒక గ్లాసు పాలు, 10 ఎండుద్రాక్షలు తీసుకోవడం వల్ల.. కాన్ట్సిపేషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
గుండె ఆరోగ్యానికి ఎండుద్రాక్షలో పొటాషియం ఉంటుంది. ఇది నరాలు, కండరాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. పొటాషియం గుండె కొట్టుకునే వేగం నార్మల్ గా ఉండటానికి సహాయపడుతుంది. కఫ, పిత్తం వంటి సమస్యలను నివారిస్తుంది.
అనీమియా(రక్తహీనత) ఎండుద్రాక్షల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు నీటిలో 10 నుంచి 15 నల్ల ఎండుద్రాక్షలు నానబెట్టాలి. కొద్దిగా నిమ్మరసం కలపాలి. 4 నుంచి 5 గంటల తర్వాత.. ఎండుద్రాక్షను నమలాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే.. అనీమియా నుంచి తేలికగా బయటపడవచ్చు.
క్యాన్సర్ ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారక కణాలను నాశనం చేస్తాయి. కాబట్టి.. రెగ్యులర్ గా వీటిని తీసుకుంటే.. క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది.
పళ్లు స్ట్రాంగ్ అవడానికి ఎండుద్రాక్షలో ఆక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పళ్లను బలంగా మార్చడమే కాకుండా.. చిగుళ్లను ప్రొటెక్ట్ చేస్తాయి. ఎండుద్రాక్షలో ఉండే ఓలినాలిక్ యాసిడ్ టూత్ డికేని అడ్డుకుంటాయి.
కీళ్ల నొప్పులు ఎండుద్రాక్షలో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది.. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఎండుద్రాక్షలో బోరోన్ ఉంటుంది. ఇది త్వరగా క్యాల్షియం గ్రహించడానికి సహాయపడుతుంది.
కాలేయ సమస్యలు ఎండుద్రాక్షను రెగ్యులర్ గా తీసుకుంటే.. శరీరంలో పేరుకున్న మలినాలను బయటకు పంపి.. కాలేయ సంబంధ సమస్యలను నివారిస్తుంది.
గ్లోయింగ్ స్కిన్ ఎండుద్రాక్ష చర్మాన్ని గ్లోయింగ్ గా మారుస్తుంది. ఇందులో ఉండే రిస్వోరేట్రోల్ ఏజింగ్ ప్రాసెస్ ని నెమ్మదిగా చేస్తుంది. కాబట్టి ప్రతిరోజూ 5 ఎండుద్రాక్షలు తీసుకోండి. బ్లడ్ సర్క్యులేషన్ ని మెరుగుపరుస్తుంది.

Friday, February 10

చపాతీ-రైస్ ఏది తింటే మంచిది..?


మన ఇంట్లో కూడా వస్తూ ఉండే చర్చే ఇది. వండిన బియ్యాన్ని తినాలా లేక చపాతి/రొట్టె తినాలా అని? రెండిట్లో ఏది బెటర్ అనే టాపిక్ మీద గంటలకొద్దీ చర్చలు పెట్టుకునేవారిని కూడా చూసే ఉంటాం. మరి న్యూట్రిషన్ నిపుణులు ప్రకారం చపాతి – రైస్ లో ఏది బెటర్? ఏం తినాలి?
నిజానికి ఇప్పుడు మనం తింటున్న రైస్ పూర్తిగా న్యూట్రింట్స్ ని కలిగి ఉండదు. కారణం తెలుసుగా, పాలిష్డ్ రైస్ మనం తినేది. తెల్లగా ఉండేట్లు పాలిష్ చేయడం వలన ఫైబర్, ఐరన్, కాల్షియం, బీ కాంప్లెక్స్ విటమిన్స్ ని కోల్పోతుంది రైస్. అంటే, మనకు అందేది స్వచ్ఛమైన బియ్యం కాదు అన్నామాట. చాలామందికి తెలియని విషయం, ఇప్పుడు మనం తినే బియ్యంలో కార్బోహైడ్రేట్‌లు కూడా తక్కువే. అందుకే, మనం ఎక్కువ కాలరీలు తీసుకుంటాం. అందుకే మిగితావాటితో పోల్చుకుంటే వండిన బియ్యం ఎక్కువ తింటాం అన్నమాట.
ఇక కల్తీలేని గోధుమ అలా కాదు. ఫైబర్, ప్రోటీన్‌లు, కార్బోహైడ్రేట్‌లు, ఐరన్, కాల్షియం, సెలెనియం, పొటాషియం, మెగ్నీషియం .. అన్ని బాగా దొరుకుతాయి. కార్బోహైడ్రేట్‌లు బాగా ఉండటంతో ఎక్కువ కాలరీలకు పోకుండా, ఓ లిమిట్ లో తినవచ్చు. అయితే, రైస్ తో పోల్చుకుంటే చపాతీలో తక్కువ కాలరీలు లభిస్తాయి అని కాదు, కాలరీల ఇంటేక్ మాత్రం తగ్గుతుంది. ఇది లాభదాయకం.
కాబట్టి, స్వచ్ఛమైన బ్రౌన్ రైస్ లభిస్తే, మొహమాటం లేకుండా తినండి. ఇక వైట్ రైస్, చపాతీలలో ఏది తినాలో మీకే వదిలేస్తున్నాం కాని, చపాతీ మాత్రం వైట్ రైస్ కన్నా బెటర్ అప్షన్ లెక్కలోకే వస్తుంది.

Thursday, February 9

కాళ్ళ నొప్పులు, మెడ నొప్పి , నడుము నొప్పి ఇంకా ఏ నొప్పైనా ఇది త్రాగితే చాలు...

సాధారణంగా చాల మంది తలనొప్పి, వెన్ను నొప్పి, లేదా శరీరంలో ఏ ఇతర నొప్పులు వచ్చినా వెంటనే పెయిన్ కిల్లర్స్ ను తీసుకుంటుంటారు. పెయిన్ కిల్లర్స్, డ్రగ్స్ ప్రస్తుతానికి పనిచేసినా, కొంత సేపటి వరకూ మాత్రమే రిలీఫ్ ఉంటుంది. సమస్యను పూర్తిగా తగ్గించదు. కాబట్టి, నేచురల్ గా నొప్పి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. అందుకోసం ఈ ఆర్టికల్ గ్రేట్ గా సహాయపడుతుంది. 

పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. డయోరియా, హై బ్లడ్ ప్రెజర్, వికారం, కిడ్నీ క్యాన్సర్ మరియు ఎరిక్టైల్ డిస్ ఫంక్షన్ వంటి సమస్యలకు దారితీస్తుంది.
అందువల్ల వెంటనే పెయిన్ కిల్లర్స్ మానేయాలి, అంతే కాదు పెయిన్ కిల్లర్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ కు గురిచేస్తుంది. కాబట్టి, ఈ ఆర్టికల్ ద్వారా ఒక నేచురల్ పెయిన్ కిల్లర్ ను పరిచయం చేయడం జరిగింది. అదే టర్మరిక్ టీ, పెయిన్ రిలీఫ్ కు టర్మరిక్ టీ గ్రేట్ గా సహాయపడుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

టర్మరిక్ టీ బెనిఫిట్స్, టర్మరిక్ టీ నేచురల్ స్పైసీ, ఇందులో పవర్ ఫుల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. పసుపు లో ఉండే కుర్కుమిన్ వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్నాయి. రోజూ టర్మరిక్ టీ తాగడం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్, పెయిన్ తగ్గిస్తుంది. అలాగే పెయిన్ ఫుల్ జాయింట్ పెయిన్ ను తగ్గిస్తుంది. ఈ టీలో రిలాక్సేషన్ కలిగించే గుణాలు కూడా ఉండటం వల్ల ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే గర్భిణీలకు మరియు బ్రెస్ట్ ఫీడింగ్ మహిళలకు రెకమెండ్ చేయలేదు.
టర్మరిక్ టీ తయారుచేయడానికి కావల్సినవి :నీళ్ళు 4 కప్పులు, పసుపు 1 టీస్పూన్, నిమ్మరసం కొద్దిగా
తయారీ: గిన్నెలో నీళ్ళు పోసి, అందులో పైన సూచించిన పసుపు వేసి బాయిల్ చేయాలి. 20 నిముషాలు వేడి చేయాలి. బాగా మరిగిన తర్వాత గ్లాసులోనికి వడగట్టుకుని, కూల్ చయాలి. తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేయాలి. ఈ టీని రోజూ ఇలా తయారుచేసుకుని ఒక కప్పు క్రమం తప్పకుండా తాగుతుంటే బాడీలో ఎలాంటి నొప్పులనైనా ఇలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

Wednesday, February 8

రాగి పాత్రలోని మంచినీటి గురించి అమొగమైన విషయాలు మీ కోసం...

* జీర్ణ వ్యవస్థకు మంచిది:- రాగి పాత్రలో నీలు తాగడం వల్ల అసిడిటీ, గ్యాస్, అజీర్ణం వంటివి తగ్గడం కాకుండా, , మీ కడుపుకి హాయి కలిగించి, ప్రాణాంతకరమైన బాక్టీరియాను కూడా నిర్మూలిస్తుంది. కిడ్నీ ఇంకా లివర్ చురుకుగా పనిచేయడంలో తోడ్పడుతుంది.
* బరువు తగ్గిస్తుంది:- మనం అధిక బరువు తగ్గడానికి రకరకాల పండ్లు, కూరగాయలు వంటివి తింటూ ఉంటాం. కాని వాటివల్ల వచ్చే ప్రయోజనాలకన్న, వాటికి ఖర్చుపెట్టిన డబ్బు వ్యర్ధం అయిందన్న దిగులే ఎక్కువ. రాగి పాత్రలో నీలు తాగడం వల్ల అది మీ జీర్ణ వ్యవస్థను సరైన మార్గంలో నడిచేలా చేసి, కొవ్వు మరియు ఇతర చెడు బాక్టీరియాను శరీరంనుండి తీసేస్తుంది.
* గాయాలను త్వరగా నయం చేస్తుంది:- రాగిలో ఉండే యాంటి-బాక్టీరియా తత్వం శరీరంలోని అనేక గాయాలను వేగంగా నయం చేయడంతోపాటు రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరిచి, శరీరంపై ఉన్న గాయాలనే కాకుండా లోపల ఉన్న గాయాలను, ముఖ్యంగా కడుపులో ఉన్న గాయాలను కూడా తగ్గించడంలో సహాయం చేస్తుంది.
* మీ వయసును దాచేస్తుంది:- కొంతమంది ఆరోగ్య పరంగా ఎంత చురుకుగా ఉన్నా వారి వయసు మించి కనిపిస్తూ ఉంటారు. ఈ సమస్య నుండి బాధ పడేవారు చాలా మందే ఉన్నారు. ఇలాంటి వారు రాగి నుండి ఉత్పత్తి అయ్యే ప్రయోజనాలతో వారి సమస్య నుండి విముక్తి చెందగలరు. ముఖంపై ఉన్న మచ్చలు, ముడతలు వంటివి రాగి తగ్గిస్తుంది.
* క్యాన్సర్ వ్యాధి నుండి పోరాడుతుంది:- రాగిలో ఉండే అనామ్లజనకాలు (యాంటి-ఆక్సిడెంట్) క్యాన్సర్ వంటి ప్రాణాంతకరమైన రోగాల నుండి కాపాడుతుంది. అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వారు చేసిన పరిశోధనాల ప్రకారం రాగి క్యాన్సర్ ను ఎలా రానివ్వకుండా చేస్తుందో కనుగొనలేకపోయారు. కాని రాగి నిరంతరం క్యాన్సర్ వ్యాపింపజేసే వైరస్ ను అడ్డుకోనడంలో తోడ్పడుతుందని ఆ పరిశోధనల్లో తేలింది.
* మెదడును మెరుగుపరుస్తుంది:- మన శరీర భాగంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటి మెదడు. మనిషి శరీరంలో ప్రతీ ఒక్క భాగానికి మెదడుతో సంబంధాలు కలిగి ఉంటాయి. మెదడు నుండి ఆయా భాగాలకు న్యురాన్ల ద్వారా సంకేతాలు అందుతాయి. ఈ న్యురాన్లను మైలిన్ తొడుగు కాపాడుతుంది. రాగిలో ఉండే విలువైన పదార్థాలు ఈ మైలిన్ తొడుగును కపాడంతోపాటు, మెదడును చురుకుగా, యవ్వనంగా తయారు చేస్తుంది.
ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారి ప్రకారం రాగిని రోజుకు 12మి.గ్రా కన్నా ఎక్కువ తీసుకునే అవసరం లేదు అంటే రాగి పాత్రలో కనీసం 8 గంటలు ఉంచిన మంచి నీటిని రోజుకి 3 నుంచి 4 సార్లు తీసుకుంటే సరిపోతుంది. రాగి సర్వ రోగ నివారిణిగా పనిచేసి మనిషికి ఆరోగ్యాని ప్రసాదిస్తు, డాక్టర్లకు పెట్టె లక్షల ఖర్చును మిగిలిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
రాగి పాత్రని సబ్బుతో కాకుండా సగం కోసిన నిమ్మ చెక్కతో లేదా వంట సోడాతో రుద్ది నీటితో కడిగితే సరిపోతుంది.

Saturday, February 4

సహజంగా బరువు పెరగటాన్ని ప్రోత్సహించే కూరగాయలు...

శరీర బరువు పెంచుకోటానికి కష్టపడే వారికి, శాఖాహార భోజనం లేదా వెజిటేరియన్ డైట్ ఏ విధంగానూ సహాయపడదని చాలా మంది అభిప్రాయం. అయితే ఈ ప్రతిపాదన సరైనది కాదనే చెప్పాలి. శాఖాహార భోజనం లేదా కూరగాయలు సాధారణంగా బరువు పెంచవు కానీ, చికెన్, గొడ్డు లేదా పంది మాంసాలతో పోలిస్తే, కొన్ని క్యాలోరీలను మరియు ప్రోటీన్ లను కూరగాయలు కలిగి ఉంటాయి. కానీ సరైన కూరగాయలతో కూడిన వెజిటేరియన్ డైట్ ని తినటం వలన తప్పక బరువు పెరగటమే కాకుండా, ఫిట్ గా మరియు ఆరోగ్యకర శరీరాన్ని పొందవచ్చు. 

మీరు శాఖాహరులా! శరీర బరువు పెంచుకోవాలి అనుకుంటున్నారా! అయితే పంది, చికెన్ మాంసం వలే క్యాలోరీలను అందించే ప్రత్యామ్నాయ కూరగాయలను పాటించే ఆహార ప్రణాళికలో కలుపుకోవాలి.

వెజిటేరియన్ డైట్ లో ప్రోటీన్ లను అందించే, ప్రాముఖ్యత కలిగిన అంశంగా గింజలను పేర్కొనవచ్చు. అన్ని రకాల గింజలను ఉదాహరణకు- బాదంపప్పు, పిస్తా, అక్రోటుకాయలు వంటి వాటిని పాటించే వెజిటేరియన్ డైట్ లో కలుపుకోవాలి. వీటిని స్నాక్స్ తినే సమయంలో లేదా భోజనంతో కలిపి కూడా తీసుకోవచ్చు.

విత్తనాలు, లెగ్యూమ్స్ మరియు వివిధ రకాల తృణధాన్యాలు కూడా అధిక మొత్తంలో ప్రోటీన్ లను కలిగి ఉంటాయి. వీటిని కూడా పాటించే వెజిటేరియన్ డైట్ లో కలుపుకొండి.

మీరు శరీర బరువు పెంచుకోవాలి అనుకుంటే మాత్రం- శరీరానికి అన్ని రకాల పోషకాలు అవసరమని తెలుసుకోండి. ఉదాహరణకు- కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా గల ఆహార పదార్థాలను కలుపుకోవటం వలన సత్తువ పెరుగుతుంది. వీటితో పాటుగా కొవ్వు పదార్థాలు కూడా శరీరానికి అవసరమని మరవకండి. బీట్ రూట్, బంగాళదుంప వంటి వేరు సంబంధిత దుంపలు శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్లను అందిస్తాయి.

ఐరన్ విషయానికి వస్తే, అల్పాహారంగా తృణధాన్యాలను, పచ్చని ఆకుకురాలను అనగా పాలకూర, క్యాబేజీ, బ్రోకలీ, తోటకూర వంటి వాటిని తీసుకోవాలి. శరీరంలో ఐరన్ స్థాయిలను పెంచుకోటానికి అల్పాహారంగా బాహ్యపొరతో ఉడికించిన బంగాళదుంపను తినండి.


బరువు పెరుగుటకు పాటించాల్సిన ఆహార ప్రణాళిక

అల్పాహారంగా, అధిక పోషకాలను అందించే, 2 లేదా 3 బ్రెడ్ ముక్కలలో పాలకూర, టమోటా, ఉల్లిపాయ ముక్కలతో తయారు చేసిన సాండ్ విచ్ తినండి. పాలకూర మరియు పుట్టగొడుగులు ఆహారానికి మంచి రుచిని అందిస్తాయి. వీటితో పాటుగా ఒక గ్లాసు పాలు కూడా తాగటం మంచిదని చెప్పవచ్చు.

మధ్యాన్న భోజనంలో రైస్ నుండి పాస్తా లేదా రోటీ రూపంలో ఉండే గోధుమ, అధిక మొత్తంలో మినరల్, విటమిన్ లు కలిగిన క్యారెట్, బీన్స్ లేదా పచ్చని ఆకుకురాలను, కూరగాయలను తీసుకోవాలి.

భోజనాలకు మధ్యలో, రెండు లేదా మూడు సార్లు స్నాక్స్ తీసుకోండి. స్నాక్స్ గా పోషకాలను అందించే గింజలను తినటం మంచిది.

రాత్రి భోజనంగా, పచ్చని ఆకుకూరలతో చేసిన కర్రీ తో రైస్/ గోధుమలతో చేసిన రోటీ తీసుకోండి. తీసుకునే ఆహారానికి మంచి రుచిని జోడించుటకు, రాత్రి భోజనానికి ఒక కప్పు నిండా పెరుగు లేదా ఒక గ్లాసు పండ్ల రసాన్ని జోడించండి.

శాఖాహార భోజనం ద్వారా శరీర బరువు పెంచుకోలేమనే వ్యాఖ్యా పురాతన కాలం నుండి ప్రచారంలో ఉంది. అధిక క్యాలోరీలు అందించే ఆహార పదార్థాలను పాటించే ఆహార పదార్థాలకు కలుపుకోవటం వలన కొద్ది రోజులలోనే శరీర బరువు పెంచుకోవచ్చు.

Wednesday, February 1

గంజినీళ్ళు తాగడం వలన కలిగే లాభాలు...

గంజి రుచి ఎలా ఉంటుందో కూడా ఈ కాలం పిల్లలకి తెలియదు. అలా పెంచడం తప్పు అని కాదు. ఎందుకంటే గంజినీళ్ళు అంటే ఓ చులకన భావం ఉంటుంది. అదీకాక గంజినీళ్ళు ఆరోగ్యానికి చేసే మేలు కూడా మనలో చాలామందికి తెలియదు కదా. అలాంటివారు ఇది చదవండి.

* Diarrohea తో పసిపిల్లలు ఇబ్బందిపడటం చూస్తుంటాం మనం. ఈ సమస్య వలన త్వరగా డీహైడ్రేట్ అయిపోయి ఏడుస్తుంటారు పసిపిల్లలు. పిల్లలే కాదు, పెద్దవారు కూడా ఈ సమస్యతో బాధపడితే, గంజినీళ్ళతో ఉపశమనం పొందవచ్చు.

* జ్వరంతో ఇబ్బందిపడుతున్న సమయంలో, గంజినీళ్ళు రికవరీ కోసం ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. గంజి న్యూట్రింట్స్ ని అందించి, వాటర్ లాస్ ని తగ్గిస్తుంది.

* ఫైబర్ కలిగి ఉండటం వలన, గంజి మలబద్ధకం పైన కూడా పనిచేస్తుంది. వైరల్ ఇంఫెక్షన్స్ ఉన్నసరే, గంజితో ఉపయోగమే ఉంటుంది.

* మొటిమలను గంజి దూరం చేస్తుందని డెర్మాటాలాజిస్టులు చెబుతారు. ఇది కోమలమైన చర్మాన్ని కూడా అందిస్తుందట.

* ఇనోసిటాల్ అనే కార్బోహైడ్రేట్‌ ఉండటం వలన, గంజి కురుల అరోగ్యానికి పనికివస్తుంది. జుట్టుకి బలాన్ని, అందాన్ని చేకూరుస్తుంది.