Friday, September 30

డెంగూ జ్వరం...

*విషజ్వరాలు అంటే ... వైరల్ జ్వరాలు (Viral fevers) , ఈ విషజ్వరాలలో ఒక రకము డెంగూ జ్వరం .*
ఈ వ్యాధి కారక సూక్ష్మజీవి *ఆర్బోవైరస్* జాతికి చెందినది. ఈ వైరస్ అతి సూక్ష్మమైనది. కంటికి కనిపించదు .ఈ వైరస్ ఏయిడిస్ ఈజిప్టి జాతి దోమద్వారా రోగగ్రస్తుల నుండి ఆరోగ్య వంతులకు సంక్రమించును. ఈ దోమను టైగర్ దోమ అనికూడా అంటారు. ఈ దోమలు సాధారణంగా పగటి పూటనే కుట్టును. ఈ దోమలు కుట్టిన తర్వాత 5 నుండి 8 రోజులలో వ్యాధి లక్షణాలు కన్పించును.
*డెంగూ అనే డెన్‌ (DEN), గీ (gee) అని నాలుగు రకాల వైరస్లు . . . DEN -1 ,DEN-2 , DEN-3 , DEN-4 అనేవి ఆ వైరస్లు .*
రెండు రకాలు : -

1. సాదారణ రకము , 
2 . డెంగూ హెమరేజిక్ ఫీవరు (ప్రమాదకరమైనది),
డెంగూ వ్యాధి లక్షణాలు :-
1. ఉన్నట్టుండి జ్వరం ఉధృతంగా వచ్చుట
2. తలనొప్పి అధికంగా నుండును, ఎక్కువగా నొసటిపై తలనొప్పి కల్గుట
3. కంటిలోపల నొప్పి వచ్చి కంటి కదలికలను తగ్గించుట, కన్ను కదిలినప్పుడు నొప్పి ఎక్కువ అగుట
4. కండరాలు, కీళ్ళ నొప్పి కల్గుట
5. వాంతి అగునట్లు భ్రాంతి కల్గుట
6. నోరు ఎండిపోవును, ఎక్కువ దాహముండును
పై లక్షణాలు కలిగి ఉన్నచో వెంటనే మీ సమీపములో గల ఆసుపత్రినందు చూపించుకొని వ్యాధి నివారణ కొరకు చికిత్స పొందగలరు. ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏదీ లేదు. కావున ప్రజలు వెంటనే స్పందించి జ్వర తీవ్రతను గుర్తించి పై తెలిపిన లక్షణాల నివారణ కొరకు వెంటనే తగిన చికిత్స పొందగలరు. ఈ విషయం సంబంధిత ఆరోగ్య శాఖాధికారులకు వెంటనే తెలియచేయవలెను.
వ్యాధి వ్యాపించే విధానము :-
1. ఈ వ్యాధి ఒక రకమైన ఆర్బోవైరస్ వలన సంక్రమించును
2. ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి ఏడిస్ ఈజిప్టై అనే దోమ కాటు వలన వ్యాప్తి జరుగును
3. ఈ దోమలు పగలే కట్టును
4. ఈ రకమైన దోమలు మన ఇంటి పరిసరాలలో నీరు నిలుచుటకు ఆవకాశం వుండి, ఆ నీరు కనీసము వారం రోజులు నిల్వ ఉన్నచో, ఈ దోమలు వృద్ధి చెందును.
5. ఈ దోమలు గ్రుడ్డు పెట్టి పెరుగుటకు ఈ క్రింద తెలిపిన వస్తువులు / పరిసరాలు అనూకూలమైనవి.
*ఎయిర్ కూలర్స్, రిఫ్రిజిరేటర్లో గల డ్రిప్ ఫ్యాన్, పూలకుండీల క్రింద గల సాసర్లు, బయట పెట్టిన టైర్లు, మూతలు పెట్టని నీరు నిల్వచేసే తొట్టిలు, కుండీలు, ఫౌంటెన్స్, ఖాళీ డ్రమ్ములు, సన్ షేడ్స్ పై నిల్చిన వాన నీరు, బిల్డింగ్ ల పైన నిల్చిన వాన నీరు.*
1. ఇతర పనికిరాని, పగిలిపోయిన పస్తువులు
2. ఈ దోమ ఇంటిలో గల చీకటి ప్రదేశాలలో నివసించుచుండును
3. వాడకుండా వదిలి వేసిన పచ్చడి రోళ్ళు
4. ఫ్లవర్ వాజ్, కొబ్బరి చిప్పలు, పగిలిన సీసాలు, పగిలిపోయిన కప్పులు, చెట్టు తొర్రలు మొదలైనవి.
ఎ) దోమల నివాసాలను తొలగించుట :-
నీరు నిల్వను, పనికిరాని కూలర్లను, టైర్లు, పాత్రలు, డ్రమ్ములు, పూలకుండీలు ఇతరత్రా కనీస అవసరాలకు ఉంచుకొని పనికిరాని వాటిని తీసివేయవలెను, ఇండ్లలోని మరియు వెలుపల నీటి నిల్వలను పాలపారబోయవలెను. నీటి ట్యాంకునకు మూతలుంచవలెను. నీటి నిల్వలు గల వాటిని వారానికి ఒకసారి ఖాళీ చేయించుచూ వారంలో ఒక రోజు డ్రైడే (Dry Day) విధానము తప్పక పాటించుచూ రావలెను. అదే విధముగా జనవాసములందు సంఘీభావముతో పై కార్యక్రమములను పాటింపచేయవలెను.
బి) వ్యక్తిగత జాగ్రత్తలు :-
దోమతెరలు, నివారణ మందులు వాడి దోమ కాటు నుండి విముక్తి పొందవచ్చును. పొడుగు ప్యాంట్లు, పొడుగు చేతులు గల చొక్కాలు ధరించవలెను. అన్ని భాగాలు రక్షణ కలిగే విధంగా వేసుకోవాలి.
పిల్లలకు శరీర భాగాలు పూర్తిగా కప్పబడునట్లు దుస్తులు వేయవలెను.
చికిత్స :-
స్వంత చికిత్స చేయకూడదు. ఆస్ప్రిన్, బ్రూఫెన్, కాంబిఫ్లామ్ మరియు అనాలజిన్ లాంటి మాత్రలు తీసుకోకూడదు.

Thursday, September 29

సబ్జా గింజలతో బోలెడు లాభాలు..!!

మహిళలూ బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన గ్లాసుడు నీటిని నిద్రపోయే ముందు తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది.
బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వల్ల మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు... ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడడంతోబాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది.
శరీరంలోని కేలరీలను కరిగించడంలో సబ్జాగింజలు పెట్టింది పేరు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
ఇంకా సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి.
ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ 'ఇ' లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

చింత చిగురు ఆహారంలో తీసుకుంటే ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు...

కూర వండుకుని తిన్నా పచ్చిగా తిన్నా ఎలాగైనా సరే తినేయండి చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్‌గా పని చేస్తుంది. ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో చింతచిగురు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఈ చిగురును ఉడికించిన నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్‌ఫ్లేమటరీ గుణాలు చింత చిగురులో ఉండటమే ఇందుకు కారణం...
కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలిగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. ఈ చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను పటిష్ఠపరుస్తాయి.
తరచూ చింత చిగురును తింటే ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకుంటాయి. థైరాయిడ్‌తో బాధపడేవారు చింత చిగురును తమ ఆహారంలో తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుండె జబ్బులను చింత చిగురు దరిచేరనీయదు. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి అవసరమైన పోషకాలను అందించడమే గాక, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చింత చిగురును పేస్ట్‌లా చేసి కీళ్ళపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి.

Wednesday, September 28

ఏయే ఆహార పదార్థాలను రోజులో ఏ సమయంలో తినాలో తెలుసుకోండి..!

బరువు తగ్గాలనుకుంటున్న వారు, చక్కని ఆరోగ్యం కోరుకునే వారు వ్యాయామంతోపాటు ఆహారం విషయంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకోవడం సహజం. అయితే వ్యాయామం సంగతి ఎలా ఉన్నా ప్రధానంగా మనం తినే ఆహారం పట్ల మాత్రం నూటికి నూరు శాతం కచ్చితంగా జాగ్రత్త వహించాల్సిందే. సరైన పోషకాలను అందించే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, ఏ సమయంలో తినాల్సిన ఆహారాన్ని అదే సమయంలో తీసుకోవడం కూడా అంతే అవసరం. లేదంటే పోషకాహారం తీసుకున్నా తగిన ఫలితం ఉండదు. దీనికి తోడు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏయే ఆహార పదార్థాలను రోజులో ఎప్పుడు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం...
పెరుగు :-
పెరుగును పగటి పూట మాత్రమే తీసుకోవాలి. రాత్రి పూట తినకూడదు. అలా తింటే శరీరంలో మ్యూకస్ ఎక్కువగా వృద్ధి చెందుతుంది. ఇది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి పెరుగును పగటి పూటే తినాలి. దీని వల్ల జీర్ణశక్తి కూడా పెరుగుతుంది.
అన్నం :-
రాత్రి పూట అన్నం అస్సలు తినకూడదు. దీని వల్ల శరీరంలో అదనపు కొవ్వు చేరుతుంది. మధ్యాహ్న భోజనంగా అన్నం తినాలి. దీని వల్ల శరీరంలో ఉన్న కార్బొహైడ్రేట్లన్నీ ఎక్కువగా వినియోగమయ్యేందుకు అవకాశం ఉంటుంది.
పాలు :-
పాలను రాత్రి పూట తీసుకుంటే మంచిది. దీని వల్ల చక్కగా నిద్ర పడుతుంది. ఉదయాన్నే పాలను తాగితే జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఉదయం పూట పాలను తీసుకోకూడదు. అయితే వ్యాయామం, శారీరక శ్రమ ఎక్కువగా చేసే వారు ఉదయం పూట పాలను తాగవచ్చు.
యాపిల్స్ :-
యాపిల్ పండ్లను ఉదయాన తినాలి. దీని వల్ల మలబద్దకం సమస్య తొలగిపోతుంది. ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అంతేకాదు శరీరంలో ఉన్న విష పదార్థాలన్నీ బయటకు వెళ్లిపోతాయి. రాత్రి పూట యాపిల్స్‌ను తినడం మంచిది కాదు. ఒక వేళ తింటే జీర్ణాశయంలో యాసిడ్స్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యి, జీర్ణప్రక్రియకు ఆటంకం కలుగుతుంది.
వాల్‌నట్స్ :-
వాల్‌నట్స్‌ను సాయంత్రం తినాలి. వీటిలోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు మనకు సంపూర్ణంగా అందాలంటే సాయంత్రం పూట వాల్‌నట్స్‌ను తింటే సరిపోతుంది. అదే ఉదయం, రాత్రి పూట అయితే వీటిని తినకూడదు. ఎందుకంటే ఆయా సమయాల్లో వీటిని తింటే శరీరానికి సరైన పోషకాలు లభించవు.
పప్పు ధాన్యాలు :-
శనగపప్పు, పల్లీలు, కంది పప్పు, చిక్కుడు తదితర గింజ, పప్పు జాతికి చెందిన ధాన్యాలను మధ్యాహ్నం పూట తీసుకోవాలి. దీని వల్ల మన శరీరానికి కావల్సిన ఫైబర్ (పీచు పదార్థం) అధిక మొత్తంలో అందుతుంది. దీంతో జీర్ణ ప్రక్రియ కూడా మెరుగు పడుతుంది. అంతేకాదు కొలెస్టరాల్ లెవల్స్ కూడా తగ్గుతాయి. ఉదయం, రాత్రి వేళ్లలో పప్పుల్ని తింటే మనకు కావల్సిన పోషకాలు సరిగా అందవు. దీనికి తోడు ఆకలి పెరుగుతుంది. దీని వల్ల ఇంకా ఎక్కువ ఆహారం తినేందుకు అవకాశం ఉంటుంది.
అరటి పండ్లు :-
అరటిపండ్లను మధ్యాహ్నం తినాలి. ఇది జీర్ణప్రక్రియను మెరుగు పరుస్తుంది. అంతేకాదు జీర్ణాశయ సంబంధ సమస్యలైన అసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. రాత్రి పూట అరటి పండ్లను తింటే మ్యూకస్ పొర పెరుగుతుంది. దీని వల్ల జలుబు వంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఉదయాన పరగడుపున కూడా అరటి పండ్లను తినకూడదు. ఎందుకంటే ఇవి కడుపును ఇబ్బంది పెడతాయి.
మాంసం :-
మాంసాన్ని కూడా మధ్యాహ్నమే తినాలి. ఎందుకంటే మాంసం జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి దీన్ని మధ్యాహ్నం తినడమే మంచిది. దీని వల్ల శరీరానికి కావల్సిన ప్రోటీన్లు కూడా సరిగ్గా అందుతాయి. రాత్రి పూట మాంసం తినడం మానేయాలి. ఎందుకంటే జీర్ణ వ్యవస్థపై అధికంగా భారం పడుతుంది.

Tuesday, September 27

ఎత్తు పెరగడానికి 7 సులువైన వ్యాయామాలు...

ఎత్తు పెంచే వ్యాయామాలు ఎత్తు పెరుగుదలకు సహాయపడవచ్చు.
తాడు ఎగరడం వంటి వ్యాయామాలు ఎత్తు పెరుగుటకు సహాయపడుతాయి.
లేయింగ్ టు వే స్త్రేచింగ్ పొడవు పెరుగటానికి గల ఒక ప్రభావవంతమైన వ్యాయామం.
నిలువుగా సాగడం & నిలువు వంగటాలు కూడా ఎత్తు పెరుగుటకు సహాయపడుతాయి.

మనం పెరిగే ఎత్తు అనేది మన జన్యువులపై మాత్రమే ఆధారపడి ఉంటుందని చాలా మంది నమ్ముతుంటారు. జన్యు కారకాలే కాకుండా, గరిష్ట ఎత్తు పెరగకపోవడానికి అనేక కారణాలున్నాయి . మీరు పొడవుగా పెరిగి మరియు గరిష్ట ఎత్తు సాధించడానికి కింద తెలిపిన వ్యాయామాలు సహాయపడుతాయి. మీరు ఎత్తు పెరుగడానికి పోషకాలు, భౌతిక చర్యలు, భంగిమలు మరియు ఎత్తు పెంచే వ్యాయామాలు కూడా సహాయపడతాయి.

మీరు ఎత్తు పెరుగడానికి సహాయ పడే కొన్ని వ్యాయామాల గురించి కింద తెలుపబడింది:-

తాడు ఎగరడం / బాస్కెట్బాల్ :-
గరిష్ట ఎత్తు చేరుకోవడానికి లేదా ఎత్తు పెరగటానికి తాడు ఎగరడం లేదా తాడుపై గెంతటం కూడా ఒక మంచి వ్యాయామం అని గమనించండి. తాడు ఎగరడం వలన రక్త ప్రవాహం పెరుగుతుంది మరియు శరీరంలో పొడవు పెరగడానికి అవసరమయ్యే ఎముకలపై ఒత్తిడిని కలిగిస్తుంది.

నిలువుగా వేలాడడం (vertical hanging) :-
వేలాడడం అనేది మీ అందరికి ఒక సాధారణ వ్యాయామంగా అనిపించవచ్చు; ఎత్తు పెరాగడానికి గల శక్తివంతమైన వ్యాయామాలలో ఇది కూడా ఒకటని గమనించండి. ఈ వ్యాయామం వలన వెన్నుపూసలోని మృదులాస్థిలను సాగెలా చేసి, అవి పెరగేలా చేస్తుంది మరియు వెన్నెముక సాగడానికి సహాయపడుతుంది.

పక్కకు వంగడం(side bend) :-
మీరు ఎత్తు పెరగడానికి సహాయపడే వ్యాయామాలలో ఇది కూడా ఒకటి. మీరు నేల మీద నిలువుగా పాదాలు సమాంతరంగా వుంచి నిలబడండి, మీ శరీరంను పక్కకి వంచండి మరియు మీరు ఎంత సాగగలరో అంత సాగండి. అలానే 15 సెకన్ల పాటు ఉండి మరియు శరీరం యొక్క మరో వైపుకు మారుతూ పునరావృతం చేయండి.

నిలువు సాగడం(vertical stretch) :-
మీరు వ్యాయామాలతో సౌకర్యవంతమైన అనుభూతి పొందలేనట్లయితే, మీరు ఈ సాధారణ వ్యాయామాలను చేయవచ్చు. మీ కాలి వేళ్ళ మీద నిలబడి; చేతులు పైకి చూసే విధంగా మీ శరీరంను ఎత్తాలి. మీకు సాధ్యమైనంత వరకు శరీరాన్ని అధిక స్థాయి వరకు చాచాలి. కనీసం 30 సెకన్ల పాటు మీ చేతులను అలానే వుంచాలి. ఈ వ్యాయామం వలన వెన్నెముక సాగి మీరు తక్కువ సమయంలో పొడవుగా పెరుగడానికి సహాయపడుతుంది.

నిలువుగా ఉండి వంగడం(vertical bend) :-
త్వరగా పొడవు పెరగడానికి ఉపయోగపడే వ్యాయామాలలో ఈ వ్యాయామం కూడా ఒకటి, ఇక్కడ మీ కాళ్ళ పై నిలబడటంలో కొద్దిగా వేరుగా వుంటుంది. క్రిందికి వంగి మరియు మీ మోకాలు వంగకుండా నిఠారుగా వుంచి చేతి వెళ్ళు నేలకు తాకేలా ప్రయత్నించండి. ఈ చలనం వలన మీ వెన్నెముక వంచబడుతుంది . మొదట్లో, మీరు నేలను తాకేలా ప్రయత్నించాలి, కానీ మీ అరచేతులు పూర్తిగా నేలపై ఉంచటం ఇంకా ఉత్తమం.

భుజంగాసన(cobra pose) :-
మీ ఛాతి నేలను తాకే విధంగా నేలపై సమానతరంగా పడుకోండి. మీ ఎగువ శరీరంను సాధ్యమైనంత వరకు చాచుతూ పైకి ఎత్తడానికి ప్రయత్నించండి. ఆ స్థితిలో 15 సెకన్ల పాటు ఉండాలి మరియు నెమ్మదిగా మీ శరీరంను తిరిగి ప్రారంభ స్థానంకు తీసుకురావాలి. ఈ వ్యాయామం మీ ఎగువ శరీరం సాగడానికి మరియు మీరు పొడవు పెరుగటానికి సహాయపడుతుంది.

లేయింగ్ టు వే స్ట్రేచింగ్ :-
నేలపై సమాంతరంగా పడుకోని ఛాతి పైకి చూసే విధంగా ఉంచాలి మరియు చేతుల సమాంతరంగా తల మీదుగా నేలకు ఆనేలా విశ్రాంతిగా పెట్టిఉంచాలి. మీ చేతులు మరియు కాళ్ళును ఒకేసారి చాచాలి. మీ చేతులు/కాళ్లను యధాస్థానానికి తీసుకురావదానికి ముందు అదే స్థానంలో ఒక 20 సెకన్ల పాటు ఉంచండి.

మనం ఎంత ఎత్తు పెరుతామో లేదో అన్నది మన జన్యుపరమైన కారకాల ఆధారంగానే నిర్ణయించబడుతుంది ఇది ఒక వాస్తవ విషయమే అయినప్పటికీ మన ఎత్తు అనేది ఆహారం మరియు వ్యాయామం వంటి భౌతిక కారకాలు కూడా ఒక పాత్ర పోషిస్తాయి. అధికంగా, 25 సంవత్సరాల వయస్సులో ఎత్తు పెరగడం ఆగిపోతుంది, కానీ ఈ దశలో కూడా మీ ఎత్తును మరికొన్ని అంగుళాలు పెంచడానికి కొన్ని విషయాల ద్వారా సాధ్యమవుతుంది. మీరు ఎత్తు పెరగడానికి ఈ వ్యాయామాలు ఖచ్చితమైన మార్గాలు కాకపోవచ్చు, కానీ మీరు వీటిని ప్రయత్నించి చూడవచ్చు.

Monday, September 26

రోజూ ఈ సులువైన ముద్రలు వేయండి… సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి….

రోజు యోగ చేస్తే మనకు అనారోగ్య సమస్యలు అనేవి ఉండవు. కొందరికి యోగ చేయాలంటే బద్దకంగా ఉంటుంది అలాంటి వారికి కొన్ని సులువైన పద్దతులలో మన చేతి వేళ్లను కొన్ని ప్రత్యేకమైన భంగిమలలో పెట్టి ధ్యానం చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు...

1) జ్ఞాన ముద్ర :-
పద్మాసనం లో కూర్చొని రెండు చేతుల బొటన వేళ్లను చూపుడు వేళ్ళకు ఆనిచ్చి ఉంచాలి. ఈ ఆసనంలో కొద్దీ సమయం గాలి పీల్చుతూ, వదులుతూ ఉండాలి. ఇలా చేయడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది.శరీరానికి రక్త ప్రసరణ వ్యవస్థ పెరిగి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు.
2) శూన్య ముద్ర :-
పద్మాసనంలో కూర్చొని మన మధ్య వేళ్లన్ని మధ్యలోకి మడిచి వాటి పై బొటన వేలిని కొద్దీ సేపు ఉంచాలి. ఇలా ధ్యానం చేయడం వలన చెవు నొప్పులు, చేతి నొప్పులు,కాళ్లల్లో స్పర్శ జ్ఞానం కోల్పోవడం వంటిది దూరం అవుతుంది.
3) ఆకాశ ముద్ర :-
రెండు చేతుల మధ్య వేళ్లను, బొటన వెళ్ళ చివర ఆనించి కొద్దీ సేపు ఉంచాలి. అలాచేయడం వలన మన శరీరంలో నెగిటివ్ శక్తి నశించి, పాజిటివ్ శక్తి ప్రవహిస్తుంది. లాగే శరీరంలోని విషపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
4) ప్రాణముద్ర:-
బొటన వేలి అంచుతో – చిటికెన వేలు ఉంగరం వేలు అంచులను కలిపి /తాకించి వుంచవలెను . చూపుడు మద్య వేళ్ళు నిటారుగా వుంచవలెను . ఈ ముద్ర వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది . నీరసం నిస్సత్తువ తగ్గి శక్తిని కలిగిస్తుంది . అనవసరమైన మానసిక ఆందోళన తగ్గి ప్రసాంతత కలుగుతుంది . దీని వలన కంటి దృష్టి కి బలం కలుగుతుంది . ఆలోచనలో స్పష్టత వస్తుంది .
5) వాయుముద్ర:-
చూపుడు వేలును మధ్యకు మడిచి బ్రొటన వేలితో నొక్కి పట్టుకొని వేసే వాయుముద్ర వలన చాల ఉపయోగాలు ఉన్నాయి. ఈ ముద్ర వేసి ధ్యానిస్తే కీళ్ళనొప్పిని నివారించవచ్చు. పార్కిన్సొన్, పోలీయో వ్యాధి వలన వచ్చే నొప్పి ని ఈ ముద్ర తగ్గిస్తుంది.
6) పృధ్వీ ముద్ర :-
రెండు చేతుల ఉంగరం వెళ్ళ చివరన బొటన వేళ్ళతో పట్టుకోవాలి. ఇలా చేయడం వలన కండరాలు రిలాక్స్ అవుతాయి. కొత్త కండరాల రూపకల్పన జరుగుతుంది.

Sunday, September 25

ఈ విధంగా చేస్తే నడుము నొప్పిని తగ్గించుకోవచ్చు.

నడుం నొప్పి ఈ మధ్య ఎక్కువగా అందరి నోటి నుండి వినిపిస్తున్న మాట. ఎందుకంటే ఒకప్పుడు వృద్ధులలో మాత్రమే కన్పించే నడుము నొప్పి ఇప్పుడు వయసుతో నిమిత్తము లేకుండా యుక్త వయసులో ఉన్నవారు సైతం ఎదుర్కొంటున్నారు.దాదాపు 80% మంది ఎప్పుడో అప్పుడు దీని బారిన పడేవారే. శరీరానికి ఊతమిచ్చే కీలకమైన భాగం వెన్నెముక. ఇది 33 వెన్నుపూసలతో తయారవుతుంది, మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌లు సహాయపడతాయి. నడుము ప్రాంతంలో ఉండే డిస్క్‌లు అరిగిపోవడం వల్ల, లేదా డిస్క్‌లు ప్రక్కకు తొలగి నరాలను కంప్రెస్ చేయడం వల్ల నడుము నొప్పి సమస్య వస్తుంది.
నడుము నొప్పికి కారణాలు :-
  1. కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని విధులను నిర్వర్తించడం.
  2. స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీలల్లో అసంబద్ధ బంగిమల్లో కూర్చోవడం.
  3. గంటల తరబడి కదలకుండా పని చేయడం.
  4. ఈ సమస్య ముఖ్యంగా వెన్నుపూసల మధ్య ఉన్న కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫై ట్స్‌ ఏర్పడటం వలన వస్తుంది.
  5. ప్రమాదాలలో వెన్నుపూసలు దెబ్బ తినడం లేదా ప్రక్కకు తొలగటం.
  6. నిత్యం తీసుకునే ఆహారంలో కాల్షియం, విటమి న్స్‌ లోపించడం వలన నడుము నొప్పి వస్తుంది.
వెన్ను నొప్పికి తీసుకోవాల్సిన చిన్న జాగ్రత్తలు:-
  1. కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు కుర్చీ తగినంత ఎత్తులో ఉండేలా చూసుకోండి.
  2. ఒకే పొజిషన్‌లో అరగంట కంటే ఎక్కువ సేపు కూర్చోవడం చేయకండి. మధ్య మధ్యలో కాసేపు లేచి నడవండి.
  3. శరీర బరువు ఎక్కువ ఉంటే వెంటనే తగ్గించుకోండి.
  4. ప్రతిరోజు 8 నుండి 10 గంటల కంటే ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేయాల్సి వస్తే బ్యాక్ పెయిన్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
*కింది వీడియోలో చూపించినట్టుగా ప్రయత్నిస్తే నడుము నొప్పిని త్వరగా తగ్గించుకోవచ్చు.

అరటిపండు తొక్కతో అందాన్ని, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు.

అరటిపండు ఉపయోగాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అరటిపండు మానవ శరీరానికి చేసే మేలు ఇంకే పండు చేయలేదు. కేవలం అరటిపండు మాత్రమే కాదు దాని తొక్క వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ముందు అరటిపండు ఉపయోగాలు తెలుసుకొని తరువాత తొక్క సంగతి చూద్దాం...


అరటిపండు తినడం వలన లాభాలు:-

  1. అరటి పండులో అనేక పోషకాలు మరియు కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి.
  2. అరటిపండులో విటమిన్లు బి-6, బి-12, మెగ్నీషియం మరియు పొటాషియం సమృద్ధిగా ఉంటాయి.
  3. ఒక అరటిపండు 100 క్యాలరీల శక్తిని ఇవ్వగలదు.
  4. అరటిపండు తేలికగా జీర్ణం అయ్యీ త్వరగా శక్థిని ఇస్తుంది.
  5. అరటిపండులొ అదిక పొటాషియం ఉన్నందువలన బిపిని, అధిక ఒత్తిడి ని తగ్గిస్తుంది.
  6. రోజు 3 అరటిపండ్లు తింటె గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు.

అరటి తొక్క వలన ఉపయోగాలు:-

దంతాలు మెరవడానికి:- అరటితొక్క లోపలి వైపు భాగంతో ఒక నిముషంపాటు దంతాలపైన ఒక వారం రోజులపాటు, ప్రతిరోజూ రుద్దండి. ఇలా చేయటంవలన మీ దంతాలు తెల్లగా మెరుస్తాయి.
పులిపుర్లు తగ్గించడం:- అరటి తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది మరియు క్రొత్తవి రాకుండా చేస్తుంది. దీనికోసం, పులిపిర్లు ఉన్న ప్రాంతాన్ని అరటితొక్కతో రుద్దండి లేదా ఆ ప్రాంతం మీద రాత్రంతా అరటితొక్కను కట్టండి. చర్మం కొరకు అరటితొక్కతో చేసే చికిత్సలలో ఇది సులభమైన మార్గం.
మొటిమలు తగ్గించడం:- మొటిమలు తగ్గటానికి అరటితొక్కతో మీ ముఖాన్ని మరియు శరీరాన్ని ఐదు నిముషాలపాటు మర్దన చేయండి. మీకు వారంలోపల మంచి ఫలితం కనపడుతుంది. ఇలా మొటిమలు మాయమయ్యేవరకు చేయండి.
సోరియాసిస్ తగ్గించడం:- సోరియాసిస్ తో ఉన్న ప్రాంతం అంతటా అరటితొక్కతో రాయండి. అరటి తొక్క మాయిశ్చరైజేషన్ గుణాలను కలిగి ఉన్నది మరియు దురదను కూడా తగ్గిస్తుంది. ఇది త్వరగా సోరియాసిస్ ను నయం చేస్తుంది మరియు మీరు తక్కువ సమయంలోనే మంచి ఫలితాలు చూడవొచ్చు. దురద మరియు నొప్పి నుండి తక్షణ ఉపశమనం పొందేందుకు దోమలకాటు ఉన్న చర్మము మీద అరటితొక్క తో మసాజ్ చేయండి.
UV కిరణాల నుండి రక్షణ:- అరటి తొక్క హానికరమైన UV కిరణాలు నుండి కళ్ళను రక్షించడంలో సహాయపడుతుంది. మీరు మీ కళ్ళను అరటి తొక్కతో రుద్దే ముందు, అరటితొక్కను సూర్యుని ముందు ఉంచండి. ఇలా చేయటం వలన మీ కళ్ళకు శుక్లాలు ప్రమాదం కూడా తగ్గుతుందని నిరూపించబడింది.

ఇప్పటి నుండి అరటిపండు తిన్న తరువాత అరటి తొక్కని పడేయకుండా పైన చెప్పిన విధంగా వాడండి చాలా మంచి ఫలితాలని పొందుతారు.

Saturday, September 24

కొత్తిమీరతో కిడ్నీ, ప్రేగులని శుభ్రం చేసుకోవచ్చు.

శరీరానికి కిడ్నీలు చేసే మేలు ఇంత అంత కాదు. శరీరంలోని ఉపయోగం లేని లవణాలను చెమట, మూత్రం రూపంలో బయటకి పంపించి అవి ఎంతో సహకరిస్తాయి. సరైన విధంగా ఆహార నియమాలు పాటించకపోవవం వల్ల కిడ్నీలలో రాళ్లు, తదితర సమస్యల బారిన పడుతున్నారు. మన శరీరానికి ఎంతో మంచి చేసే మూత్రపిండాల విషయంలో నిర్లక్యం చేస్తే ఆసుపత్రుల్లో లక్షలు రూపాయలు పోసి కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం కొత్రిమీరతో కొద్దిపాటి మెళకువలు పాటించి మూత్రపిండాలకు శుభ్రం చేసుకోవచ్చని తెలుసా. ఎలా అంటారా ఈ చిట్కాలు చదవండి మరి.

చిన్న చిన్న ముక్కలుగా కొత్తిమీర ఆకులను కత్తిరించాలి. కత్తిరించి ముక్కలను శుభ్రంగా కడిగి రెండు లీటర్ల నీటిలో వేసి 10 నిమిషాలపాటు మరిగించాలి. అనంతరం ఆ నీటిని ఫిల్టర్ చేసి సీసాలో పోసి ఫ్రీజ్ లో ఉంచాలి. ప్రతి రోజు ఒక గ్లాసు రసాన్ని తాగడం వల్ల శరీరంలోని ప్రేగులు శుభ్రపడటంతోపాటు, కిడ్నీలోని లవణాలన్నిమూత్రం ద్వారా బయటకిపోతాయి. అలా ప్రతి రోజు ఒక గ్లాసు త్రాగడం అలవాటుగా చేసుకుంటే మీకు ఎంతో మేలు జరుగుతుంది. కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షలు లక్షలు కట్టే కంటే మార్కెట్ లో 5 రూపాయలకి దొరికే కొత్తిమీర కట్టని తెచ్చుకోవడం వల్ల మనకి డబ్బులు మిగలటంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. ఎంతో చవకైన, సులభమైన ఈ చిట్కాని పాటించి కిడ్నీలను కాపాడుకోండి మరి.

Thursday, September 22

ఈ చిట్కాతో మీ పిల్లల జ్ఞాపకశక్తితో పాటు ఆరోగ్యాన్ని పెంచండి.

ఈ రోజులలో పిల్లల చదువుల కోసం వారి తల్లిదండ్రులు చేయని త్యాగం లేదు. తమ పిల్లలకు మంచి భవిష్యత్ ఉండాలని వారిని పేరున్న విద్యాసంస్థలలో వేయడానికి లక్షల్లో ఖర్చు పెడుతున్నారు. కానీ అందరూ పిల్లలు తల్లితండ్రులు అశించినట్లు చదువులో చురుకుగా ఉండరు. లక్షలు ఖర్చు పెట్టినా పిల్లలు అనుకున్నంత జ్ఞానం సంపాదించకుండా, మతిమరుపు తో బాధపడుతుంటే వారిని చిన్న ఆయుర్వేదిక్ మొక్క సహాయంతో తిరిగి ఉత్తేజితులను చేయవచ్చు. ఆ మొక్క పేరే బ్రహ్మీ మొక్క లేదా సరస్వతి మొక్క. దీని సాంకేతిక నామం: బాకోప మున్నేరి.


సరస్వతి ఆకు పొడి – 50 గ్రాములు మరియు మిరియల పొడి – 3 గ్రాములు కలిపి నిలువ చేసుకుని, ప్రతి రోజు పిల్లలకు ఉదయం పరిగడుపున 4 చిటికెల పొడి ,1 చుప్ ఆవు పలతో లేదా గోరువెచ్చని నీటిలో వెసి కొంచెం పటిక బెల్లం కలిపి త్రాగించాలి. ఇలా రోజూ తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సర్వసతి మొక్క గురించి పురాణాలలో కూడా ఉంది.
 సర్వసతి మొక్క ఉపయోగాలు ఒక్కసారి తెలుసుకుందాం!..
  1. ముఖ్యంగా ఈ చెట్టు యొక్క ఆకులలో తీపి, చేదు, వగరు మిళితం అయి ఉంటాయి.
  2. పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగాడానికి సహకరిస్తుంది.
  3.  ఈ ఆకు పొడి పిల్లల ఆకలిని పెంచుతుంది.
  4. సరస్వతి ఆకు పిల్లల మెదడునే కాదు రక్తాన్ని కూడా శుభ్రం చేస్తుంది.
  5. మెదడుకు సంభందించిన అనేక వ్యాధులను తగ్గిస్తుంది.
  6. సరస్వతి ఆకుల రసం ఆయుష్షు పెరగటంలో ఉపయోగపడుతుంది.
  7. చిన్న పిల్లలకు నత్తి వస్తే ఈ సరస్వతి మొక్క ఆకు పొడిని తినిపించి తగ్గిస్తారు.

మరి ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని నర్సరీకి వెళ్ళి సరస్వతి మొక్కను ఇంటికి తెచ్చుకోండి. మీరు సరస్వతి మొక్క ను ఎప్పుడు చూసి ఉండక పోతే పైన ఫోటోలో చూసి గుర్తు పట్టండి.

ఈ చిట్కాలని పాటిస్తే..! కళ్ళద్దాలని వాడాల్సిన అవసరం ఉండదు.

ఈ కాలంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి ఖచ్చితంగా కళ్ళజోడు ఉంటుంది, రోజురోజుకి కళ్ళజోడు పెట్టుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది, సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల చాలా మందికి కంటి చూపు మందగిస్తుంది, చాలామంది చిన్నప్పటి నుండే ఎక్కువ సైట్ కలిగిన కళ్ళద్దాలని వాడుతున్నారు, కంటిచూపు మనదగించడం వల్ల వేరే కంటి సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది, మన తాతల కాలంలో ఎలాంటి కళ్లజోడులు లేవు, వారు సరైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండేవారు, మనం మాత్రం ఏది పడితే అది తిని, విటమిన్లు లేని ఆహారాన్నే తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి.

కంటిచూపు కూడా విటమిన్ల లోపం వల్లనే వస్తుంది, చాలా మంది లేజర్ ఆపరేషన్లు చేయించుకొని కంటిచూపుని సరి చేసుకుంటున్నారు, ఆ ఆపరేషన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి, మన ఇంట్లోనే ఉండే పదార్థాలతోనే మనం మన కంటిచూపుని తిరిగి పొందవచ్చు.
  1. పది పచ్చి ఉసిరి కాయ‌ల‌ను తీసుకుని బాగా క‌డిగి వాటిలోంచి విత్త‌నాల‌ను వేరు చేసి ఆ కాయ‌ల‌ను చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి. ఆ ముక్క‌ల‌ను మిక్సీలో వేసి మిశ్ర‌మంగా చేశాక దాన్నుంచి జ్యూస్‌ను తీయాలి. ఈ జ్యూస్‌ను తేనెతో క‌లిపి నిత్యం ఉద‌యాన్నే తాగాలి. దీని వ‌ల్ల కంటి స‌మ‌స్య‌లు పోయి దృష్టి బాగా వ‌స్తుంది.
  2. అర‌కిలో వాల్‌న‌ట్స్‌, 300 గ్రాముల తేనె, 100 గ్రాముల క‌ల‌బంద గుజ్జు లేదా జ్యూస్‌, 4 నిమ్మ‌కాయ‌ల‌ను తీసుకోవాలి. నిమ్మ‌కాయ‌ల‌ను పిండి వాటి నుంచి ర‌సం తీసి దాన్ని మిగిలిన ప‌దార్థాల‌కు బాగా క‌లిపి మిశ్ర‌మంగా చేసుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని రోజుకు 3 సార్లు తీసుకోవాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌, మ‌ధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్న‌ర్‌కు ముందు ఈ మిశ్ర‌మాన్ని సేవిస్తుంటే క్ర‌మంగా కంటి చూపు మెరుగ‌వుతుంది. 6 నెల‌ల గ‌ర్భం దాటిన మ‌హిళ‌లు, కిడ్నీలు, గ్యాస్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు దీన్ని తీసుకోకూడ‌దు.
  3. 8 నుంచి 10 బాదం పప్పుల‌ను తీసుకుని రాత్రి పూట నీటిలో నాన‌బెట్టాలి. ఉద‌యం ఆ బాదంప‌ప్పు పొట్టును తీసివేయాలి. అనంత‌రం వాటిని మెత్త‌ని పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ పేస్ట్‌ను ఒక టీస్పూన్ మోతాదులో తీసుకుని వేడి పాల‌లో క‌లిపి ఉద‌యాన్నే తాగాలి. ఒక‌టి, రెండు నెల‌ల పాటు ఇలా తాగితే చూపు బాగా వ‌స్తుంది. కంటి స‌మ‌స్య‌లు పోతాయి.
  4. విటమిన్ ఏ ఎక్కువగా ఉండే పాలకూర, క్యారెట్, బొప్పాయి, పాలని ఎక్కువగా తీసుకోవాలి.

కళ్ళల్లో మంటగా అనిపించినప్పుడు చల్లని నీటితో కడుక్కోవాలి, చుట్టూ చీకటి ఉన్నప్పుడు కళ్లపై ఎక్కువ ఒత్తిడి పడకుండా జాగ్రత్త పడాలి.

Wednesday, September 21

వంటింటి చిట్కాలు :- గృహినికి ఉపయోగకరమైన...

1. ఉల్లిపాయలను తరిగేటప్పుడు కన్నీళ్లు రాకుండా ఉండాలంటే పొట్టు ఒలిచిన తర్వాత మధ్యలోకి కట్ చేసి నీటిలో వేసి పదినిమిషాల తర్వాత తరగాలి. 
2. బాదం పప్పును మరిగేనీటిలో పదినిమిషాలపాటు ఉంచి ఒలిస్తే పొట్టు సులభంగా వస్తుంది.
3. మార్బుల్ రాతి మీద కురగాయలను తరుగుతుంటే కత్తి పదును పోయి త్వరగా మొద్దు బారుతుంది. కాబట్టి చాపింగ్ బోర్డు వాడడం మంచిది. మార్కెట్లో ఎక్కువగా ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు అందుబాటులో ఉంటున్నాయి కాని ఉడెన్‌ చాపింగ్ బోర్డు వాడితే ఆరోగ్యానికి మంచిది. 
4. కూరలలో ఉప్పు ఎక్కువైందనిపిస్తే వేయించిన వరిపిండిని కలపాలి. పప్పులో ఒక స్పూను రిఫైన్‌డ్‌ ఆయిల్‌ లేదా రెండు వెల్లుల్లి రేకలు వేసి వండినట్లయితే గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌ తగ్గుతుంది. 
5. కూరగాయలను ఉడికించేటప్పుడు ముందుగా నీటిని వేడిచేసి అప్పుడు ముక్కలను వేయాలి. ఎక్కువ సేపు నీటిలో ఉండేకొద్దీ పోషకాలు నశిస్తుంటాయి. కాబట్టి నీటిలో ఉండే సమయాన్ని తగ్గించడానికి ఇదొక పద్ధతి. 
6. పనీర్‌ ను బ్లాటింగ్‌ పేపర్‌ లో చుట్టి ఫ్రిజ్‌ లో పెడితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. పదిహేను రోజుల వరకు వాడవచ్చు. రెడీమేడ్‌ పనీర్‌ను ప్యాక్‌ ఓపెన్‌ చేసిన తరువాత వారం రోజుల్లో వాడేస్తే మంచిది. 
7. వంట త్వరగా పూర్తవ్వడానికి కూరగాయలను చిన్న ముక్కలుగా తరుగుతుంటారు. అలాంటప్పుడు వాటిలోని విటమిన్లు ఆవిరైపోతుంటాయి. అందుకే పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి. 
8. వంట చేయడానికి కూరగాయ ముక్కలు తరిగిన తర్వాత కడిగే అలవాటుంటే మాత్రం వెంటనే మానుకోవాలి. ఇలా చేయడం వల్ల విటమిన్లను నష్టపోతాం. 
9. కాలీఫ్లవర్ ఉడికిన తర్వాత కూడా తెల్లగా ఉండాలంటే ఉడకబెట్టేటప్పుడు ఆ నీళ్ళలో రెండు టీ స్పూన్ల పాలు కలపాలి. 
10. చిక్కుళ్లు, పచ్చిబఠాణీలు, ఆకుకూరలు ఉడకబెట్టేటప్పుడు ఒక టీస్పూన్ పంచదార కలిపితే సహజమైన రంగుని కోల్పోవు.

Tuesday, September 20

వంటింటి చిట్కాలు :- గ్యాస్ట్రిక్ సమస్యను దూరం...

గ్యాస్ ఉన్న వారు సరిగా తినకపోవడం, తొందరగా తిన్నది జీర్ణం కాకపోవడం. కడుపులో మంట. పులుపు, కారం లాంటివి ఎక్కువ తినలేకపోవడం వంటి ఎన్నో బాధలు పడుతున్నారు. గ్యాస్ వల్ల పొట్టలో ఉబ్బరం కలుగుతుంది. త్రేన్పులు వస్తాయి. కడుపులో నొప్పి, అజీర్ణం కలుగుతుంది. అపనవాయువుతో ఇబ్బంది. కడుపులో గ్యాస్ ఆపుకుందామంటే ఆగాడు. ఆపితే విపరీతమైన నొప్పి. వాసన ఉంటే భరించడం కష్టం. దీని నుండీ బయటపడడం ఎలా? గ్యాస్ ఎందుకు తయారవుతుంది. దాని నివారణకు ఇంట్లోనే చేసుకునే చిన్నపాటి చిట్కాలు మీ కోసం. ఎందుకు తయారవుతుంది? మనం తినే ఆహారం. నమలకుండా గబగబా మింగడం. మాట్లాడుతూ తినడం. నోరు ఎక్కువగా తెరచి నమలడం. బీర్, కోలా వంటి కార్బోనేటేడ్ పానీయాలు కూడా గ్యాస్ కి కారణం. అంతే కాదు..స్మోక్ చేయడం. ఆహారనాళంలో జీర్ణం కానీ షుగర్స్ ను కోలన్ లో బాక్టీరియా స్వీకరించి, గ్యాస్ ను విడుదల చేస్తాయి. ప్రేగులలోని కొన్ని బాక్టీరియ గ్యాస్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి.
మరి గ్యాస్ రాకుండా ఉండాలంటే తీసుకోవలసిన జాగ్రత్తలు:- 
 ఆహారాన్ని బాగా నమిలి, నెమ్మదిగా, తక్కువగా తినాలి. ధూమపానం, జర్దా, పాన్ వంటివి తినకూడదు. కొన్ని వ్యయమ పద్ధతులు పాటించాలి. కూల్ డ్రింక్స్, తీపి పదార్థాలు తగ్గించాలి. వేళకి భోజనం చేయాలి. రోజుకు 10-12 గ్లాసుల నీరు త్రాగాలి. 
నివారణకు వంటింటి చిట్కాలు :-
1. ధనియాలు నమలండి. అది గ్యాస్ ను పోగొడుతుంది. కడుపునొప్పిని తగ్గిస్తుంది. 
2. కప్పు మరిగే నీటిలో కొద్దిగా అల్లం, తేనె కలిపి త్రాగండి. 
3. తాజా అల్లం ముక్కని నిమ్మరసంలో ముంచి అన్నం తిన్నాక తింటే ఆహారం తొందరగా జీర్ణమవుతుంది. 
4. గ్యాస్ రిలీఫ్ కి ఇంగువ బాగా పనిచేస్తుంది. 
5. ఒక గ్లాసు మరుగుతున్న నీటిలో పీచ్ ఆకులూ వేసి 10-15 నిమిషాల తర్వాత త్రాగాలి. రోజుకు మూడు సార్లు చేస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. 
6. అరచెంచా వాముపొడి, చెంచా యాలకుల పొడి, ఒక చెంచా మిరియాల పొడి, శొంఠి పొడి చెంచా కలిపి ఉంచుకోవాలి. రోజుకు రెండు సార్లు 400మి.లీ నీటితో తీసుకుంటే అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తగ్గుతాయి. 
7. తులసి ఆకులు నిమితే కడుపులో గ్యాస్ ఏర్పడదు. 
8. మిరియం,శొంఠి, ఏలకులు ఒక్కొక్క్ టీ స్పూన్ చొప్పన తీసుకుని పొడి చేసి అరస్పూన్ నీటిలో కలిపి భోజనం తరువాత అరగంట ఆగి త్రాగాలి.

వంట వార్పూ, వంటింటి పరిసుబ్రత మరియు ఇతర వంటింటి చిట్కాలు -3

  1. అరటి, బంగాళ దుంప ముక్కల మీద ఉప్పు నీళ్ళు చల్లి పావుగంట అయ్యాక వేపుడు చేస్తే ముక్కలు బాగా వేగుతాయి.
  2. వెల్లుల్లి రెబ్బల్ని గంటపాటు నీళ్ళల్లో నాన పెట్టి పొట్టు తీస్తే సులువుగా వస్తాయి.
  3. ఇడ్లీలు మృదువుగా రావాలంటే ప్లేట్లో పిండి వేసాక తడి చేత్తో అద్దితే సరిపోతుంది.
  4. గుడ్లను ఉడికించే నీళ్ళల్లో రెండు చెంచాల వినెగర్ కలిపితే అవి పగిలిపోకుండా ఉంటాయి.
  5. పిండి వంటలు చేసేటప్పుడు బాణలిలో నూనె పొంగాకుండా ఉండాలంటే, మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి … అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
  6. సగానికి కోసిన ఆపిల్ ముక్కలు నల్లగా రంగు మారకుండా ఉండాలంటే, తెల్లని బాగంలో ఉప్పు రాయాలి.
  7. మిగిలిపోయిన బ్రెడ్ను కాసేపు ఓవెన్ లో ఉంచి పొడి చేసి పులుసులో వేసుకుంటే రుచిగా ఉంటుంది.
  8. పులిహొర చేసేటప్పుడు అన్నం ఉడికే సమయంలో చెంచా నెయ్యి కాని వెన్న కాని వేస్తే అన్నం ముద్ద కాకుండా పొడి పొడిగా వస్తుంది.
  9. పచ్చి కొబ్బరి చిప్పల లోపల కొద్దిగా నిమ్మ రసం పూస్తూ ఉంటె వారం వరకు తాజాగా ఉంటాయి.
  10. ఇంగువ గడ్డ కడితే, ఆ డబ్బాలో నాలుగు పచ్చిమిరపకాయలు వేస్తే పొడిగా అవుతుంది.
  11. టమాటాలు వండటానికి ముందు పదినిమిషాల పాటు వేడినీటిలో నానపెడితే వంటకాలు రుచిగా ఉంటాయి.
  12. కోడిగుడ్డు పెంకులను కిటికీలు ventilators వద్ద పెడితే, క్రిమి కీటకాలు చేరవు.
  13. cauliflower తో వంటలు చేసేటప్పుడు అందులో కాసిని పాలు కలిపితే, వంట మరింత రుచిగా ఉంటుంది.
  14. కారం నిల్వ ఉంచిన డబ్బాలో చిటికెడు ఇంగువ కలిపితే పురుగులు పట్టకుండా ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
  15. ఆపిల్ పండ్ల పక్కనే అరటి పండ్లని ఉంచితే, అవి త్వరగా పండుతాయి.
  16. పుదినా కొత్తిమీర చట్ని రంగు మారకుండా ఉండాలంటే చేసిన వెంటనే నిమ్మరసం పిండితే సరిపోతుంది.
  17. పెసర పిండిలో నిమ్మరసం కలిపి వెండి సామాగ్రిని రుద్దితే కొత్తవాటిలా మెరిసిపోతాయి.
  18. పచ్చిమిర్చిని కొసాక పంచదార కలిపిన చల్లటి నీళ్ళతో చేతుల్ని కడిగితే మంటగా ఉండదు.
  19. ఆకు కూరలు వండేటప్పుడు చిటికెడు పంచదార కలిపితే కూర సహజ రంగుని కోల్పోదు.
  20. బంగాల దుంప ముక్కల్ని ఉప్పు నీళ్ళల్లో అరగంట నానబెట్టి వేయిస్తే ముక్కలు రుచిగా ఉంటాయి.
  21. వంటకాల్లో సుగంధ ద్రవ్యాలను అలాగే వేయటానికి బదులు, పొడి చేసి వేస్తే పదార్థాలు కమ్మటి వాసన వస్తాయి.
  22. ఉల్లిపాయ ముక్కల్లో చిటికెడు పంచదార వేస్తే త్వరగా వేగుతాయి.
  23. గుడ్డులోని సొనకు పాలు కాస్త పంచదార కాస్త కలిపితే మరింత రుచిగా ఉంటుంది.
  24. కందముక్కలను ఉడికించే నీళ్ళల్లో చిన్న బెల్లం ముక్క వేస్తే, అవి త్వరగా ఉడుకుతాయి.
  25. ఇంట్లో చేసుకునే తమటా సూప్కి చక్కని రంగు రావాలంటే అందులో చిన్న బీట్రూట్ ముక్క వేస్తే, రంగు పోషకాలు రెండు అందుతాయి.
  26. వంటకాలు తక్కువగా పీల్చుకోవాలంటే అందులో అరచెంచా వెనిగర్ని కలిపి చూడండి.
  27. కాచిన నెయ్యిలో నాలుగు మెంతులు వేస్తే కమ్మటి వాసన వస్తుంది.
  28. పచ్చి మిర్చికి గాట్లు పెడితే నూనెలో వేయిన్చేతప్పుడు పేలకుండా ఉంటాయి.
  29. బియ్యం నిల్వ చేసిన డబ్బాలో, గుప్పెడు పుదినా ఆకులు వేస్తే పురుగులు పట్టవు.
  30. అప్పడాలు ఉంచిన డబ్బాలో కొన్ని బియ్యం లేదా సెనగపప్పు వేస్తే మెత్త బడకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
  31. వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలను వేస్తే, మంచి వాసన వస్తుంది.

Monday, September 19

వంట వార్పూ, వంటింటి పరిసుబ్రత మరియు ఇతర వంటింటి చిట్కాలు-1


  1. కరివేపాకుని ఎండపెట్టి పొడి చేసి, బద్రపరుచుకుని నిత్యం కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వొస్తుంది.
  2. ఫ్లాస్క్ ని ఎంత సుబ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగ తో కడిగితే సరి.
  3. బొంబాయి రవ్వతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.
  4. వంటకాల్లో కారంతో పాటు చిటికెడు ఉసిరిక పొడిని వేస్తే పదార్థాలు మరింత రుచిగా ఉంటాయి.
  5. ఆమ్లెట్ కు అదనపు రుచి రావాలంటే సోనకు కొబ్బరి కోరు జోడించాలి.
  6. సూప్ ను పొయ్యి మీద నించి దించాక రెండు చెంచాల పాల మీగడ కలిపితే చిక్కదనంతో పాటు అదనపు రుచి తోడు అవుతుంది.
  7. తరిగిన బంగాళ దుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వినేగార్ చల్లితే చాలు.
  8. తేనె  సీసాలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు చేరవ్.
  9. అల్లం వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజా గా ఉంటుంది.
  10. బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మ రసం చల్లితే జిగురు ఉండదు.
  11. సాంబార్లో ఉప్పు ఎక్కువైతే ఉడికించిన బంగాళ దుంపలు వేస్తే సరి.
  12. అరటికాయ  ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే వాటిని తరిగాక మజ్జిగలో వేస్తే సరి.
  13. వంకాయ కూరలో రెండు చుక్కలు నిమ్మరసం పిండితే కూర రంగు మారదు, రుచిగా వస్తుంది.
  14. నిలవ పచల్లకు ఆవ నూనెను వాడితే అవి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
  15. కాలిఫ్లోవేర్, పాలకూర వంటి వాటిని శుబ్రం చేయటానికి నీటిలో కొద్దిగా వినేగార్ కలపండి.
  16. కరివేపాకుని ఎండ పెట్టి పొడిచేసి కూరల్లో వేసుకుంటే కమ్మటి వాసన వస్తుంది.
  17. గుడ్లను ఉడికించే నీళ్ళల్లో కాస్త ఉప్పు వేస్తే అవి పగిలిపోకుండా ఉంటాయి.
  18. కిలో గోధుమలలో గుప్పెడు సనగలు చేర్చి మరపట్టిస్తే చపాతీలు తెల్లగా మరియు రుచిగా ఉంటాయి.
  19. బత్తాయి రసం తీసాక గింజలను వేరుచేసాక మిగిలిన గుజ్జులో పంచదార కలుపుకొని తింటే రుచికరంగా ఉంటుంది, చక్కటి పోషకాలు అందుతాయి.
  20. అరటిపండు పువ్వులను fridge లో పెట్టకూడదు. వాటివల్ల లోపలి పదార్ధాల రుచి, వాసన మారిపోతుంది.
  21. పప్పులు, తృణ ధాన్యాలు పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో గుప్పెడు వేపాకులు వేస్తే సరి.
  22. రాగి సామాగ్రి మీద నిమ్మరసం చల్లి ఉప్పుతో రుద్దితే కొత్త వాటిలా మెరిసిపోతాయి.
  23. పదార్థాలు మాడిపోయి పెనం నల్లగా తయ్యరైతే దానిమీద సబ్బునీళ్ళు పోసి సన్నటి సెగ మీద ఉంచి చల్లారాక రుద్దితే సుబ్రపడుతుంది.
  24. snack వంటకాల్లో కారానికి బదులు మిరియాల పొడిని వేస్తే రుచిగా ఉంటుంది.
  25. పచ్చి బటానీలను ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి.
  26. బియ్యం, తృణ ధాన్యాలను నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు పసుపు కొమ్ములు లేదా వెల్లుల్లి రేఖలు వేస్తే పురుగు పట్టకుండా ఉంటాయి.
  27. గిన్నెలకు గ్రీజు మరకలు అంటితే సబ్బునీళ్ళలో వినేగార్ కలిపి రుద్దితే పోతాయి.
  28. వాడేసిన నిమ్మచేక్కలతో లంచ్ boxes ని రుద్దితే వాసన రాకుండా ఉంటాయి.
  29. ఇత్తడి రాగి పాత్రలను మగ్గిన అరటిపండు గుజ్జుతో తోమితే కోత్తవాటిలా మెరుస్తాయి.
  30. నిమ్మరసం లో ఉప్పు కలిపి వంట గది గట్టుని రుద్దితే జిడ్డు పోతుంది.
  31. పులుసు కూరలో చింతపండు రసానికి బదులు టమాటా గుజ్జు వేస్తే కూరలు మరింత రుచిగా ఉంటాయి.

Sunday, September 18

కంప్యూటర్ల ముందు కూర్చుంటున్నారా?

40 రోజుల్లో పొట్ట తగ్గాలా..? ఐతే ఇలా చేయండి!

కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేస్తున్నారా? అయితే తేనేతో మీకు చాలా పనుంది. ఊబకాయంతో బొజ్జ పెరిగిపోతుంటే.. తేనెను నీటిలో కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడున తాగండి. రెండు నెలలకే బొజ్జ తగ్గిపోతుంది. తేనెలోని గ్లూకోజ్ రక్త ప్రసరణను నియంత్రిస్తుంది. తద్వారా గుండెపోటు వ్యాధులు దరిచేరవు. కంటి జబ్బులు, చర్మ సంబంధిత వ్యాధులు కూడా తేనె వాడకంతో నయమవుతాయి.
 
అలాగే అల్లం రసంతో తేనెను కలిపి కాస్త వేడిచేసి ఆరబెట్టాలి. ఈ రసాన్ని తినేందుకు ముందు ఒక స్పూన్, సాయంత్రం ఒక టేబుల్ స్పూన్ వేడినీటితో కలుపుకుని తాగితే 40 రోజుల్లో పొట్ట తగ్గిపోతుంది. ఇక అనాస పండులో కూడా పొట్టను తగ్గించే గుణం ఉంది. అనాసపండు ముక్కల్ని, వోం పొడితో నీళ్లలో రాత్రంతా నాననివ్వాలి. మరుసటి రోజు ఉదయం ఆ రసాన్ని పరగడుపున తాగితే మీ పొట్ట తగ్గిపోతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు యథేచ్ఛగా తేనెను వాడకూడదు. తేనెను వేడి పదార్థాలతో కలిపి వాడకూడదు. అలాగే పిప్పళ్లు, మిరియాలు వంటి వాటితో కలిపి నేరుగా వాడకూడదు. తేనెను మరిగించకూడదు. తేనె ఉష్ణ వీర్య పదార్థం కాబట్టి తేనెను నేరుగా మంటపైన వేడిచేయకూడదు. 
 
తేనెలో కాల్షియం, రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, పొటాషియం, జింక్, సల్ఫర్, సోడియం, సిలికాన్ వంటి ఖనిజలవణాలు, థైమీన్, రిబోఫ్లావిన్, పైరిడాక్సిన్, పాంటోథెనిక్ యాసిడ్, నికోటెనిక్ యాసిడ్... లాంటి విటమిన్లూ పుప్పొడి ద్వారా చేరిన ప్రోటీన్లూ అమైనోఆమ్లాలూ ఎంజైములూ ఉంటాయి. ముదురు రంగు తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజలవణాలూ ఎక్కువగా ఉంటాయి. 
 
ఇన్ని రకాల పోషకాలున్నాయి కాబట్టే తేనెను బలవర్ధకమైన ఆహారంగా చెబుతారు. ఇలా శక్తిని అందించే తేనెలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉండదు. తేనెను గోరువెచ్చని నీటితో పరగడుపున సేవిస్తే అధిక బరువు తగ్గుతారు. తేనెను గోరువెచ్చని పాలతో సేవిస్తే బరువు పెరుగుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

వంట వార్పూ, వంటింటి పరిసుబ్రత మరియు ఇతర వంటింటి చిట్కాలు -2

  1. కూరలో ఉప్పు ఎక్కువైతే కాస్త బియ్యప్పిండి కలపాలి.
  2. కోసిన ఉల్లిపాయలు సగమే వాడినప్పుడు పాడవటం పదేయ్యటం జరుగుతోందా? అయితే వాడగా మిగిలినదానికి కాస్త వెన్న రాసి చూడండి, తాజాగా ఉంటుంది.
  3. కప్ అడుగు బాగంలో టీ మరకలు ఎండిపోతే కాస్త ఉప్పు చల్లి నీళ్ళు పోసి నానా పెడితే అవి సులువుగా వదిలిపోతాయి.
  4. బెండకాయ, వంకాయ వంటి కూరలు రుచిగా ఉండాలంటే నూనె లో కాస్త మొక్కజొన్న పిండి కలిపితే సరిపోతుంది.
  5. cooker అడుగుబాగం నల్లగా మారితే అందులో గ్లాస్ నీళ్ళు పోసి కాగితం పరిస్తే మరునాడుకి తెల్లబడుతుంది.
  6. గుడ్డులోని పచ్చ సొన వంట గది గట్టు మీద పడితే ఆ ప్రాంతంలో ఉప్పు చల్లి గంట తరువాత కాగితంతో తుడిస్తే మారక ఆనవాళ్ళు ఉండవు.
  7. దోసల పిండి బాగా పులిస్తే అందులో రెండు చెంచాల గోధుమ పిండిని కలిపితే అవి రుచిగా వస్తాయి.
  8. వేడిచేసిన గరిటతో జాడీలో నుంచి ఊరగాయను బయటకు తీస్తే అది పాడవకుండా తాజాగా ఉంటుంది.
  9. బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలో నాలుగు ఎండు మిరపకాయలు వేస్తే పురుగు పట్టదు.
  10. పెరుగు పచ్చడి మరింత రుచిగా ఉండాలంటే తాలింపులో చెంచా నెయ్యి వేస్తే సరిపోతుంది.
  11. పిండిలో పావు కప్పు వేయించిన సేమియా వేస్తే, గారెలు మరింత రుచిగా ఉంటాయి.
  12. అరటికాయ ముక్కలను కాసేపు మజ్జిగలో వేసి తీసి వేయిస్తే చక్కగా వేగుతాయి.
  13. ఇడ్లీ దోస పిండి మరునాటికి పులవకుండా ఉండాలంటే, గిన్నె మీద తడి వస్త్రం కప్పాలి లేదా సోడా ఉప్పు వెయ్యాలి.
  14. మజ్జిగ పలచన అయితే పది కరివేపాకు రెబ్బలు, కాస్త ఉప్పు కలిపి నూరి ముద్దలా చేసి కలిపితే చిక్కపడతాయి.
  15. వెన్న కాచేటప్పుడు నెయ్యి తాజా గా ఉండి మంచి వాసన వస్తు ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే గిన్నెలో ఒక తాజా తమలపాకు వేసి కాచితే సరి.
  16. పుదినా కొత్తిమీర చెట్నీ చేసేటప్పుడు అందులో కొద్దిగా పెరుగు వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
  17. వెల్లుల్లిని fridge లో ఉంచితే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి, పోట్టుకూడా సులువుగా వస్తుంది.
  18. కాఫీ మరింత రుచిగా ఉండాలంటే, decoction లో చిటికెడు ఉప్పు వేసి చూడండి.
  19. పావుగంట పాటు వేడి నీళ్ళలో నాన పెడితే బాదం పొట్టు సులువుగా వస్తుంది.
  20. ఆపిల్ ముక్కల మీద నిమ్మ రసం రాస్తే రంగు మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.
  21. క్యాబేజీ కూర వండేటప్పుడు అందులో కొద్దిగా నిమ్మరసం వేస్తే కూర మరింత రుచిగా ఉంటుంది.
  22. కూరలు చేసేటప్పుడు నూనె వేడెక్కగానే పసుపు వేస్తే, కూరలు వాటి సహజ రంగు కోల్పోకుండా ఉంటాయి.
  23. మరీ జిడ్డు పేరుకుపోయిన పాత్రలను తోమడానికి ఉప్పులో ముంచిన నిమ్మ చెక్కలతో తోమి పాత పత్రికలతో రుద్దితే సరి.
  24. ఒకసారి వేసిన వడ లని మళ్ళి వేయిస్తుంటే నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి, దీన్ని నివారించేందుకు వడ లని ఒక నిమిషం మాత్రమె వేయించండి. ఆ వెంటనే tissue కాగితంపై ఉంచండి. అధిక నూనె సమస్య ఉండదు, వడలు కరకరలాడతాయి.
  25. ఆకు కూరలు ఉడికించిన నీటిని వృధాగా పారెయ్యకుండా soup ల తయారీలో వాడుకోవచు.
  26. ఫ్లాస్కులని ఎంత సుబ్రం చేసినా దుర్వాసన వస్తుంటే మజ్జిగతో కడిగితే సరి.
  27. బొంబాయి రవతో ఉప్మా చేసేటప్పుడు ఉండ కట్టకుండా ఉండాలంటే నూకకి చెంచా నూనె పట్టిస్తే సరిపోతుంది.
  28. కూరల్లో పులుసులో ఉప్పు కారం ఎక్కువయ్యినప్పుడు రెండు చెంచాల సెనగపిండిని వేయించి కలిపితే సరిపోతుంది.
  29. మరీ నిల్వ ఉంచిన సెనగపిండిని పారవేయ్యకుండా స్టీలు గిన్నెలు వెండి సామాన్లను తోమితే చక్కగా సుబ్రపడతాయి.
  30. వొంట గదిలో చీమలు బారులు తీరాయా? అయితే అవి ఉన్న చోట నిమ్మరసం చల్లండి.
  31. పాలలో మీగడ ఎక్కువగా రావాలంటే కాచడానికి ముందు పాల గిన్నెను చల్లటి నీటిలో ఉంచండి.

వంటింటి చిట్కాలు:- కాఫీ డికాషన్‌లో చిటికెడు ఉప్పు వేస్తే...

  1. * అల్లం వెల్లుల్లిని రుబ్బే ముందు కొద్దిగా వేయించితే ఆ మిశ్రమం ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
  2. * నిలువ పచ్చళ్ళకు ఆవ నూనెను వాడితే అవి ఎక్కువ రోజులు పాడవకుండా తాజాగా ఉంటాయి.
  3. * అరటి పువ్వులను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. వాటివల్ల లోపలి పదార్ధాల రుచి, వాసన, రంగు మారిపోతుంది.
  4. * పప్పులు, ధాన్యాలు, పిండి, బియ్యంలో పురుగు పట్టకుండా ఉండాలంటే వాటిని నిల్వ ఉంచిన డబ్బాలో కొన్ని వేపాకులు వేస్తే పాడవకుండా ఉంటుంది. 
  5. * టీ కప్ అడుగు భాగంలో టీ మరకలు పోవాలంటే ఉప్పు నీళ్ళతో కడిగితే మరకలు సులువుగా వదులుతాయి.
  6. * పచ్చి బఠానీలను ఉడికించేటప్పుడు వాటిలో చిటికెడు పంచదార వేస్తే రంగు మారకుండా ఉంటాయి.
  7. * కాఫీ మరింత రుచిగా ఉండాలంటే డికాషన్‌లో చిటికెడు ఉప్పు వేస్తే మరింత రుచిగా ఉంటుంది.
  8. * బెండకాయ కూర చేయడానికి ముందు ముక్కల మీద కాస్త నిమ్మ రసం చల్లితే జిగురు ఉండదు.
  9. * కూరలో చింతపండు రసానికి బదులు టమాటా గుజ్జు వేస్తే కూరలు మరింత రుచిగా ఉంటాయి. కూరల రంగు మారకుండా ఉంటుంది.

నిర్జీవమైన జుట్టుకు చిట్కాలు...

కొందరికి జుట్టు పీచులా తయారయ్యి జీవం లేనట్లు నిర్జీవంగా కనపడుతుంది. జుట్టు పీచులా జీవం లేనట్టు అయ్యిందంటే వెంట్రుకలు ఎక్కువగా చిట్లిపోయి ఉన్నాయని అర్థం. పైగిపోతున్న ఎండలు, కాలుష్యం, షాంపూలు, బ్లో డ్రైయ్యింగ్, స్ట్రెయిటనింగ్, కలరింగ్ … వంటివన్నీ జుట్టును దెబ్బతీసేవే! హెయిర్ స్టైలింగ్‌లోనూ, దువ్వడంలోనూ వెంట్రుకలు సులువుగా దెబ్బతింటాయి. చిట్లిన వెంట్రుకలను బాగుపరచాలన్నా, కళ తప్పని జుట్టుకు జీవం పోయాలఅంటే ఈ టిప్స్ పాటిస్తే సరి. అవేంటో చూసేద్దామా...

  • షాంపూలో సహజసిద్ధమైన గుణాలు ఉన్నవి ఎంచుకోవాలి.
  • రసాయనాలు ఎక్కువగా ఉన్నవి, ఎక్కువసార్లు షాంపూ వాడటం వంటివి చేస్తే వెంట్రుకలు త్వరగా పొడిబారుతాయి.
  • వారానికి మూడుసార్లకన్నా ఎక్కువగా షాంపూను ఉపయోగించకూడదు. రోజు విడిచి రోజు తలస్నానం చేసినా పర్వాలేదు. అయితే వేడినీటిని తలస్నానానికి ఉపయోగించకపోవడం మేలు.
  • జుట్టుకు వేడి ప్రధానమైన శత్రువు. అందుకే తడిగా ఉన్న జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రయ్యర్లు, ప్లాట్ ఐరన్స్ వాడకూడదు. కనీసం వాటిని ఎక్కువసార్లు ఉపయోగించకుండా ఉండటానికి ప్రయత్నించాలి.
  • వేడిని భరించగలిగే హీట్ సిరమ్‌ను ముందుగా జుట్టుకు రాసి, తర్వాత డ్రయ్యర్, స్ట్రెయిటనింగ్  మిషన్స్ వాడాలి. తడి జుట్టును త్వరగా వేడి చేయకుండా చూస్తే వెంట్రుకలు త్వరగా దెబ్బతినడాన్ని నివారించవచ్చు.
  • వెంట్రుకలు చిట్లడాన్ని అరికట్టడానికి మంచి పరిష్కారం ట్రిమ్ చేయడం. 6-8 వారాలకు ఒకసారి వెంట్రుకల చివరలను ట్రిమ్ చేయించుకోవాలి.

గృహ చికిత్స:-

1. జుట్టు తేమను అందించాలంటే నూనెతో మసాజ్ చేయడం సరైన పద్ధతి. కొబ్బరి నూనె, ఆలివ్ నూనె లేదా బాదం నూనెలను కలిపి మాడుకు పట్టించి, మర్దనా చేయాలి. అరగంట వదిలేసి ఆ తర్వాత ప్రకృతి సిద్ధ గుణాలు ఎక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి.
2. మూడు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్, టేబుల్‌స్పూన్ తేనె గుడ్డు సొనలో కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి.
3. ప్రొటీన్లు ఎక్కువగా గల బొప్పాయి పండును గుజ్జులా చేయాలి. ఈ గుజ్జులో పెరుగు కలిపి తలకు పట్టించాలి. 30 ని.ల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే తేమ కోల్పోయిన వెంట్రుకలకు తిరిగి జీవం లభిస్తుంది.
4. తలస్నానం చేసిన తర్వాత చాలామంది కండిషనర్ వాడుతుంటారు. దానికి బదులుగా వెంట్రుకలకు కండిషనర్‌లా ఉపయోగపడే కప్పు తేనెలో రెండు టేబుల్ స్పూన్ల గోరువెచ్చని నీటిని కలిపి తలకు పట్టించాలి. 15 ని.ల తర్వాత నీటితో కడిగేయాలి.

వజ్రాసనం ఆరోగ్య రహస్యం...

శరీరాన్ని ఎల్లప్పుడూ కండిషన్‌లో ఉంచే అద్భుతమైన ఆసనం ఏదైనా ఉందంటే అది వజ్రాసనమే. పేరుకి తగ్గట్లే అది శరీరాన్ని వజ్రాయుధం లా చేస్తుంది.... క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్ధం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది
1. మలబద్దక నివారిణి: మన శరీరంలో అవయవాల మీద ఒత్తిడిని కలిగించే ఆసనం ఇది. ఈ ఆసనం యొక్క భంగిమ ఆబ్డామిన్(పొత్తికడుపు), పొట్ట మరియు ప్రేగుల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. ఈ ఒత్తిడి జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది మరియు దాంతో మలబద్దకం సమస్యతో బాధపడే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వజ్రాసనంతో ఇది ఒక గొప్ప ప్రయోజనం
2. ఒత్తిడి తగ్గిస్తుంది: మోకాళ్ళ మీద కూర్చోవడం వల్ల మీ వెన్ను మరియు కాళ్ళు కొంచెం సాగదీదకు గురిచేస్తుంది. ఈ వజ్రాసన భంగిమ అన్ని రకాల ఒత్తిడిలను తగ్గిస్తుంది. జాయింట్స్ మరియు మజిల్స్ విశ్రాంతి చెంది, స్ట్రెస్ ఫ్రీగా మారుతాయి. మరింత ఎఫెక్టివ్ గా పనిచేయాలంటే మోకాళ్ళ మీద కూర్చొని డీప్ బ్రీత్ తీసుకోవాలి. అలా చేసేప్పుడు, మీ కండరాలు రిలాక్స్ అవ్వడాన్ని మీరు గమనించవచ్చు. వజ్రాసన భంగిమ వల్ల ఇది ఒక గొప్ప ప్రయోజనం, మీరు ఒత్తిడితో బాధపడుతున్నట్లైతే. ఈ భంగిమలో కొద్ది సమయం కూర్చొంటే మీరు రిలాక్స్ గా భావిస్తారు మరియు రిఫ్రెష్ అవుతారు. వజ్రాసన వల్ల ఇది ఒక ముఖ్యమైన ఆరోగ్యప్రయోజనం.
3. వ్యాధులను నివారిస్తుంది: కొన్ని వ్యాధులను చాలా సులభంగా తగ్గించడంలో వజ్రాసనం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

Saturday, September 17

అంబలి యొక్క ఉపయోగాలు



రాగులని మొక్కగట్టి ఎండించి మెత్తగా దంచిన పొడిని నీళ్లలో వేసి బాగా ఉడికించి జారుగా జావకాచి తయారుచేసిన ఆహారపదార్ధం అంబలి .
ఇందులో రుచికోసం ఇష్టాన్నిబట్టి జీడిపప్పులు , వేరుశనగ పప్పులు , పచ్చకర్పూరం , జాజికాయ , కిస్మిస్ వంటివి కలుపుకోవచ్చు. లేదా ఉప్పు , కారం , కొంచం మోతాదులో మసాలా కూడా కలుపుకోవచ్చు . అంబలి ఆకలిని , రుచిని కలిగిస్తుంది. రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. ఎదిగే పిల్లలకు దీనిని ఇవ్వడం వలన శక్తివంతంగా తయారవుతారు. ఇది చలువచేస్తుంది. అన్నహితాన్ని కలగజేస్తుంది.అలసటని పోగొడుతుంది.

రక్తపోటు , షుగర్ వ్యాధి ఉన్నవారికి , రక్తస్రావంతో ఇబ్బంది పడుతున్నవారికి , నీరసంతో క్షీణించిన వారికి , అమితమైన వేడితో బాధపడుతున్న వారికి రాగి అంబలి చాలా ఉపయోగకరం .
అంబలి అంటే ధాన్యపు పిండితో కాచిన జావ మొలకెత్తిన ధాన్యంతో జావకాస్తే జీవనీయ విలువలు మర్రిన్ని శరీరానికి అందుతాయి. ధాన్యాలలోకెల్లా రాగులు శ్రేష్టం .

అందుకని రాగిఅంబలి గురించి మీకు తెలియజేస్తున్నాను. బియ్యపుపిండితో కూడా అంబలి చేసుకోవచ్చు . అది కెలోరీలు పెంచుతుంది . కొన్ని వ్యాధుల్లో అపకారం చేస్తుంది .
బలాకరంగా , వీర్యపుష్టిని ఇచ్చేదిగా రాగి అంబలి మేలు చేస్తుంది . ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా రాగి అంబలి తాగడం వలన శరీరదృడత్వం పెరుగుతుంది. స్థూలకాయం సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతి ఉదయం రాగిఅంబలి తాగడం శ్రేయస్కరం.

రాత్రి భోజనం తర్వాత ఫ్రూట్స్ తినడం హానికరమా ?

ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. వీటిలోని విటమిన్స్ అన్ని వయసుల వాళ్ల ఆరోగ్యానికి మంచిది. అయితే పండ్లు ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు అనే దానిపై చాలామందికి అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా రాత్రిపూట ఫ్రూట్స్ తినవచ్చా ? తినకూడదా ? అనేది చాలామందిని వేధించే అనుమానం.

         సాధారణంగా పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం మధ్యలో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. కానీ రాత్రిపూట మాత్రం పండ్లు తీసుకోకూడదని సూచిస్తున్నారు. ప్రతి ఫ్రూట్ లోనూ ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటుంది. మనం ఆకలితో ఉన్నప్పుడు లేదా అలసటగా అనిపించినప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటే.. ఫ్రక్టోజ్ శరీరంలోకి వెళ్లి గ్లూకోజుగా మారుతుంది. అది తక్షణ శక్తినిస్తుంది. కానీ రాత్రిపూట అంటే విశ్రాంతి తీసుకునే సమయంలో.. తక్షణ శక్తి మంచిది కాదు. అందుకే నిద్రపోవడానికి ముందు పండ్లు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.
            ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. వీటిలోని విటమిన్స్ అన్ని వయసుల వాళ్ల ఆరోగ్యానికి మంచిది. అయితే పండ్లు ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు అనే దానిపై చాలామందికి అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా రాత్రిపూట ఫ్రూట్స్ తినవచ్చా ? తినకూడదా ? అనేది చాలామందిని వేధించే అనుమానం. Is Eating Fruit Before Bed Bad సాధారణంగా పండ్లను ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం మధ్యలో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు హెల్త్ ఎక్స్ పర్ట్స్. కానీ రాత్రిపూట మాత్రం పండ్లు తీసుకోకూడదని సూచిస్తున్నారు. ప్రతి ఫ్రూట్ లోనూ ఫ్రక్టోజ్ పుష్కలంగా ఉంటుంది. మనం ఆకలితో ఉన్నప్పుడు లేదా అలసటగా అనిపించినప్పుడు ఫ్రూట్స్ తీసుకుంటే.. ఫ్రక్టోజ్ శరీరంలోకి వెళ్లి గ్లూకోజుగా మారుతుంది. అది తక్షణ శక్తినిస్తుంది. కానీ రాత్రిపూట అంటే విశ్రాంతి తీసుకునే సమయంలో.. తక్షణ శక్తి మంచిది కాదు. అందుకే నిద్రపోవడానికి ముందు పండ్లు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. Is Eating Fruit Before Bed Bad పండ్లు తీసుకున్నగంట తర్వాతే మధ్యాహ్న భోజనం చేయాలి. వారాంతాల్లో అల్పాహారానికి బదులుగా 90 శాతం పండ్లు తీసుకోవడానికి ప్రయత్నించండి. యాపిల్‌, బొప్పాయి వంటి పిండి పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం మంచిది. కానీ ఉదయం అల్పాహారంతో కానీ, మధ్యాహ్నం భోజనంతో కానీ పండ్లు తీసుకోవడం మంచిది కాదు. భోజనం చేసిన తర్వాత పండ్లు తీసుకోవడం వల్ల డైజెస్ట్ అవడానికి ఇబ్బందిగా మారుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి ఆహారం తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ తీసుకోకూడదు. అయితే.. సలాడ్ రూపంలో ఒకటి రెండు ముక్కలు తినడం వల్ల ఎలాంటి సమస్యా ఉండదు.