Monday, December 25

యాలకుల లాభాలు ఇవే :


1.భోజనం చేసిన వెంటనే ఒకటి రెండు యాలకులను నములుతూ ఉంటె నోటి దుర్వాసన పోతుంది ,జీర్ణ సమస్యలు ఉండవు
2.ఆస్తమా ,దగ్గు ,జలుబును తగ్గించడంలో యాలకులు మెరుగ్గా పని చేస్తాయి.రోజు మూడు నాలుగు సార్లు యాలకులను తీసుకొని బాగా నమిలి చప్పరిస్తే ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది
3.యాలకులను రోజు తింటుంటే గుండె సమస్యలు పోతాయి
రక్త సరఫరా మెరుగుపడుతుంది
4.రక్త హీనత సమస్య ఉన్నవారు రోజు యాలకులను తినాలి దీంతో రక్తం పెరుగుతుంది
5.శరీరంలో ఉన్న విష ,వ్యర్ధ పదార్ధాలు భయటకు వెళ్ళిపోతాయి శరీరం అంతర్గతంగా శుబ్రమవుతుంది

Sunday, December 24

బాలింతలలో పాలు వృద్ధిచేయు దివ్య యోగాలు -

* అతిమధుర చూర్ణం పాలలో కలిపి తీసుకొనిన స్త్రీలకు పాలు వృద్ది అగును.
* అనుములు పప్పుగా చేసి ఉడకబెట్టి తినిన స్త్రీలకు పాలు పడును. చారుగా కూడా తయారుచేసి వాడుకోవచ్చు .
* ఆకుపత్రి చూర్ణం 2 గ్రాములు గొరువెచ్చటి నీటితో తీసుకొన్న బాలింతలలో పాలు ఉత్పత్తి అగును.
* ఆవుపాలు , వాము , వాము వాటర్ పాలుపడజేయును .
* కర్బుజా పండు తీసుకుంటూ ఉన్న యెడల పాలు వృద్ది అగును.
* గోధుమ పిండితో చేసిన పూరి పాలల్లో నానబెట్టి తినిపించుచున్న పాలు ఎక్కువగును .
* చేపలను నిప్పుల మీద కాల్చి వాటిని తినిన పాలు వృద్ది అగును.
* చిట్టాముదపు ఆకులకు ఆముదం పూసి వెచ్చచేసి స్త్రీ చన్నులపై వేసి జారకుండా బట్టతో కట్టి 12 గంటలపాటు ఉంచిన తప్పక పాలు వృద్ది అగును.
* పండిన బొప్పాయి తినినచో పాలు వృద్ది అగును.
* లేత మునగ ఆకు కూర ప్రసవానంతరం ఇవ్వడం వలన స్త్రీలలో పాలు వృద్ది అగును.
* ఆవుపాలలో బియ్యము వేసి వండి పటికబెల్లం కలుపుకుని తినుచున్నచో పాలు వృద్ది అగును.

పెరుగును ఈ పదార్థాలతో విడిగా కలిపి తినండి, అద్భుత ఫలితాలు పొందండి...

1. కొద్దిగా జీల‌క‌ర్ర ‌ను తీసుకుని పొడి చేసి దాన్ని ఓ కప్పు పెరుగులో క‌లుపుకుని తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతారు.
2. కొద్దిగా న‌ల్ల ఉప్పును తీసుకుని బాగా పొడి చేయాలి. దాన్ని ఓ క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తాగాలి. దీంతో జీర్ణ సంబంధ స‌మ‌స్య ‌లు దూర‌మ‌వుతాయి. ప్ర ‌ధానంగా గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.
3. కొద్దిగా పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినాలి. దీంతో శ‌రీరానికి వెంట‌నే శ‌క్తి అందుతుంది. మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి.
4. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంతాల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.
5. ఓ క‌ప్పు పెరుగులో కొంత న‌ల్ల మిరియాల పొడిని క‌లిపి తినాలి. దీని వ‌ల్ల మ‌ల‌బ‌ద్ద‌కం దూర‌మ‌వుతుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.
6. పెరుగులో కొన్ని ఓట్స్ క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి.
7. పెరుగులో వివిధ ర‌కాల పండ్ల‌ను క‌లిపి తింటే శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్ట‌మ‌వుతుంది. ప‌లు ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు, వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు.
8. పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుంది.
9. పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుంది.
10. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స ‌ర్ లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర ‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష ‌ న్లు వెంట‌నే త‌గ్గుతాయి.

Saturday, December 23

తులసీ ఆకుల రసాన్ని..?

ఆయుర్వేద చిట్కాలు:
* ఉసిరికాయను బాగా నమిలి తింటే పళ్లు, చిగుళ్లు దృఢమవుతాయి.
* అల్లాన్ని దంచి రసం తీసుకుని తేనె కలిపి రోజు ఉదయం, సాయంత్రం తీసుకుంటే రక్తపోటు దూరమవుతుంది.
* కిడ్నీలో రాళ్లుంటే బొప్పాయిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
* తులసీ ఆకుల రసాన్ని రాత్రి ముఖానికి పట్టించి, తెల్లవారు జామున కడిగేస్తే మీ చర్మం కాంతివంతమవుతుంది.
* పుదీనా ఆకులను నీటిలో మరగనించి ఆ నీటిని తాగితే జలుబుతో వచ్చే జ్వరానికి చెక్ పెట్టవచ్చు.

* నీరసం తగ్గాలంటే అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే సరిపోతుంది.
* నిమ్మరసంలో తేనె కలిపి తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.
* మామిడిని రోజూ తీసుకుంటే నరాల బలహీనతకు చెక్ పెట్టవచ్చు.

* 200ml పాలులో ఒక టేబుల్ స్పూన్ పసుపు పొడి కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది.

Tuesday, December 12

ఇ'లావు'oటే కష్టమే..!

ఆధునిక జీవనశైలి కారణంగా వస్తున్న అనేక సమస్యల్లో స్థూలకాయం (ఓబెసిటీ) ఒకటి. అందుకే.. అమెరికన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ దీన్ని ఒక వ్యాధిగా వర్గీకరించింది. అనేక రుగ్మతలకు ఇది ప్రధాన కారణమని తేల్చింది. గుండె జబ్బు, అధిక రక్తపోటు, మధుమేహం వంటివి స్థూలకాయం వల్లే సంభవిస్తాయని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. అయితే.. మరేం చేయాలి? దీని నుంచి ఉపశమనం లేదా? కచ్చితంగా ఉంది.
పెరుగుతున్న సాంకేతికత, యంత్ర వినియోగం వల్ల చాలామంది కనీస వ్యాయామాలకు, శారీరక శ్రమకు దూరమవుతున్నారు. ఒళ్లు వంచకుండా బద్ధకస్థులుగా తయారవుతున్నారు. కదలకుండా యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ కూర్చుండిపోతున్నారు. ఆఫీసుల్లో కంప్యూటర్ల ముందు గంటల కొద్దీ కూర్చొవడమే కాకుండా ఇంటికి వచ్చాక కూడా అదేపనిగా టీవీ వీక్షణం, సోషల్‌ మీడియాలో చాటింగ్‌తో అధిక సమయం గడుపుతున్నారు. పైగా వీరు ఆ సమయంలో చిరుతిళ్లు కూడా తినేస్తుంటారు. భోజనం చేసి త్వరగా నిద్రపోవాలనుకోరు. ఆలస్యంగా నిద్రపోయి ఆసలస్యంగా లేస్తారు. ఆ తర్వాత ఉరుకులు పరుగులు షురూ. ఇక దైనందిన జీవితంలో శారీరక శ్రమకు చోటేది? అది లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడి, ఉద్వేగాలు పెరుగుతున్నాయి. అనేక శారీరక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. అంతేకాదు.. స్థూలకాయానికి ఇవి ప్రధాన కారణమవుతున్నాయి.
చాలా మంది. ఆధునిక జీవనశైలికి అలవాటుపడి చెత్తాచెదారంతో కడుపు నింపుకుంటున్నారు. ప్రాసెస్డ్‌ ఫుడ్‌, ప్యాకెజ్డ్‌ ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌, పిజ్జాలు, బర్గర్లు, అధికంగా తీపి ఉండే పదార్థాలు, నూనె వేపుళ్లు, మసాలాలతో కూడిన ఆహార పదార్థాలు తిని అనారోగ్యాన్ని కొనితెచ్చుకుంటున్నారు. కొందరు యాంటీ డిప్రస్సంట్స్‌, హార్మోన్స్‌ టాబ్లెట్స్‌ వాడటం, హైపోథైరాడిజం వల్ల స్థూలకాయానికి గురవుతున్నారు. మరికొం దరికి వంశపారంపర్యంగా ఈ సమస్య సంక్రమిస్తోంది.
సమస్య.. నివారణ :- అధిక రక్తపోటు, మధుమేహమే కాకుండా శ్వాసకోశ సమస్యలు, కొన్ని రకాల క్యాన్సర్లు, మహిళల్లో సంతాన లేమి, రుతు సమస్యలు, గుండెపోటు, పక్షవాతం, హోర్మోన్ల సమతుల్యత దెబ్బతినడం, మోకాళ్ల నొప్పులు, మూత్రం ఆపుకోలేకపోవడం, ఫ్యాటీ లివర్‌, సిర్రోసిన్‌, డిప్రేషన్‌, ఆత్మ నూన్యత వంటి సమస్యలు స్థూలకాయం వల్ల వస్తాయి.
కొందరుపని ఒత్తిడి వల్ల, మరికొందరు నిర్లక్ష్యం, ఇంకొందరు సరైన అవగాహన లేకపోవడం వల్ల తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం లేదు. తద్వారా వీరు దీర్ఘ కాలిక వ్యాధుల బారిన పడుతుంటారు. అయితే.. జీవనశైలిని మార్చుకుంటే ఇలాొంటి సమస్యలేమీ ఉండవు. బరువు తగ్గి, మంచి శరీరాకృతి కలిగి ఉండాలని దృఢ సంకల్పం ఉంటేనే అది సాధ్యమవుతుంది. దైనందిన చర్యల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మంచి ఆరోగ్యం, శరీరాకృతి, మానసిక ఉల్లాసం వస్తుంది. ఆయుష్షు కూడా పెరుగుతుంది. ఆహారంలో మార్పులు, శారీరక శ్రమను పెంచడం, డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడటం లాంటివి ఇందుకు దోహదం చేస్తాయి. వీటిలో శారీరక శ్రమ, ఆహారపు అలవాట్లలో మార్పు అనేవి ఉత్తమ ఫలితాలు ఇస్తాయి. ఆహారాన్ని నియంత్రించడం అన్నింటికన్నా ముఖ్యం. అలాగని ఉపవాసం పాటించడం, తిండి మానేయడం లాంటివి అస్సలు చేయొద్దు. ఆహారం తినేటప్పుడు పరిమాణాన్ని తగ్గించుకుంటే చాలు.
తినకూడనివి/తగ్గించుకోవాల్సినవి:- కొవ్వు ఎక్కు వున్న మాసం (రెడ్‌మీట్‌), ఫామ్‌ ఆయిల్‌, గుడ్డులోని పచ్చసొన, కాలేయం, కొవ్వు ఎక్కువున్న పాలు, పాల ఉత్పత్తులు, ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌, ప్యాకేజ్డ్ణ్‌ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌, పిజ్జాలు, బర్గర్లు, పూరీ, అధిక మసాలాలు, నూనె వేపుళ్లు.
ఎక్కువగా తినాల్సినవి:- చేపలు, పౌల్ట్రీ చికెన్‌, వండిన బీన్స్‌, బ్రౌన్‌ రైస్‌, గోధుమలు, జొన్నలు, రాగులు, తాజా పండ్లు, తాజా కూరగాయలు, ఆకు కూరలు.
వ్యాయామం:- నడక చాలా సులువైన, చవకైన వ్యాయామ సాధనం. నడవాలనే ఆలోచన రాగానే వెంటనే అందుకు ఉపక్రమించాలి.
'రేపటి నుంచి' అని వాయిదా వేసుకుంటూ పోవద్దు. అలాగైతే ఎప్పటికీ వాకింగ్‌ చేయలేరు. కనీసం రోజూ 45 నిమిషాల నుంచి ఒక గంట నడవాలి. 2-3 రోజులు నడిచి ఆపేయొద్దు. కనీసం వారంలో ఐదు రోజులు వాకింగ్‌ చేయాలి. మొదటి ఐదు నిమిషాలు మెల్లగా నడుస్తూ శరీరాన్ని నడకకు సన్నద్ధం చేయాలి. తర్వాత 30-40 నిమిషాలు వేగంగా నడవాలి. రోజురోజుకూ నడక సమయాన్ని పెంచాలి. వేగంగా వల్ల ఆయాసం రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న దూరాలకు వాహనాలు వాడకుండా నడవడం అలవాటు చేసుకోవాలి. మెట్లు ఎక్కి దిగడం, చిన్న చిన్న పనులు చేయడం, యంత్రాల సహాయం లేకుండా ఇంటి పనులు చేయడం తప్పనిసరి. శారీరక శ్రమ పెంచి, కాలరీలు కరిగించుకుంటే స్థూలకాయాన్ని క్రమేణా తగ్గించుకోవచ్చు.
మందులు:- బరువును తగ్గించే మందులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ.. సరైన వ్యాయామం, ఆహార నియంత్రణ లేకుండా అవి మంచి ఫలితాలు ఇవ్వవు. మందులు వాడటం, శస్త్రచికిత్స చేయించుకోవడం లాంటివి డాక్టర్‌ సలహా మేరకే పాటించాలి. సొంత వైద్యం ప్రమాదానికి దారి తీయొచ్చు.

Thursday, December 7

ఒక చెంచా వాములో !

పోపుల డబ్బాలో కాకుండా విడిగా ఓ చిన్నడబ్బాలో మాత్రమే కనిపించే వాములోని ఔషధగుణాలు అన్నీ ఇన్నీ కావు అంటున్నారు పరిశోధకులు. వీటిలో ఉండే అనేక రసాయనాలు జీర్ణక్రియకి ఎంతగానో సహాయపడతాయి. ఇవి ఇన్‌ఫెక్షన్‌ బారిన పడకుండా కాపాడుతాయి...
  • వాములో అధికంగా ఉండే థైమల్‌ అనే రసాయనం బ్యాక్టీరియా, ఫంగల్‌ వ్యాధుల్ని నిరోధిస్తుంది. యాంటీ సెప్టిక్‌గానూ పని చేస్తుంది.
  • అలాగే ఇందులో అనేక విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. తలనొప్పి, జలుబు, అలసట, మైగ్రెయిన్‌ వంటి వాటికి వాము మందులా పని చేస్తుంది.
  • గర్భిణుల్లో ఆకలిని పెంచి గర్భాశయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. వాము కడుపునొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో ఒక చెంచా వాము కలిపి తాగితే అజీర్తి తగ్గి, ఆకలి పెరుగుతుంది. గ్యాస్‌ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.
  • వాము నుంచి తీసిన నూనె కీళ్లనొప్పుల్ని తగ్గిస్తుంది. ముక్కు బాగా బిగిసిపోయి ఉంటే వామును నూరి పలుచని బట్టలో కట్టి వాసన చూస్తే త్వరగా ఉపశమనం పొందుతారు. ఒక చెంచా వామును గ్లాసు నీళ్లల్లో మరిగించి, గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే దగ్గు, జలుబు సమస్యలు తగ్గుముఖం పడతాయి.
  • వాము నీళ్లని పుక్కిలించడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది. వాముని తేనెతో కలిపి వరుసగా పది రోజులు తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగే అవకాశం ఉందట. 

Sunday, December 3

ఆలుబుఖారాలో ఆరోగ్య రహస్యం...


ఈ పండులో పోషకాలు మెండు. ఇందులో కేలరీలు చాలా తక్కువ. సాధారణంగా పండ్లు తీసుకుంటే గ్లూకోజ్‌ లెవల్స్‌ పెరుగుతాయి. ఆలుబుఖారాలో ఇలాంటి దోషాలేవీ ఉండవు. 'గ్లాసిమిక్‌ ఇండెక్స్‌' చాలా తక్కువగా ఉండటమే దీనికి కారణం.
  1. ఈ పండులో విటమిన్‌-సీ మోతాదు ఎక్కువ. రోగ నిరోధకశక్తిని పెంచి ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఇది కాపాడుతుంది.
  2. ఇందులో విటమిన్‌-ఏ, బీటా కెరోటిన్‌ కూడా ఎక్కువే. ఆరోగ్యంగా ఉండేందుకు ఇవెంతో తోడ్పడతాయి.
  3. మనం తీసుకునే ఆహారంలోని ఐరన్‌ని శరీరం గ్రహించేందుకు ఆలుబుఖారా దోహద పడుతుంది.
  4. ఇందులోని ప్రోసైయానిడిన్‌, నియో క్లోరోజెనిక్‌ యాసిడ్‌, క్యూర్‌సెటిన్‌ లాంటి ఫెనోలిక్‌ రసాయనాలు శరీరంలో వాపు తగ్గేందుకు తోడ్పడతాయి.
  5.  ఈ పండులో ఫైబర్‌ స్థాయిలు ఎక్కువ. జీర్ణ శక్తిని మెరుగుపర్చేందుకు ఇది దోహదపడు తుంది.
  6. ఆలుబుఖారాలో పొటాషియం ఎక్కువ. గుండె జబ్బులు, రక్తపోటు రాకుండా ఇది కాపాడుతుంది.
  7. శరీర ఉష్ణోగ్రత సమతుల్యతకు ఆలుబుఖారా దోహదపడుతుంది.
  8. ఈ పండులో ఉండే విటమిన్‌ ఎముకల దృఢత్వా నికి, ఆల్జీమర్స్‌ని నివారించేందుకు తోడ్పడతాయి.
  9. కంటిచూపును మెరుగుపర్చే లక్షణం ఆలుబు ఖారాలో ఉంది.
  10. జ్వరం, మలబద్ధకం తగ్గేందుకు ఈ పండు బాగా పనిచేస్తుంది.
  11. మోనోపాజ్‌ దశ దాటిన మహిళల్లో సాధార ణంగా కనిపించే బోలు ఎముకల వ్యాధి (ఆస్ట్రియో పోరోసిస్‌)ని కూడా ఇది నివారిస్తాయి.