Sunday, April 30

తాటి ముంజ‌ల‌ను వేస‌విలో తిన‌డం వ‌ల్ల ఎలాంటి అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చో తెలుసా..?

వేస‌వి కాలంలో సీజ‌న‌ల్ పండుగా ల‌భించేది మామిడి. దీన్ని ఈ కాలంలో చాలా మంది తింటారు. అయితే దీంతోపాటు ఇంకోటి కూడా మ‌నంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అది తాటి ముంజ‌. అవును, అదే. మండే ఎండ‌ల్లో చ‌ల్ల చ‌ల్ల‌ని తాటి ముంజ‌ల‌ను తింటే వ‌చ్చే మ‌జాయే వేరు. దీంతో శ‌రీరం చ‌ల్ల‌గా ఉండ‌డ‌మే కాదు, మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన కీల‌క పోష‌కాలు అందుతాయి. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా న‌య‌మ‌వుతాయి. ఎక్కువ‌గా గ్రామీణ ప్రాంతాల్లో ముంజ‌లు ల‌భించినా, నేటి త‌రుణంలో సిటీలో కూడా ఇవి ఎక్కువ‌గానే మ‌న‌కు దొరుకుతున్నాయి. ఈ క్ర‌మంలో ఈ సీజ‌న్‌లో తాటి ముంజ‌ల‌ను రెగ్యుల‌ర్‌గా తింటే దాంతో మ‌న‌కు ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం...
1. అర‌టి పండ్ల‌లో పొటాషియం ఎంత ఉంటుందో అంతే మొత్తంలో పొటాషియం తాటి ముంజ‌ల్లోనూ ఉంటుంది. దీంతో గుండె ఆరోగ్యం ప‌దిలంగా ఉంటుంది. ర‌క్త స‌ర‌ఫరా మెరుగు ప‌డుతుంది. బీపీ అదుపులో ఉంటుంది.
2. శ‌రీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ పోతుంది. మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అధిక బ‌రువు త‌గ్గుతారు.
3. ఎండాకాలంలో మ‌న ఒంట్లో నీరు వేగంగా ఖ‌ర్చ‌వుతుంది. ఈ క్ర‌మంలో మ‌నం డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌తాం. అయితే అలాంటి స్థితిలో తాటి ముంజ‌ల‌ను తింటే దాంతో శ‌రీరంలోకి ద్ర‌వాలు వ‌చ్చి చేర‌తాయి. డీహైడ్రేషన్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.
4. జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి. గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణ‌మ‌వుతుంది.
5. ఎండాకాలంలో శ‌రీరం వేడిగా ఉండేవారు తాటి ముంజ‌ల‌ను తిన‌డం మంచిది. దీంతో ఒళ్లు చ‌ల్ల‌బ‌డుతుంది. హాయినిస్తుంది.
6. గుండె స‌మ‌స్య‌లు ఉన్న వారు, అధిక బ‌రువు ఉన్న వారు, షుగ‌ర్ ఉన్న‌వారు నిర‌భ్యంత‌రంగా తాటి ముంజ‌ల‌ను తిన‌వ‌చ్చు.
7. తాటి ముంజులలో శరీరానికి కావాల్సిన ఎ, బి , సి విటమిన్లు ఐరన్ , జింక్ , పాస్ఫరస్ , పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శ‌రీర బ‌రువును అదుపులో ఉంచుతాయి.
8. తాటి ముంజ‌ల‌లో ఉండే పొటాషియం శ‌రీరంలో ఉన్న విష ప‌దార్థాల‌ను బ‌య‌టికి పంపుతుంది. దీంతో శ‌రీరం అంత‌ర్గ‌తంగా శుభ్ర‌మ‌వుతుంది.
9. వేస‌విలో ఎండల కార‌ణంగా వాంతులు, విరేచ‌నాలు అవుతున్న వారికి తాటి ముంజ‌ల‌ను తినిపించాలి. దీంతో ఆయా స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.
10. తాటి ముంజ‌ల‌ను తింటే శ‌క్తి బాగా వ‌స్తుంది. రోజంతా యాక్టివ్‌గా ఉండ‌వ‌చ్చు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల‌కు ఇవి మేలు చేస్తాయి.
11. బ్రెస్ట్ క్యాన్స‌ర్‌తోపాటు ప‌లు ర‌కాల ఇత‌ర క్యాన్స‌ర్ల‌ను కూడా రాకుండా అడ్డుకునే గుణాలు తాటి ముంజ‌ల్లో ఉన్నాయి.

Saturday, April 29

చుండ్రు నివారణకు...

  1. ఒక కప్పు నీటిలో అర చెంచా నిమ్మ రసం కలిపి తలకు పట్టించాలి. నెలకు రెండుసార్లు ఇలా చేస్తే మెలమెల్లగా చుండ్రు మటుమాయం అవుతుంది.
  2. రాత్రి పూట కొబ్బరినూనెలో నిమ్మ రసం కలిపి తలకు పట్టించి మాలిష్‌ చేయండి. తెల్లవారిన తర్వాత తల స్నానం చేయండి. దీంతో చుండ్రు తగ్గిపోతుంది.
  3. యూకలిప్టస్‌ నూనె చుక్కలు కొన్ని కొబ్బరి నూనెలో కలిపి తలకు మాలిష్‌ చేయండి. ఆ తర్వాత తలస్నానం చేయండి. మెల్లగా చుండ్రు సమస్య వదిలిపోతుంది. పడుకునే దిండు కవర్లు, దుప్పట్లు తరచుగా ఉతికేస్తుండాలి. దువ్వెనలను కూడా క్లీన్‌ చేసుకోవాలి.

సీసా పాలతో పిల్లలకు కలిగే నష్టాలు మీకు తెలుసా..?

తల్లి పాలు పిల్లలకు ఎంతో శ్రేయోస్కరం.. ప్రసవానంతరం తల్లులు తమ పిల్లలకు పాలు రానప్పుడు సీసాతో పాలు పట్టిస్తుంటారు.. కానీ అదెంత ప్రమాదకరమో వారికి తెలియదు.. సీసా పాలకు, తల్లి పాలకు ఎంతో వ్యత్యాసముందని గ్రహించాలి.. పుట్టిన ప్రతి బిడ్డకీ తల్లిపాలు తప్పకుండా యివ్వాలి. తల్లిపాలలో అనేక రకాల పోషక పదార్థాలు ఉంటాయి. బిడ్డకు కనీసం 1 సంవత్సరం వరకైనా తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాలి.. సీసా పాలు త్రాగించటం వలన చాలా నష్టాలున్నాయి.
పిల్లలు సీసా పాలకు అలవాటు పడటం పిల్లలకు మంచిది కాదు.. మరియు తల్లులకు మంచిది కాదు పిల్లలకు పాలు పట్టడం వలన తల్లులు కూడా ఆరోగ్యంగా ఉంటారని కొన్ని పరిశోధనల్లో తేలింది..
సీసాను నిటారుగా కాకుండా అడ్డంగా పట్టుకొన్నట్లయితే శిశువు పాలతోపాటు గాలిని కూడా పీల్చటం వల్ల కడుపు సగం గాలితో నిండిపోతుంది.. కడుపులో గాలి ఎక్కువగా చేరటం వల్ల కడుపునొప్పి రావచ్చు.
సీసాను మనం నోట్లో పెట్టడం వలన అది ఏమాత్రం కాస్త పక్కకు జరిగిన ముక్కులోకి పాలు పోయి అది కాస్తా ఊపిరితిత్తులోకి వెళ్లే ప్రమాదం ఉంది..
సీసాలో పాలు త్రాగించే ముందు సీసాను ప్రతిసారి ‘స్టెరిలైజ్‌’ చేయాలి. అలా చేయకపోవడం వల్ల దానికి అంటుకొని వున్న బాక్టీరియా శరీరంలోకి ప్రవేశించడం వల్ల బిడ్డకు వివిధ రకాలైన వ్యాధులు రావచ్చు.
ఒకసారి సీసా పాలకు అలవాటు పడిన పిల్లలు తల్లిపాలపై ఆసక్తి తగ్గడం వల్ల పాల ఉత్పత్తి క్రమంగా తగ్గుతుంది.
బిడ్డను నిద్ర పుచ్చటానికి కొందరు తల్లులు రాత్రి సమయాల్లో సీసా అందిస్తారు. దీనివల్ల రాత్రంతా నోట్లో పాలు నిలిచిపోయి వాటి నుండి బాక్టీరియా, సూక్ష్మ జీవులు తయారై దంతక్షయానికి దారి తీస్తుంది.
సీసా పాల వల్ల తల్లి, బిడ్డ అనుబంధం ప్రకృతి సిద్ధంగా తగ్గే అవకాశం ఉంది. సీసా నోటికిచ్చి తల్లి తన పని తను చేసుకుంటూ వుంటే ఇద్దర మధ్య సంబంధం బాంధవ్యాలు లోపించే అవకాశం ఉందని పరిశోధనలో తేలిందట..
దీర్ఘకాలం సీసాతో పాలు త్రాగడం వల్ల దంతాలు కూడా ఎగుడుదిగుడుగా వస్తాయి.
సీసాతో పాలు త్రాగే పిల్లలకు ఎన్ని పాలు సరిపోతున్నాయో అన్న విషయంపై అవగాహన లేకపోవడంతో అవసరానికి మించి పాలు త్రాగించడం వలన స్థూలకాయం వచ్చే అవకాశం ఎక్కువ.

Friday, April 28

ప్రాణాలకే ప్రమాదమైన వడదెబ్బ నుంచి తప్పించుకోవటం ఎలా?

వేసవి వచ్చిందంటే చాలు, భయపెట్టించే ఆరోగ్య సమస్యల్లో వడదెబ్బ ఒకటి. ఎండలో ఎలాంటి రక్షణ లేకుండా తిరిగితే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే ఒక వ్యవస్థ సహజంగానే మన శరీరంలో ఉంటుంది. ఈ వ్యవస్థ బలహీనపడినప్పుడు ఉష్ణోగ్రత అదుపు తప్పి వడదెబ్బకు గురికావచ్చు. అందుకే అవగాహనా రాహిత్యంతో సూర్యుడి తాపాన్ని నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. వీలైనంత వరకు ఎండలో బయటికి వెళ్లకపోవడం, చల్లని నీటిని తీసుకుంటూ శరీరాన్ని సమత్యులంగా ఉంచుకోవటం వంటి సాధారణ జాగ్రత్తలతో వడదెబ్బ నుండి రక్షించుకోవచ్చు.

  వడదెబ్బ అంటే ? 

సాధారణంగా మానవ శరీర ఉష్ణోగ్రత 100 నుండి 104 డిగ్రీల ఫారన్‌హీట్‌ వరకు ఉంటుంది. 100కుపైగా టెంపరేచర్‌ ఉన్నప్పుడు సాధారణంగా జ్వరం వచ్చినట్లు చెబుతాం. (40 డిగ్రీల సెంటిగ్రేటెడ్‌ రెక్టాల్‌ టెంపరేచర్‌ కంటే అధికంగా ఉంటే సన్‌స్ట్రోక్‌గా గుర్తిస్తారు.), ఉష్ణోగ్రతలు 104, 106 డిగ్రీలకు పెరిగి నిలకడగా ఉంటే సన్‌స్ట్రోక్‌గా పరిగణనలోకి తీసుకుంటారు. వేసవిలో ప్రధానంగా ఈ పదం తెలియని వారుండరు. వివిధ ప్రాంతాల్లో వడదెబ్బ, ఎండదెబ్బ, సన్‌స్ట్రోక్‌, హీట్‌ స్ట్రోక్‌గా పిలుచుకుంటారు. వేసవిలో సూర్యుడి తాపం అంతకంతకు పెరుగుతుంది. ఈ ఉష్ణోగ్రతలను నిర్లక్ష్యం చేసి ఎక్కువగా ఎండలో తిరగటంతో వడదెబ్బకు గురవుతారు.
ఎవరికి త్వరగా తగులుతుంది? సాధారణంగా ఐదేళ్ల సంవత్సరాల లోపు, 60 సంవత్సరాల పైబడిన వారు త్వరగా ఎండదెబ్బకు లోనవుతారు. ఒక్కోసారి ఇది ఆకస్మిక మరణాలకు దారితీస్తుంది. అదే విధంగా గర్భిణీలు, బాలింతలు శరీరంలోని తేమ శాతాన్ని కాపాడుకోవటం మంచిది. మద్యపానం-మాదక ద్రవ్యాలు తీసుకునేవారు, పొగ తాగేవారు, స్థూలకాయం, నిద్ర లేమి వంటి రుగ్మతులున్న వారు సన్‌స్ట్రోక్‌కు త్వరగా లోనవుతారు. కాబట్టి శరీరంలో వేసవిలో నీటి శాతం తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లక్షణాలు సాధారణంగా వడదెబ్బ ప్రభావం ముందుగా శరీరంపై పడుతుంది. అధికంగా ఎండలో తిరగటంతో శరీరం మీది రక్తకణాలు కుంచించుకుపోతాయి. అనంతరం ఈ ప్రభావం కిడ్నీలు, లివర్‌ దెబ్బతినడానికి దారి తీస్తుంది.
సన్‌స్ట్రోక్‌కు గురైన వారిలో జ్వరం, వాంతులు, విరేచనాలు, తల తిరగటం, శరీరంలో నీటి శాతం లోపించి డీహైడ్రేట్‌ అవ్వటం, చెమటలు రాకుండా, అధిక టెంపరేచర్‌తో పల్స్‌ పడిపోవటం, మతి కోల్పోవటం, కోమాలో పడిపోవటం, యూరిన్‌ పచ్చగా రావటం వంటి లక్షణాలు కనబడతాయి.
ఆకస్మిక మరణం వేసవిలో ఎండ ప్రభావం పడకుండా ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అశ్రద్ధతో చేసే నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణాలు కోల్పోవాల్సి రావచ్చు. శరీరంలోని నీటి సమతుల్యతను కాపాడుకోవడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటి చిన్నపాటి జాగ్రత్తలతో వడదెబ్బను అధిగమించవచ్చు. అత్యధికంగా ఎండకు తిరగటం వల్ల హృదయ స్పందనలో కలిగే మార్పుల కారణంగాను, మెదడులోని భాగం సమతుల్యతను కోల్పోతాం. ఫలితంగా అదుపు చేసే శక్తి లేకపోవటంతో సన్‌స్ట్రోక్‌ వచ్చి ఆకస్మిక మరణాలు సంభవిస్తాయి. దాదాపు 30 నుండి 40 శాతం మేర వడదెబ్బ మరణాలు చోటుచేసుకుంటాయి.
వడదెబ్బ చికిత్స:
  • వడదెబ్బ తగిలిన వ్యక్తిని గుర్తించిన వెంటనే నీడలో సేదతీరేలా చేయాలి.
  • బట్టలు వదులు చేసి(25-30 డిగ్రీల) నీళ్లతో తడపాలి, ఈ విధంగా చేయటంతో రక్తనాళాలు కుంచించుకుపోకుండా ఆపగలం.
  • గజ్జల్లో, సంకల్లో, మెడ వద్ద ఐస్‌ప్యాక్‌లు పెట్టాలి.
  • వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో శరీరంలోని నీటి శాతం పెంచేందుకు ఐవి ఫ్లూయిడ్స్‌ అందించాలి.
  • బాధితుల లివర్‌, కిడ్నీల పనితనం గుర్తించే వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారు.
ముందు జాగ్రత్తలు:
సన్‌స్ట్రోక్‌ నుండి రక్షణ పొందేందుకు చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలి. ఎండలో బయటికి వెళ్లేవారు టోపీలు, స్కార్ఫ్‌లు వాడితే మంచిది. ప్రధానంగా మధ్యాహ్నం 12 గంటల నుండి ఐదు గంటల వరకు ఎండలో తిరగకపోవటం ఉత్తమం. ఒకవేళ వృత్తిలో తప్పనిసరి అయిన వారు కార్యాలయాలలో చల్లటి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ప్రతి అర్ధగంటకు మూడు వందల మిల్లీలీటర్ల చొప్పున రోజుకు ఐదారు లీటర్లకు తగ్గకుండా నీరు తాగాలి. ఒ.ఆర్‌.ఎస్‌ నీళ్ళు, కొబ్బరికాయ, గ్లూకోజ్‌ నీరు తీసుకోవటం మంచిది. విద్యార్థులు పరీక్షల సమయం కావటంతో ఎండ నుండి దూరంగా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఆటలు ఆడేవారు సాయంత్రం సమయంలో ఆడుకోవటం చేయాలి.

వేసవి వరం తాటి ముంజలు…

వేసవి కాలంలో మధురమైన రుచులనగానే టక్కున మనకు గుర్తుకు వచ్చేది మామిడి పండు మరియు తాటి ముంజలు.. ఈ కాలంలోనే ఇవి మన ముందుకు వచ్చి నోరూరిస్తాయి. ముంజలు మండు వేసవిలో దాహాన్ని ఇట్టే తీరుస్తాయి. సహజసిద్దమైన తియ్యి నీరు, మృదువైన గుజ్జు, మరెన్నో ఔషధ గుణాలతో కూడిన తాటి ముంజలు గురించి తెలుసుకొందాం...
పల్లె, పట్టణము అనే తేడా లేకుండా వేసవిలో ప్రతిచోట లభించే తాటి ముంజలంటే ఇష్టం లేనివారు ఉండరు. వీటిలో నీటి శాతం ఎక్కువ. కార్బోహైడ్రేట్లు అతి తక్కువ కావటం వల్ల మండే ఎండల్లో దాహార్తిని ఆరికడుతుంది. శరీరం నీటి ని కోల్పోకుండా అడ్డుకొని, ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. ముంజలు జీర్ణం కావానికి పట్టే సమయం గంట.
ఇక ఔషధ గుణాల విషయానికి వస్తే...
1) లేత ముంజలలో అధిక శాతం తేమ ఉంటుంది. అత్యల్ప శాతం (0.1 గ్రా) క్రొవ్వు పదార్థాలు, పరిమిత స్థాయిలో పిండి పదార్థాలు ఉన్నందున హృద్రోగులు, చక్కెర వ్యాధిగ్రస్తుల, స్థూలకాయులు వీటిని 2 నుంచి 4 వంతున ఫలాహారంగా తీసుకోవచ్చు.
2) ఎండాకాలంలో అరిచేతులు, కాలిమంటలు, శరీరంలో నీరు తగ్గిపోవటం (Dehydration), దాహం వేయటం, తదితర సమస్యలతో బాధపడేవారు తగు మోతాదులో ముంజల్ని తీసుకుంటే ఫలితం ఉంటుంది.
3) ఎండాకాలంలో మూత్రం సాఫీగా రాని వారికి లేత తాటి ముంజలు మంచి ఔషధంలా పనిచేస్తాయి. మూత్ర విసర్జనలో మంట వంటి సమస్యలనూ ఇవి నివారిస్తాయి.
4) గర్భిణులకు కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తినాలి. ఫలితంగా జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా.. మలబద్ధకం, ఎసిడిటీ.. లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి.
5) తాటిముంజలు ఎక్కువగా తింటే శరీరంలో నీరు చేరుతుంది. జీర్ణప్రకియ కూడా ఆలస్యమవుతుంది.
6) ఈ పండులో అధిక మొత్తంలో ఉండే పొటాషియం మన శరీరంలో ఉండే విషపదార్థాలను తొలగిస్తుంది.. పరగడుపున ముంజలు తింటే ఆకలి మందగిస్తుంది. తాటి ముంజలు కాలేయ సంబంధ సమస్యల్ని కూడా తగ్గిస్తాయి.
7) ఈ పండుని ఎక్కువగా తినడం వల్ల క్యాన్సర్ల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. శరీరంలో గ్లూకోజ్ స్థాయిని పెంచి.. శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రియంట్ల శాతాన్ని బ్యాలన్స్ చేయడంలో కూడా ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి.
8) చాల ముఖ్యమైన విషయం ఏమిటంటే చాలామంది ముంజలను పైన వుండే పొట్టును తీసేసి తింటారు. కానీ ఆలా తినకూడదు.. ఆ పొట్టులోనే ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఆ పొట్టువల్లే శరీరానికి ఎక్కువ చలువ చేస్తుంది. కాబట్టి తాటి ముంజల్ని పొట్టు తీయకుండా చాలా మంచిది.

చికెన్ తింటే ఆరోగ్యానికి లాభమా? నష్టమా ???

ఏదైనా బాగా తినాలని నోరూరినప్పుడు మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చికెన్. జ్యూసీగా, టేస్టీగా ఉండే చికెన్ చంక్స్ తింటే స్వర్గానికి దరిదాపుల్లో ఉన్నంత సంతోషంగా ఉంటుంది. అవునా కాదా? కాని, చికెన్ టేస్ట్ లో ఉన్న గొప్పదనం మనల్ని కొన్ని విషయాలు ఆలోచించ నీయకుండా చేస్తుంది. అసలు, చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ప్రతి రోజు చికెన్ ని ఆహారంలో భాగంగా చేసుకోవాలని అనుకోవడం మంచి ఆలోచన కాకపోయినా వారంలో మూడుసార్లు చికెన్ ను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అంటున్నారు. సరైన మోతాదులో ఆహారం తీసుకుంటే వాటి ప్రభావం ఆరోగ్యంపై సానుకూలంగా ఉంటుంది. ఒకే సారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావాలు ఎక్కువ. చికెన్ ను ఎంత ఇష్టపడినా ఎక్కువ మోతాదులో తీసుకోకుండా జాగ్రత్తపడాలి. ఆహారంలో చికెన్ కు స్థానం కలిపించడం వల్ల మన ఆరోగ్యంపై చికెన్ ఏ విధమైన ప్రభావం చూపుతుందో ఇపుడు తెలుసుకుందాం. చికెన్ ను వెయిట్ లాస్ డైట్ గా పేర్కొంటారన్న విషయం మనకందరికీ తెలిసిందే. వీటితో పాటు చికెన్ ను తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

ఆరోగ్యకరమైన ఎముకలు :-
బోన్ డెన్సిటీని పెంచే గుణం చికెన్ లో ఉంది. అందువల్ల సాధారణంగా సంభవించే ఆస్టియోపోరోసిస్, ఆస్టియోఆర్త్రైటిస్ అనే బోన్ డిసీస్ ల నుంచి రక్షించే కెపాసిటీ చికెన్ లో ఉంది. సరైన పోషకాలున్న చికెన్ సూప్స్ కూడా అందుబాటులో ఉంటాయి. రోగులు త్వరగా కోలుకునేందుకు వీటిని వైద్యులు సూచిస్తూ ఉంటారు కూడా.
ప్రోటీన్ లెవల్స్ ను పెంపొందిస్తుంది :-
చికెన్ లో ఎన్నో మంచి పోషకాలు ఉంటాయి. ఇందులో లభించే ఎన్నో పోషకాలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. పెరుగుదలకు అవసరమైన ఎమినో యాసిడ్స్ వంటి వివిధ రకాల ప్రోటీన్స్ చికెన్ లో పుష్కలంగా లభిస్తాయి.
మనసును చురుగ్గా ఉంచుతుంది :-
చికెన్ ను క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకునే వారి ఫిజికల్ యాక్టివిటీలు పెరిగే అవకాశాలున్నాయని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మనసుకు ప్రశాంతతనిచ్చి సెల్ఫ్ కంట్రోల్ ను పెంపొందించే శక్తి చికెన్ లో ఉందని అధ్యయనాలు తెలిపాయి.
పిల్లల ఎదుగుదలకు తోడ్పడుతుంది :-
పిల్లల ఆహారంలో చికెన్ కు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. తల్లులు తమ పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండేందుకు వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉన్న చికెన్ ను తమ పిల్లలకు ఆహారంగా ఇస్తారు. మెదడు ఎదుగుదలకు చికెన్ తోడ్పడుతుంది. ఎముకలను శక్తివంతం చేస్తుంది. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తుంది. పిల్లల ఎదుగుదల సక్రమంగా ఉండేందుకు చికెన్ తోడ్పడుతుంది.
పెద్ద పెద్ద రోగాలను అరికడుతుంది :-
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. చికెన్ ను సరైన మోతాదులో ఆహారంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. డిప్రెషన్, గుండె వ్యాధులు అలాగే కొన్ని ఊపిరి సంబంధమైన వ్యాధుల బారిన పడకుండా చికెన్ రక్షిస్తుంది. రెడ్ మీట్స్ కంటే చికెన్ ఎంతో ఉత్తమం.
కండరాల నిర్మాణంలో ప్రధాన పాత్ర:-
ఆరోగ్యకరమైన, ఫీట్ గా ఉన్న శరీరాన్ని పొందాలని అనుకునే వారు కచ్చితంగా చికెన్ ను సరైన మోతాదులో ఆహారంగా తీసుకోవాలి. వ్యాయామాన్ని విస్మరించకూడదు. చికెన్ ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇప్పటికైనా చికెన్ ను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే లాభాలు అర్థమయ్యాయి కదా. చికెన్ ను నిర్లక్ష్యం చేయకండి మరి. 
చెడు ప్రభావం :-
చికెన్ వల్ల కలిగే లాభాలే కాకుండా చికెన్ వల్ల కలిగే నష్టాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. అపరిశుభ్రంగా వండిన చికెన్ వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. జీర్ణక్రియ మందగిస్తుంది. చికెన్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల చికెన్ ను జీర్ణించుకోవడం కొంచెం కష్టతరమవుతుంది. చికెన్ ను జీర్ణించుకోవడం కొన్ని గంటలు పట్టవచ్చు. 
హనీకరమైన బ్యాక్టీరియా :-
సరైన టెంపరేచర్ లో చికెన్ ను వండాలి. చికెన్ ను వండేటప్పుడు టెంపరేచర్ ను గమనించడానికి మార్కెట్ లో కొన్ని పరికరాలు లభ్యమవుతాయి. వాటిని కొని తెచ్చుకుంటే చికెన్ ను వండేటప్పుడు టెంపరేచర్ మీ గమనించవచ్చు. వండిన 24 గంటలలో చికెన్ తో తినకపోతే హనీకరమైన బ్యాక్టీరియాకు చికెన్ నిలయమవుతుంది. పాడైన చికెన్ తింటే ఎన్నో రకాల ఆనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. 
హార్మోన్స్ తో ఇంజెక్ట్ చేయబడిన చికెన్ :-
చికెన్ కు ఉన్న హై డిమాండ్ వల్ల డిమాండ్ ను మీట్ అయ్యేందుకు కొన్ని సార్లు సరైన చికెన్ లు ప్రజలకు అందుబాటులోకి రావట్లేదు. కొన్ని సార్లు సహజసిద్ధమైన చికెన్ కు బదులు ఫాక్టరీ నుంచి కొన్ని రకాల హార్మోన్స్ తో తయారైన చికెన్ లను మార్కెట్ లోకి వదులుతున్నారు. చికెన్ ను కొనేటప్పుడు అందుకే జాగ్రత్తగా ఉండాలి.

కోపంగా ఉన్నారా? అయితే..

కోపం.. మనిషిని విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. తన కోపమే తనకు శత్రువు అన్నారు పెద్దలు. ఉద్రేకం అనేక అనర్థాలకు దారి తీస్తుంది. అయితే.. దాన్ని తక్షణమే తగ్గించుకోవడానికి ఓ అద్భుత చిట్కా ఉందంటున్నారు నిపుణులు. కోపం వచ్చినప్పుడు నోట్లో కాస్త చక్కెర వేసుకుంటే అది అప్పటికప్పుడే మటుమాయం అవుతుం దని ఒహియో విశ్వవిద్యాలయం చేపట్టిన అధ్య యనంలో తేలింది. నోట్లో చక్కెర వేసుకుంటే కోపమే కాదు.. నిగ్రహాన్ని నియంత్రించొచ్చని వెల్లడైంది. దీనికి మెదడుకు శక్తిని అందించే గ్లూకోజే కారణమని పరిశోధకులు అంటు న్నారు. ఉద్రేకం కలగకుండా ఉండాలంటే మనో నిగ్రహం కావాలి. దీనికి శరీరంలో చాలా శక్తి ఖర్చవుతుంది. ఈ శక్తిని గ్లూకోజే మెదడుకు అందిస్తుంది. ఇలా గ్లూకోజుకు, ఉద్రేకానికి దగ్గర సంబంధం ఉంటుంది. తీయటి పానీయాలు తాగటం వల్ల తాత్కాలిక శక్తి లభిస్తుందని, ఇది ఇతరులపై దౌర్జన్యానికి పాల్పడకుండా చూస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. శరీరంలో గ్లూకోజును వినియో గించుకునే ప్రక్రియ దెబ్బతిన్నవారు త్వరగా ఉద్రేకం తెచ్చుకుంటారని, ఇతరులను క్షమించ టానికీ ఇష్టపడరని పరిశోధనల్లో తేలింది.

Thursday, April 27

గ్యాస్‌ ట్రబుల్‌.. ఇది చాలా మంది ఎదుర్కొనే సమస్య. కొందరికి ఎన్ని మందులు వాడినా దీని నుంచి విముక్తి కలగదు. పేగుల్లో తయారయ్యే గ్యాస్‌ ప్రమాదం కలిగించదు కానీ..

ముఖ్యమైన మీటింగులో ఉన్నప్పుడు గానీ, లిఫ్ట్‌లో ఇతరులతో పాటు నిలబడినప్పుడు గానీ, జీవిత భాగస్వామితో లేదా ప్రేమించిన వ్యక్తితో ఉన్నప్పుడు గానీ గ్యాస్‌ విడుదల చేయాల్సి వస్తే సంకటస్థితి అంతా ఇంతాకాదు. సాధారణ వ్యక్తుల్లో మామూలు పరిస్థితుల్లో రోజుకు కనీసం 10 సార్లు గ్యాస్‌ విడుదల చేస్తూ ఉంటారు. కొంతమందిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో బంధింపబడి తీవ్రస్థాయిలో కడుపునొప్పిని కలిగించే అవకాశం ఉంది.
మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను కలిగించే కారణాల వల్ల అదనంగా గ్యాస్‌ తయారు కావడమే కాకుండా నొప్పిగా అనిపిస్తుంది. పేగుల్లో తయారయ్యే గ్యాస్‌లో ఆక్సిజన్‌, నైట్రోజన్‌, హైడ్రోజన్‌, కార్బన్‌ డై ఆక్సైడ్‌, మిథేన్‌ వంటి వాయువులు ఉంటాయి.
లక్షణాలు :-
గ్యాస్‌ సమస్య కలిగిన వారికి అప్రయత్నంగానే విడుదలవుతుం టుంది. గ్యాస్‌ వల్ల కడుపునొప్పిగా అనిపిస్తుంది. కడుపులో నొప్పి చాలా తీక్షణంగా, ఉదరకండరాలను పట్టేసినట్టు ఏదో ప్రమాదకరమైన సమస్య ఉందేమో అన్నంత స్థాయిలో వస్తుంది. గ్యాస ్‌వల్ల వచ్చే కడుపునొప్పి ఉదరంలో ఒక భాగంలో కేంద్రీకృ తం కాకుండా త్వరితగతిన మారుతుం టుంది. ఆమ్లాశయంలో కండరాలు ముడిపడినట్టు అనిపించొచ్చు. గ్యాస్‌వల్ల ఒకవేళ ఉదరంలో ఎడమవైపు పైభాగంలో నొప్పి వస్తుంటే గుండెనొప్పిగా భ్రమకలుగుతుంది. అలాగే గ్యాస్‌ వల్ల ఒకవేళ ఉదరంలో కుడివైపు పైభాగంలో నొప్పి వస్తుంటే ఎంపెండిసైటిస్‌గా లేదా గాల్‌స్టోన్స్‌ నొప్పిగా భ్రమ కలుగుతుంది. పొట్ట ఉబ్బరింపుగా నిండిపోయినట్టు బిర్రుగా అనిపించడం గ్యాస్‌ ప్రధాన లక్షణం. అలాగే రోజుల తేడాతో పొట్ట వచ్చినట్టు, మళ్లీ అంతలోనే తగ్గిపోయినట్టు కనిపిస్తుంది.
కారణాలు :- 

  1. మాట్లాడేటప్పుడు గానీ, ఆహారాన్ని మింగేటప్పుడు గానీ గాలిని మింగటం.
  2. ఆందోళనగా ఉన్నప్పుడు గానీ ఉధ్విగంగా ఉన్నప్పుడు గానీ గాలిని అసంకల్పితంగా మింగటం
  3. ఆహారాన్ని నమలకుండా గబగబ మింగటం.
  4. చూయింగ్‌గమ్‌ వంటి వాటిని అదే పనిగా నమలటం.
  5.  స్ట్రాతో ద్రవ పదర్థాలు తాగటం.
  6. ఆహారంలోని పిండి పదార్థాలు చిన్నపేగులో జీర్ణం కాకపోతే పెద్ద పేగులోని బ్యాక్టీరియా చర్య జరిపి పులిసిపోయేలా చేసి గ్యాస్‌ని విడుదల చేయటం.
  7. పండ్లు, కాయగూరలు, గింజధాన్యం, బీన్స్‌, చిక్కుడు, బఠాని తదితర పీచు పదార్థాలు అరగకపోవటం.
  8. సోడా, బీర్‌, శీతలపానీయాలు తదితర గాలి నిండిన కార్బనేటెడ్‌ పానీయాలను తీసుకోవటం.
  9. ఇతర వ్యాధులు సమాంతరంగా బాధిస్తుండటం (డైవర్టిక్యులైటిస్‌, క్రాన్స్‌ వ్యాధి, అల్సరేటివ్‌ కోలైస్‌).
  10. యాంటీ బయాటిక్స్‌ని అతిగా వాడటం (ఇవి మంచిచేసే సాధారణ బ్యాక్టీరియాను సైతం నాశనం చేస్తాయి).
  11. విరేచనౌషధాలను గాని లేదా మలాన్ని బంధించే ఔషధాలను గానీ వాడటం (వీటివల్ల పేగు కదలికలో తేడాలు చోటుచేసుకుంటాయి).
  12. మలబద్ధకంతో ఇబ్బంది పడుతుండటం (మలం బిరడా వేయటం వల్ల గ్యాస్‌ కింద నుంచి వెళ్లలేక, పొట్ట ఉబ్బరింపు కలుగుతుంది).
  13. పాలలోని ల్యాక్టోజ్‌ అనే తీపి పదార్థాన్ని శరీరం సూక్ష్మాంశాలుగా విభజించి జీర్ణించుకోలేకపోవటం (మిల్క్‌ ఇంటాలరెన్స్‌).
  14. గోధుమల్లోని గ్లూటెన్‌ అనే జిగురు పదార్థాన్ని శరీరం అనుఘటకాలుగా విభజించి విలీనం చేసుకోలేకపోవటం (గ్లూటెన్‌ ఇంటాలరెన్స్‌).
  15. ఆహారానికి కలిపే కృత్రిమ పదార్థాలు పడపోవటం (బబుల్‌గమ్స్‌, సుగర్‌ క్యాండీలు వంటి వాటిల్లో కలిపే సార్బిటాల్‌, మ్యానిటాల్‌ వంటి పదార్థాలు గిట్టకపోవటం).
అయితే.. ఏం చేయాలి ?
గ్యాస్‌ కలిగించే ఆహారాలను మానేయాలి. అన్ని ఆహార పదార్థాలూ ఒకే మాదిరిగా గ్యాస్‌ని, గ్యాస్‌ నొప్పిని కలిగించవు. వేపుడు పదార్థాలను, నూనె పదార్థాలను మానేయాలి. కొవ్వు పదార్థాలు అమ్లాశయంలో వేగంగా కదలవు. దీనితో పొట్టనిండినట్లు అనిపించి ఉబ్బరిస్తుంది. పీచుపదార్థాలను తగ్గించాలి. పీచు పదార్థాలను ఆహారంలో నెమ్మదిగా, అల్పమోతాదులో చేర్చుతూ క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలి.
పీచుపదార్థాలను తీసుకునే సమయంలో ఎక్కువగా నీళ్లు తాగాలి. పాలను మానేయాలి. లేదా కనీసం బాగా తగ్గించాలి. పాలకు బదులు అవసరమనుకుంటే పెరుగు వాడాలి. లేదా పాలను వాడటం తప్పదనుకుంటే పాలను అన్నం వంటి ఇతర పదార్థాలతో కలిపి వాడాలి. పుదీనా పచ్చడ లేదా వేడి వేడి పుదీనా కషాయం తీసుకోవాలి. పుదీనాలో ఉండే మెంథాల్‌ (పిప్పర్‌మింట్‌) జీర్ణావయవాల కండరాలను వదులు చేసి గ్యాస్‌ సంచితవకుండా చేస్తుంది. అయితే ఒకవేళ ఎసిడిటి గానీ, రిఫ్లక్స్‌ గానీ ఉంటే పుదీనాలోని మెంథాల్‌ ఆ సమస్యలను ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది.
జీవన విధానం :-
ఆహారాన్ని కొద్ది మొతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. బబుల్‌గమ్‌ నమలటం, గట్టి క్యాండీలను చప్పరించటం, స్ట్రాతో పానీయాలు తాగటం మానేయాలి. ఈ చర్యలతో గాలిని ఎక్కువగా మింగే అవకాశం ఉంటుంది. ఆందోళనగా ఉన్నప్పుడు గానీ, గాబరాగా ఉన్నప్పుడు గానీ, హడావుడిగా ఉన్నప్పుడు గానీ ఆహారం తీసుకోవద్దు. ఎప్పుడూ నింపాదిగా ఉన్నప్పుడు మాత్రమే తినాలి.
చిట్కాలు :-

  1. ఉదర కండరాల మీద టర్పెంటైన్‌ ఆయిల్‌ని వేడిచేసి మర్దన చేయాలి. ఉప్పు మూటతో కాపడం పెట్టుకోవాలి. దీనితో ఉదరకండరాల్లో స్తబ్దత తగ్గి పేగుల కండరాలు వదులవుతాయి. ఫలితంగా గ్యాస్‌ తప్పించుకుని ఉపశమనం లభిస్తుంది.
  2. వామును దోరగా వేయించి మెత్తని పొడిగా నూరి ఉదయ, సాయంకాలాలు భోజనానికి ముందు అరచెంచాడు తీసుకోవాలి.
  3. ఇంగువను దోరగా వేయించి, పొడి చేసి పావుచెంచాడు మోతాదుగా వేడి అన్నంతో మొదటి ముద్దతో కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు బాధించదు.
  4. జీలకర్ర రెండు భాగాలు, శొంఠి నాలుగు భాగాలు, ఉప్పు ఒక భాగం, శంఖభస్మం (ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది) రెండు భాగాలు తీసుకుని మెత్తగా నూరి, నిష్పత్తి ప్రకారం కలిపి సీసాలో నిల్వ చేసుకోవాలి.
  5. గ్యాస్‌తో పొట్ట ఉబ్బరించినప్పుడు ఈ మిశ్రమాన్ని అరచెంచాడు మోతాదుగా వేడినీళ్లతో కలిపి తీసుకోవాలి.
  6. ఆకలి లేకపోవటం వల్ల పొట్ట ఉబ్బరిస్తుంటే జీలకర్రను దోరగా వేయించి, పొడిచేసి, అరచెంచాడు నుంచి చెంచాడు మోతాదుగా భోజనానికి ముందు అరకప్పు వేడినీళ్లతో తీసుకోవాలి.
  7. వాము, అల్లం, జీలకర్రను సమ భాగాలుగా తీసుకుని సైంధవ లవణం కలిపి నూరి ఉదయం, సాయంత్రం తీసుకోవాలి.
  8. నిరంతరం కడుపుబ్బరంతో బాధపడేవారు భోజనానికి ముందు రెండు, మూడు అల్లం ముక్కలను ఉప్పుతో అద్దుకుని తింటుండాలి.
  9. త్రిఫలాలు (కరక్కాయ, తానికాయ, ఉసరి కాయ వలుపు), త్రికటు (శొంఠి, పిప్పళ్లు, మిరియాలు) చూర్ణాన్ని సమ భాగాలుగా తీసుకుని కషాయం తయారు చేసి తాగాలి.
  10. నల్లజీలకర్ర (కలౌంజి) గింజలు (4 భాగాలు), శొంఠి (2 భాగాలు), నల్ల ఉప్పు (1 భాగం), శంఖభస్మం (1 భాగం) నిష్పత్తిలో తీసుకుని దంచి పొడిచేయాలి. ఈ మిశ్రమాన్ని 3-6 గ్రాముల మోతాదుగా పుచ్చుకోవాలి.
  11. ఆరు భాగాలు నిమ్మరసానికి ఐదు భాగాలు చక్కెర కలిపి పానకం తయారు చేసుకోవాలి. రెండు చెంచాల మోతాదులో నీళ్లతో కలిపి తీసుకోవాలి.

Wednesday, April 26

మెంతులతో మెరిసిపోవచ్చు...

మెంతులు, మెంతి ఆకులతో అందాన్ని మెరుగుపరుచుకోవచ్చు. మెంతిలో అధిక మోతాదులో లభించే ప్రొటీన్‌ జుట్టు రాలడాన్ని నివారించడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇందులోని నికోటినిక్‌, లెసిథిన్‌ కుదుళ్లు బలంగా మారేందుకు, జుట్టు ఎదగడానికీ సాయం చేస్తాయి. ఇక ఇందులోని పొటాషియం చిన్నవయసులోనే శిరోజాల రంగు మారడాన్ని అరికడుతుంది. ఈ ఫలితాలు అందాలంటే గుప్పెడు మెంతుల్ని ఓ రోజంతా నానబెట్టాలి. ఆ నీటిని వడకట్టి జుట్టుని తడపండి. జుట్టుని అలాగే మూడు నాలుగు గంటలపాటు ఆరనివ్వండి. ఆపై గోరువెచ్చని నీటితో స్నానం చేసి చూడండి. ఇలా వీలైతే రోజూ చేయండి.
తాజాగా ఉండే మెంతి ఆకులను తీసుకొని శుభ్రంగా కడిగి మెత్తగా మిక్సీ పట్టాలి. ఆ ముద్దకు ఓ రెండు చెంచాల నిమ్మరసం కలిపి తలకు పెట్టుకోవాలి. అరగంటాగి స్నానం చేస్తే జుట్టు పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. పావుకప్పు మెంతుల్ని నాలుగైదు గంటల ముందు పెరుగులో నానబెట్టుకోవాలి. దాన్ని మరీ మెత్తగా కాకుండా కాస్త బరకగానే రుబ్బుకోవాలి. దీన్ని ముఖం, మెడ, చేతులకు పట్టించి బాగా నలుగు పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మృత కణాలు తొలగిపోతాయి. చర్మంపై పేరుకున్న దుమ్ము,ధూళి, మురికి వదిలిపోతాయి. చర్మం నునుపుగా తయారవుతుంది. ఇలా కనీసం వారంలో ఒకసారి చేస్తే యుక్తవయసు అమ్మాయిల్లో మొటిమల సమస్య తగ్గుతుంది. 

Tuesday, April 25

ఇవి తింటే కిడ్నీకి మంచిది...

మూత్ర సంబంధిత సమస్యలు చాలా ఎక్కువగా పెరిగిపోతున్న రోజులివి. అందుకే రోజూ తీసుకొనే ఆహరంలో మూత్రపిండాలకు మేలు చేసే కాయగూరలు అందేలా జాగ్రత్త పడటం మంచిది. క్యాబేజీలో కె విటమిన్‌ , సి విటమిన్‌, పీచు పదార్థం అధికంగా ఉండటం వలన ఇవి బరువు అదుపులో ఉండటమే కాకుండా, రోగినిరోధక శక్తిని పెంచుతాయి. మూత్రపిండాల్లోని వ్యర్ధాలను బయటకు పంపుతాయి క్యాలీఫ్లవర్‌ కూడా మూత్రపిండాలను శుభ్రపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే ఉల్లిపాయల్ని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల మూత్రపిండాలకు రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. రాళ్ళు ఏర్పడినా వాటిని దూరం చేయడానికి దోహదం చేస్తాయి. వెల్లుల్లి, క్యారెట్‌లు కూడా మూత్రపిండాల సంరక్షణలో తోడ్పాటును అందిస్తాయి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. ఇవి మూత్రపిండాలలో తలెత్తే ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. ప్రతిరోజూ ఒక క్యారెట్‌ తింటే, లేదా గ్లాసు క్యారెట్‌ రసం తీసుకుంటే మూత్ర పిండాలకు చాలా మంచిది. ముల్లంగి కూడా మూత్రపిండాల సమస్యలను దూరం చేస్తుంది. దీనిలో పోషకాలు , ఔషధ గుణాలు ఎక్కువ, క్యాలరీలు తక్కువ. దీన్ని తరచూ తీసుకోవడం వల్ల మూత్రపిండాలు శుభ్రపడతాయి. మూత్రసంబంధిత ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు దీన్ని ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది.

బేబీ పౌడర్‌ వల్ల ఉపయోగాలు...

చంటి పిల్లలకు స్నానం చేసిన వెంటనే బేబీ పౌడర్‌ వేస్తారు. బేబీ పౌడర్‌ను వేసేప్పుడు అనుకోకుండా కాస్త ఎక్కువ పడితే వృథాగా కింద పడేస్తారు. కిందపడిన ప్రతి సారి ఆందోళనపడాల్సిన అవసరం లేదు. కింద పడిన బేబీ పౌడర్‌ వల్ల ఎన్నో అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం...
  1. బూట్లు చాలా పాతగా ఉంటే... వేసుకోవాటానికి కూడా చిరాకుగా అనిపిస్తుంది. షును ప్రతిరోజూ కడగలేరు కదా... అందుకే షు లోపలి భాగంలో బేబీ పౌడర్‌ను చల్లుకోవటం మంచిది. దీని వల్ల చెడు వాసన మటుమాయం అవుతుంది.
  2. బీచ్‌కు వెళ్లేటప్పుడు కచ్చితంగా ఒక చిన్న డబ్బాలో బేబీ పౌడర్‌ను వేసుకొని తీసుకెళ్లండి. ఎందుకంటే బీచ్‌ నీటిలో ఆడుకొని బయటకు రాగానే చర్మం చాలా జిడ్డుగా, గరుగ్గా తయారవుతుంది. ఆ జిడ్డు తొలగిపోవాలంటే బేబీ పౌడర్‌ ముందుగా శరీరానికి పట్టించి తర్వాన స్నానం చేస్తే ఉక్కపోత, జిడ్డుతత్వం రెండు తొలగిపోతాయి.
  3. తల స్నానం చేసిన జుట్టు నిర్జీవంగా, జిడ్డుగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో జుట్టు చివర్లకు బేబీ పౌడర్‌ను చేతిలో వేసుకొని నెమ్మదిగా మర్దన చేస్తే సరిపోతుంది. పౌడర్‌ జిడ్డుతత్వాన్ని తొందరగా పీల్చుకుంటుంది.
  4. పెదాలకు లిప్‌స్టిక్‌ తొందరగా పోతుందా... అయితే ఇలా చేయండి. ముందుగా ఒక సారి లిప్‌స్టిక్‌ పెట్టుకొని దానిపై కొంచెం బేబీ పౌడర్‌ చల్లుకొని తర్వాత డబుల్‌ కోట్‌ వేసుకుంటే లిప్‌స్టిక్‌ ఒక గంటపాటు చెదిరిపోకుండా అలాగే ఉంటుంది.

Monday, April 24

కాళ్లు పొడిబారకుండా...

ఎండాకాలమైనా సరే... పొడిచర్మ తత్వం కొందరికి ఇబ్బందిని కలిగిస్తుంది. దీన్ని నివారించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. కాళ్ల పొడి బారిన చర్మంతో ఉన్నప్పుడు చిరాకు, దురద ఉంటాయి.
కాళ్ల పగుళ్లు, కాళ్లమీద పొడిచర్మం నివారించాలంటే ఈ చిట్కాలు పాటించండి..
  1. డ్రై స్కిన్‌ నివారించడంలో ఆలివ్‌ ఆయిల్‌ సహాయపడుతుంది. ఆలివ్‌ ఆయిల్లో యాంటీఆక్సిడెంట్స్‌, విటమిన్స్‌ అధికంగా ఉండటం వల్ల కాళ్ళును పూర్తిగా తేమగా ఉంచుతుంది, పాదాలకు తేమను అందిస్తుంది. స్నానం చేయడానికి అరగంట ముందు కాళ్లకు ఆలివ్‌ ఆయిల్‌ను అప్లై చేసి, మసాజ్‌ చేయాలి. స్నానం చేసిన తర్వాత కూడా కాళ్లకు మాయిశ్చరైజర్‌ అప్లై చేయడానికి ముందు ఆలివ్‌ ఆయిల్‌ ను అప్లై చేయాలి.
  2. పెరుగు, తేనె మాస్క్‌ మరో రెమెడీ. ఇది చర్మం పొడిబారడాన్ని నివారిస్తుంది. వీటిలో ఉండే లాక్టిక్‌ యాసిడ్‌ డ్రై స్కిన్‌ కు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అరకప్పు పెరుగులో కొద్దిగా తేనె మిక్స్‌ చేయాలి. తర్వాత కాళ్లకు, పాదాలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
  3. రెండు స్పూన్ల మిల్క్‌ క్రీమ్‌ తీసుకుని, అందులో ఒక స్పూన్‌ శెనగపిండి మిక్స్‌ చేయాలి. ఈ మాస్క్‌ ను పాదాలకు అప్లై చేయాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. మిల్క్‌ క్రీమ్‌లో ల్యాక్టిక్‌ యాసిడ్‌ అధికంగా ఉండటం వల్ల కాళ్లకు తేమను అందించి మాయిశ్చరైజింగ్‌ ఉంచడంలో సహాయపడుతుంది.
  4. కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీయాసిడ్స్‌ చర్మాన్ని మాయిశ్చరైజ్‌ చేస్తాయి. చర్మం తేమగా ఉంటుంది.
  5. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని కాళ్లకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మరో పద్ధతిలో కొబ్బరి నూనె, ఆలివ్‌ ఆయిల్‌ మిక్స్‌ చేసి, గోరువెచ్చగా చేసి, కాళ్లకు అప్లై చేసి మసాజ్‌ చేయాలి.
  6. 1/4కప్పు బ్రౌన్‌ షుగర్‌ తీసుకుని, అందులో కొబ్బరి నూనె మిక్స్‌ చేయాలి. తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం మిక్స్‌ చేసి, కాళ్ళు, పాదాలకు అప్లై చేయాలి. స్క్రబ్‌ చేసిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది డ్రై స్కిన్‌ని నివారిస్తుంది. కొబ్బరి నూనె కాళ్లు, పాదాలను మాయిశ్చరైజ్‌ చేస్తుంది. ఎప్పుడూ తేమగా ఉంచుతుంది.

అపెండిక్స్‌ ఎలా వస్తుంది?

అపెండిక్స్‌ అంటే.. 24 గంటల నొప్పి అని చాలా మందికి తెలుసు. వాస్తవానికి ఇది రుగ్మత పేరు కాదు. ఉదరానికి కుడి వైపు కొద్దిగా కిందకు ఉండి పెద్ద పేగుకు అతుక్కుని ఉన్న చిన్న ట్యూబ్‌ లాంటి భాగాన్ని అపెండిక్స్‌ (ఉండకం) అంటారు. ఈ భాగం ఇన్‌ఫ్లమేషన్‌కి గురైతే దాన్ని 'అపెండిసైటిస్‌' అంటారు. చాలా మంది దీన్నే అపెండిస్‌గా వ్యవహరిస్తుంటారు. అపెండిసైటిస్‌ తీవ్రరూపం దాల్చినప్పుడు శస్త్రచికిత్స తప్పించి మరో ప్రత్యామ్నాయం లేదు. అందుకే వైద్య పరిభాషలో దీనిని అత్యవసర స్థితిగా పరిగణిస్తారు. దీనికి ఆపరేషన్‌ ఒక్కటే సరైన చికిత్స. సకాలంలో ఆపరేషన్‌ చేయకపోతే అపెండిక్స్‌ పగిలి ఇన్‌ఫెక్షన్‌కు గురై ఒక్కోసారి మరణం కూడా సంభవించొచ్చు. అపెండిసైటిస్‌కి ఏ వ్యక్తి అయినా గురికావచ్చు. కానీ సాధారణంగా ఇది 10-30 సంవత్సరాల వయస్సు వారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఎన్ని రకాలు?
అపెండిసైటిస్‌ ప్రధానంగా రెండు రకాలుగా రావచ్చు. 1. అబ్‌స్ట్రక్టివ్‌, 2. ఇన్‌ఫెక్టివ్‌. అబ్‌స్ట్రక్టివ్‌ అంటే పేగుల్లోని మలం గానీ, నులిపురుగుల వంటివిగానీ ఈ ఉండుకం మార్గానికి అడ్డుపడొచ్చు. అప్పుడు ఉండుకంలో తయారయ్యే మ్యూకస్‌ స్రావాలు బయటకు రావటం కష్టమవుతుంది. కాబట్టి లోపలే ఉబ్బి.. వాపునకు కారణమ వుతుంది. అలాగే ఇన్‌ఫెక్టివ్‌ అంటే మనం తీసుకున్న ఆహారం, నీటి ద్వారా బ్యాక్టీరియా వంటివి పేగుల్లోకి చేరి.. అక్కడ్నుంచి ఉండుకంలోకి ప్రవేశించి, ఇన్‌ఫెక్షన్‌కి దారి తీయొచ్చు.
లక్షణాలు
అపెండిసైటిస్‌ సమస్య ప్రధానంగా కడుపు నొప్పితో ఆరంభమవుతుంది. తర్వాత జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవటం.. లాంటివి ప్రధాన లక్షణాలు. అపెండిసైటిస్‌ని నిర్ధారించటంలో ఈ లక్షణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
అపెండిసైటిస్‌ నొప్పి ముందు బొడ్డు దగ్గర, దాని చుట్టూ వస్తుంది. సమయం గడుస్తున్న కొద్దీ ఉండుకం ఉండే చోటు అయిన కుడివైపు పొత్తికడుపు భాగానికి మళ్లుతుంది. అందుకే దీన్ని 'షిఫ్టింగ్‌ పెయిన్‌' అంటారు. బొడ్డు దగ్గర ఆరంభమైన నొప్పి సుమారు 6-8 గంటల తర్వాత ఇలా కడుపు కింది భాగానికి చేరుకుంటుంది. దీన్ని అపెండిసైటిస్‌ ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవాలి. పొట్టలో ప్రధాన నాడులన్నీ బొడ్డు దగ్గర కేంద్రీక తమవుతాయి కాబట్టి కడుపులో ఎక్కడ సమస్య తలెత్తినా ముందు బొడ్డు దగ్గరే నొప్పి ఆరంభమవుతుంది. ఇక ఇన్‌ఫెక్షన్‌ ముదిరి, వాపు పెరిగిన కొద్దీ ఉండుకం ఉండే చోట నొప్పి ఎక్కువ అవుతుంది.
నొప్పి ఆరంభమైన తర్వాత జ్వరం వస్తుంది. ఇది ఎప్పుడూ 100.4 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కన్నా ఎక్కువగా ఉంటుంది. మధ్యమధ్యలో తగ్గడమనేది ఉండదు.. జ్వరం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.
కొందరిలో ఒకట్రెండు వాంతులు అవుతాయి. కొందరిలో అవీ ఉండకపోవచ్చు కూడా. ఈ వాంతులు పేగుల్లో అవరోధాల కారణంగా వచ్చేవి కావు. నాడుల్లో స్పందనల వల్ల వస్తాయి. అందుకే వీటిని 'రిఫ్లక్స్‌ వామిటింగ్స్‌' అంటారు.
అపెండిసైటిస్‌ అనేది పేగులకు సంబంధించిన సమస్య కాబట్టి ఆకలి తగ్గిపోయి ఆహారం సయించదు. - ఈ లక్షణాలు కనబడినప్పుడు అపెండిసైటస్‌ అని అనుమానించాలి.
మెక్‌బర్నీస్‌ పాయింట్‌ : కడుపు నొప్పి వచ్చి ఉండుకం వాచినప్పుడు అది అపెండిటైటిస్‌ నొప్పా.. కాదా..? అని గుర్తించడానికి ఒక సూత్రం ఉంది. కుడివైపు ఎముక (ఇలియాక్‌ స్పైన్‌) నుంచి బొడ్డు వరకు ఒక గీతను ఊహించుకోండి. దీన్ని 'స్పైనో అంబ్లికల్‌ ల్కెన్‌' అంటారు. ఈ గీతను మూడు భాగాలు చేసి బొడ్డు నుంచి రెండు భాగాలు దాటిన తర్వాత మూడో భాగం మొదట్లో పాయింట్‌ ముఖ్యమైంది. దీనికిందే ఉండుకం ఉంటుంది. అపెండిక్స్‌ వాపు వచ్చినప్పుడు ఈ పాయింట్‌ వద్ద వేలితో నొక్కితే రోగి నొప్పితో విలవిల్లాడిపోతారు. దీన్నే 'మెక్‌ బర్నీస్‌ పాయింట్‌' అంటారు. పొత్తికడుపు అంతా ఎక్కడ నొక్కినా పెద్దగా స్పందించరుగానీ.. ఈ 'పాయింట్‌' వద్దకు రాగానే చేత్తో కూడా తాకనివ్వరు. నొప్పి ఉండుకానికి సంబంధించినదేనని చెప్పేందుకు ఇది కీలకమైన సంకేతం.
పెరిటోనైటిస్‌: అపెండిక్స్‌ వాచిన తర్వాత క్రమంగా సమయం గడుస్తున్న కొద్దీ ఇన్‌ఫెక్షన్‌ కడుపులోని ఇతర పొరలకూ వ్యాపించి ఆ ప్రాంతంలో పెరిటోన్కెటిస్‌కి దారి తీస్తుంది. అప్పుడు పొత్తికడుపు కండరం నొక్కితే గట్టిగా తయారవుతుంది. దీన్ని 'మజిల్‌ గార్డింగ్‌' అంటారు.
అపెండిక్స్‌ వాపు వచ్చినపుడు దగ్గితే ఆ ప్రాంతంలో విపరీతమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఎక్కడో కచ్చితంగా చూపించగలుగుతారు కూడా. ఎడమ కాలు కదపమంటే తేలికగా కదుపుతుంటారు. కానీ కుడికాలు కదపమంటే భయంభయంగా, నొప్పితో కదపలేకపోతుంటారు. ఎందుకంటే కుడికాలు కదిపినప్పుడు 'ఇలియోసోయాస్‌' అనే కండరం కదులుతుంది. ఇది లోపల ఉండుకాన్ని తాకుతుంది. దీంతో కుడికాలు కదుపుతుంటే లోపల నొప్పి తీవ్రమవుతుంది. అయితే.. బొద్దుగా ఉండే పిల్లల్లో ఆ ప్రాంతంలో నొక్కినా వారు వెంటనే స్పందించకపోవచ్చు. అందుకే వీరిలో అపెండిసైటస్‌ ముదిరిపోయి.. అది లోపల చీముతో పగిలిపోవటమన్నది ఎక్కువగా జరుగుతుంటుంది. అందువల్ల బొద్దు పిల్లల్లో అపెండిక్స్‌ ప్రాంతంలో నొప్పి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
నిర్ధారణ
వైద్యులు స్వయంగా వివిధ రకాలుగా పరిశీలించిన తర్వాత అపెండిక్స్‌ వాపు అని బలంగా అనుమానిస్తే.. కచ్చితమైన నిర్ధారణ కోసం ఇతర పరీక్షలు చేయిస్తారు. వీటిల్లో ఆల్ట్రాసౌండ్‌ ముఖ్యమైంది. దీని ద్వారా అపెండిక్స్‌ వాపును కచ్చితంగా గుర్తించొచ్చు. నిజానికి వాపులాంటి సమస్యలేమీ లేకుండా అపెండిక్స్‌ ఆరోగ్యంగా ఉంటే ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలో కనిపించటం కష్టం. అపెండిక్స్‌ వాచినప్పుడు అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అపెండిక్స్‌ గోడ మందంగా కూడా మారినట్టు తెలుస్తుంది. దీని మందం 6 ఎంఎం కన్నా ఎక్కువుంటే అపెండిక్స్‌ వాచిందని అనుమానం.9 ఎంఎం కన్నా ఎక్కువుంటే కచ్చితంగా వాపేనని నిర్ధారణ చేస్తారు. అపెండిక్స్‌ చుట్టూ చీము లేదా ద్రవం ఏవన్నా చేరి ఉన్నాయా అన్నది 'పెరీ ఎపెండిక్యులర్‌ కలెక్షన్‌' తేలుస్తుంది. వీటితో చాలా వరకు అపెండిసైటిస్‌ అని కచ్చితంగా తెలిసిపోతుంది.
రక్తపరీక్షలు
అపెండిక్స్‌ వాచినప్పుడు రక్తంలో తెల్లకణాలు అధిక సంఖ్యలో ఉంటాయి. నొప్పితో పాటు క్యూబిక్‌ మిల్లీలీటర్‌ రక్తంలో 10 వేల కన్నా ఎక్కువ తెల్లకణాలు ఉంటే అపెండిసైటస్‌ అని భావించొచ్చు. ఈ తెల్లకణాల్లోనూ న్యూట్రోఫిల్స్‌ సంఖ్య 70 శాతం కన్నా ఎక్కువుంటాయి. ఇక సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ 6 కన్నా ఎక్కువుంటే ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టు అర్థం.
చికిత్స
వైద్యుల పరీక్ష, ఆల్ట్రాసౌండ్‌లలో అపెండిక్స్‌ వాచినట్టు స్పష్టంగా నిర్ధారణ అయితే నేరుగా ఆపరేషన్‌ చేయించుకోవడం మంచిది. ఒకవేళ ఆల్ట్రాసౌండ్‌ ఫలితం స్పష్టంగా లేకపోతే.. రక్తపరీక్ష ఫలితాలను చూస్తారు. అప్పటికీ ఉండుకం నొప్పేనా? కాదా? అన్నది స్పష్టంగా తేలక అనుమానంగా ఉంటే బాధితులను ఆస్పత్రిలో చేర్చి జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. నొప్పి తీవ్రంగా లేకపోయినా ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలో స్పష్టంగా కనిపించకపోయినా రక్తంలో తెల్లకణాలు అంత ఎక్కువగా లేకున్నా.. యాంటీబయాటిక్‌ మందులతో చికిత్స చేయొచ్చు. ఈ సమయంలో ఎటువంటి ఆహారం ఇవ్వకుండా సెలైన్‌ ఇస్తారు. దీంతో పేగులకు పూర్తి విశ్రాంతి లభిస్తుంది. ఇలా 24-48 గంటల్లో అపెండిక్స్‌ వాపు లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అప్పుడు తిరిగి పరీక్షించి మందులతో చికిత్స చేయాలా? ఆపరేషన్‌ చేయాలా? అనేది నిర్ణయిస్తారు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌ తగ్గకుండా నొప్పి పెరుగుతూ అపెండిక్స్‌ వాపు లక్షణాలు స్పష్టమవుతుంటే ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది.
అపెండిక్స్‌ వాచినట్టు ఒకసారి గుర్తిస్తే ఆపరేషన్‌ చేసి తొలగించటం తప్ప మరో మార్గం లేదు! వాపును మందులతో తాత్కాలికంగా తగ్గించినా కొద్దిరోజుల తర్వాత అది తిరిగి వాచే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్జరీ చేయటం ఉత్తమం. అపెండిసైటస్‌ అని నిర్ధారణ అయ్యి నొప్పి తీవ్రంగా ఉంటే.. సాధ్యమైనంత త్వరగా 24 గంటల్లోపే సర్జరీకి వెళ్లటం ఉత్తమం. ఇలాంటి పరిస్థితుల్లో సమయం వ థా చేసినకొద్దీ అది పగిలి.. అందులోని చీము, మలం పొట్ట అంతా విస ్తరించొచ్చు. దీంతో ప్రాణానికీ ప్రమాదం ముంచుకొస్తుంది. ఒకవేళ ఆపరేషన్‌ చేసి అదంతా శుభ్రంగా కడిగినా పేగులు అతుక్కుపోయే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి అది స్పష్టంగా అపెండిసైటిస్‌ అని తేలితే ఆపరేషన్‌ చేయించుకోవడం, అనుమానంగా ఉంటే ఉండుకాన్ని కాపాడటానికి మందులతో ప్రయత్నించటం మంచిది.
నొప్పులన్నీ ఒకటేనా..?
పొట్టలో కుడివైపు వచ్చే నొప్పులన్నీ ఉండుకం నొప్పులే కాకపోవచ్చు. ఎందుకంటే ఇతరత్రా ఎన్నో సమస్యల్లో కూడా నొప్పి ఇలాగే ఉండొచ్చు. ముఖ్యంగా మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు వచ్చినప్పుడు, నీళ్ల విరేచనాలు ఉన్నప్పుడు, మూత్రపిండాల్లో ఇన్‌ఫెక్షన్‌ వచ్చినప్పుడు, పొట్టలోని లింఫ్‌ గ్రంథులు వాచినప్పుడు, ఆడపిల్లల్లో పొత్తికడుపు వాపు (పీఐడీ) సమస్య ఉన్నప్పుడు, కాలేయంలో చీము వంటి సమస్యలు తలెత్తినప్పుడు, చివరికి కుడివైపు ఊపిరితిత్తి కింది భాగంలో న్యూమోనియా వచ్చినప్పుడు కూడా నొప్పి ఇలాగే ఉండొచ్చు.
ఆపరేషన్‌ రెండు రకాలు
అపెండిక్స్‌ని తొలగించటానికి రెండు రకాల ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పొట్టమీద కోతపెట్టి చేసేది... రెండోది పొట్ట మీద రంధ్రాలు వేసి వాటిద్వారా కెమెరా గొట్టంతో ఉండుకాన్ని తొలగించే ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతి. రెండూ సమర్థమైనవే. కాకపోతే ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో చేస్తే త్వరగా కోలుకుంటారు. కండరాలను పెద్దగా కొయ్యాల్సిన పని ఉండదు. కండరాల నొప్పి అంతగా ఉండదు. త్వరగా లేచి తిరుగుతారు. పొట్ట మీద పెద్ద మచ్చలూ ఉండవు.

Thursday, April 20

నిద్ర తక్కువైతే షుగర్‌ పెరుగుతుంది...

తగినంత నిద్ర లేనివారు త్వరగా మధుమేహం బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రి ఎంత ఆలస్యంగా పడుకున్నా ఉదయం ఆరుగంటలకే నిద్ర లేవాల్సిందే. ఇక ఉద్యోగులు అయితే ఐదుగంటలకే నిద్రలేచి, పనుల పరుగుల్లో అలసిపోవాల్సిందే. ఒకవైపు నిద్ర సరిగ్గా ఉండదు. సరిగా నిద్ర పోకుండా నిర్లక్ష్యం చేసేవారికి డయాబెటిస్‌ త్వరగా సోకే ప్రమాదముందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. మూడు రోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్రలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైనది రక్తంలో గ్లూకోజ్‌ నియంత్రణగా గుర్తించారు. నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో షుగర్‌ జబ్బు వస్తుంది. ఇక డయాబెటిస్‌ లక్షణాలు ఇప్పటికే కనిపించినవారు నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. దీనివలన హఠాత్తుగా రక్తంలో చక్కెరలు తారాస్థాయికి చేరి రోగిని కోమాలోకి తీసికెళ్లే ప్రమాదముంది. కాబట్టి డయాబెటిస్‌ రోగులు తగినంత వ్యాయామం చేయడమే కాదు, తగినంత నిద్ర కూడా పోవాలి.

పసుపుతో ప్రయోజనాలు పుష్కలం...

  1. పాలు వేడిచేసి చిటికెడు పసుపు, మిరియాల పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తాగితే దగ్గు తగ్గుతుంది.
  2. పసుపు కొమ్ములను నూరి, నీళ్లలో అరగదీసి గానీ పసుపు పొడిని పేస్ట్‌లా నీళ్లతో చాది గానీ కడితే సెగ్గడ్డలు, కరుపులు మెత్తబడతాయి. పుండ్లు మానుతాయి.
  3. వేపాకు, పసుపు కలిపి నూరి ఆ పేస్ట్‌ని రాసుకుంటే మశూచి పొక్కులు, గజ్జి, తామర మొదలైన చర్మవ్యాధుల్లో దురద, మంట, పోటు తగ్గుతాయి.
  4. పసుపు కలిపిన నీటిలో పరిశుభ్రమైన వస్త్రాన్ని ముంచి బాగా నాననిచ్చి, నీడన ఆరబెట్టి కాస్త తడి పొడిగా ఉంటుండగానే కళ్లు తుడుచుకుంటూ ఉంటే కంటి జబ్బులు తగ్గుతాయి.
  5. వేప నూనెలో పసుపు కలిపి వేడిచేసి, కురుపులకు, గాయాలకు, గజ్జి, చిడుము లాంటి చర్మరోగాలకు పై పూతగా రాసుకుంటే గుణం కనిపిస్తుంది.
  6. మెత్తటి పసుపు, ఉప్పు బాగా కలిపి టూత్‌ పౌడర్‌గా వాడితే దంతాల నొప్పి, నోటి దుర్వాసన, పుప్పిపళ్లు తగ్గుతాయి.
  7. నిమ్మరసం, కీరాలను కొద్దిగా పసుపు కలిపి రాస్తుంటే ఎండ తీవ్రత వల్ల నల్లబారిన చర్మం తిరిగి కాంతివంతంగా తయారవుతుంది.

Wednesday, April 19

అలర్జీలు దరిచేరకుండా...

వేసవి కాలం వచ్చిందంటే పిల్లలకే పండగే. సెలవుల్లో హాయిగా ఆడుకోవచ్చని వారి ఆనందం. అయితే బయట ఎండలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ ఎండ ప్రభావం చిన్నా, పెద్దా తేడా లేకుండా చూపుతుంది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు వేసవి తాపాన్ని భరించలేరు. సుకుమారమైన పిల్లల చర్మానికి ఈ వేసవిలో అలర్జీల ప్రమాదం ఎక్కువ. అందుకే వేసవి కాలంలో పిల్లల చర్మం పట్ల తల్లిదండ్రులు అధిక శ్రద్ధ తీసుకోవాలని చైల్డ్‌ కేర్‌ నిపుణులు సూచిస్తున్నారు. వేసవిలో చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే.. ముఖంలో మట్టి చేరకుండా చూసుకోవాలి. పిల్లలు ఎండలో ఆడనివ్వకుండా సాయంత్రం పూట కాసేపు ఆడుకోనివ్వాలి. ఆడుకుని వచ్చాక స్నానం చేయించాలి. అప్పుడప్పుడు కాసింత చల్లని నీటితో ముఖం కడుగుతూ ఉండాలి. అప్పుడప్పుడు దురద వంటి అలెర్జీలకు వైద్యుల సలహా మేరకు క్రీమ్‌లు వాడొచ్చు. పరిశుభ్రమైన దుస్తులను తొడగడం, శుభ్రతతో కూడిన ఆహారాన్ని పెట్టడం వంటివి చేస్తే అలర్జీలు ఏమాత్రం పిల్లల దరిచేరవు. వేసవిలోనే కాదు ఏ సీజన్లోనైనా పిల్లలకంటూ ప్రత్యేకంగా టవల్స్‌ వాడటం చేయాలి.
ఇకపోతే.. విటమిన్‌ లోపాల కారణంగానూ అలెర్జీలు ఏర్పడతాయి. అందుచేత విటమిన్‌-ఎతో కూడిన స్వీట్‌ పొటాటో, క్యారెట్లు, నట్స్‌, దోసకాయ, క్యాప్సికమ్‌, మామిడి వంటివి పిల్లల డైట్‌లో చేర్చుకోవాలి. ద్రవ పదార్థాలను పిల్లలకు ఎక్కువగా ఇస్తూ రావాలి.

మేలు చేసే ఉసిరి...

ఉసిరికాయను వేసవి సీజన్లో దీనిని వాడడం వల్ల చాలా లాభాలున్నాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు...
  • ఉసిరికాయల రసాన్ని నీళ్లతో కలిపి మూడు రోజులపాటు తీసుకుంటే కడుపునొప్పి తగ్గుతుంది.
  • ఉసిరి పొడిని తేనెతో కలిపి తీసుకుంటే అసిడిటీ వల్ల వచ్చే కడుపునొప్పి వెంటనే తగ్గుతుంది. ఉసిరికాయల రసానికి ద్రాక్ష పండ్ల గుజ్జు, పంచదార కలిపి తీసుకున్నా మంచి ఫలితం కనిపిస్తుంది.
  • ఉసిరిపొడికి వేపాకు పొడిని కలిపి ప్రతిరోజూ ఉదయం పూట తీసుకుంటే దీర్ఘకాలం నుంచి బాధించే చర్మవ్యాధులు తగ్గుతాయి.
  • ఉసిరి కాయల రసానికి నెయ్యి కలిపి తీసుకుంటే చర్మం మీద తయారైన చీము పొక్కులు తగ్గుతాయి.
  • లేత ఉసిరి కాయలను ఎంచుకొని తెచ్చి, మేకపాలతో కలిపి మెత్తని పేస్టు మాదిరిగా నూరి, ఫేస్‌ ప్యాక్‌గా వేస్తే మచ్చలు తగ్గుతాయి.
  • ఉసిరి రసాన్ని 160 మిల్లీలీటర్ల మోతాదులో తేనెతో కలిపి తీసుకుంటే మూత్ర సంబంధ సమస్యలు తగ్గుతాయి.
  • ఉసిరి రసంలో బెల్లం కలిపి తీసుకుంటే మూత్ర విసర్జన సమయంలో నొప్పి తగ్గటంతోపాటు రక్తస్రావం, మంటలు, కడుపునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

బొప్పాయి...

పెరట్లో సర్వసాధారణంగా పెరిగే మొక్క ఇది. బొప్పాయిలో అధిక పీచు ఉంటుంది. కొవ్వు శాతాన్ని ఇది తగ్గిస్తుంది. కొవ్వును దగ్ధం చేసే ఎంజైములు ఉండటం వల్ల గుండెపోటు రాకుండా అడ్డుకుంటుంది...

  • బొప్పాయిలోని యాంటీ యాసిడ్లు చిన్న వయసులో వృద్ధాప్య ఛాయలు రాకుండా కాపాడుతాయి.
  • బొప్పాయి విత్తనాలను తీసుకోవడం వల్ల జీర్ణ కోశంలోని పురుగులు నశిస్తాయి.
  • మలబద్దకం తగ్గించి జీర్ణక్రియను సక్రమంగా చేసే శక్తి బొప్పాయిలో ఉంది.
  • బొప్పాయి రసం పెద్ద పేగులోని.. ముఖ్యంగా కోలన్‌ ద్వారా ఏర్పడిన చీము, జిగరును తొలగించి శుద్ధి చేస్తుంది. కాలేయ వ్యాధులను అదుపులో ఉంచుతుంది.
  • బొప్పాయిలో క్యాలరీలు తక్కువగా, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. శరీర బరువును తగ్గిస్తుంది ఇది.
  • బొప్పాయిలో విటమిన్లు ఏ, సీలు అధికంగా ఉంటాయి. వ్యాధి నిరోధకశక్తిని కాపాడేందుకు ఇవి దోహదపడతాయి.

Sunday, April 16

నిమ్మరసం ఆరోగ్య ఫలం...

నిమ్మరసం తాగడం ఈ వేసవి సీజన్‌లోనే కాదు. ఇతర సమయాల్లో కూడా ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు...
  • నిమ్మకాయని నిత్యం ఏదో ఒక రూపంలో తీసుకుంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసం తాగడం, మజ్జిగలో నిమ్మకాయ రసం, కలుపుకోవడం, చికెన్‌ మటన్‌ వంటి స్పైసీ ఫుడ్స్‌లో టేస్ట్‌ కోసం నిమ్మకాయ వాడడం మంచిదే.
  • నిమ్మరసంలో ఐదు శాతం సిట్రిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది నిమ్మకాయకు ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది. ఇందులో విటమిన్‌ సి, విటమిన్‌ బి, కాల్షియం, ఫాస్పరస్‌, మెగ్నీషియం, ప్రోటీన్స్‌, కార్బోహైడ్రేట్స్‌ పుష్కలంగా ఉంటాయి.
  • అజీర్ణంతో బాధపడేవారు కాస్త నిమ్మరసం, గోరు వెచ్చని నీటిలో కలుపుకుని తాగితే, అజీర్తి నుంచి ఉపశమనం పొందవచ్చు.
  • గుండెల్లో మంట, డయేరియా, బద్ధకంగా ఉండడం వంటివాటికి కూడా నిమ్మరసం బాగా పనిచేస్తుంది.
  • నిమ్మకాయ సహజ సిద్ధమైన యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. నిమ్మరసాన్ని శరీరానికి పట్టించి, కాసేపటి తర్వాత నీటితో శుభ్రం చేసుకుంటే, శరీరంలో నిగారింపు వస్తుంది.
  • వయసు పెరుగుతుండడం వల్లే వచ్చే చర్మం ముడుతలను నిమ్మరసం కొంతవరకు నిరోధిస్తుంది. బ్లాక్‌ హెడ్స్‌ వంటివాటిని నివారిస్తుంది.
  • పన్ను నొప్పితో బాధ పడేవారు కాస్త నిమ్మరసాన్ని నొప్పిపుట్టినచోట పెడితే ఉపశమనం లభిస్తుంది.
  • పళ్ల నుంచి రక్తం కారుతున్నా, నోటినుంచి దుర్వాసన వస్తున్నా నిమ్మరసం వాటిని దూరం చేస్తుంది.
  • నిమ్మరసం, నీరు కలిపి పుక్కిలిస్తుంటే గొంతు నొప్పి, గొంతులో గరగర వంటివి ఇబ్బందిపెట్టవు.
  • నిమ్మరసంతో చేసే నింబూ పానీలో ఎక్కువగా ఉండే పొటాషియం రక్తపోటుని అదుపులో ఉంచుతుంది. నీరసం, మగతగా ఉండడం, ఒత్తిడిని దూరం చేస్తుంది నింబూ పానీ. శ్వాస కోశ ఇబ్బందులతో బాధపడేవారికి నిమ్మ మంచి ఔషధం.

Saturday, April 15

పెరుగుతో ప్రయోజనాలెన్నో...

భారతీయుల నిత్యజీవితంలో పెరుగు ప్రాధాన్యత ఎనలేనిది. గడ్డపెరుగులో గాఢమైన అణువుల బంధనాలున్నట్లే పెరుగుతో మనకి అనుబంధం ఎక్కువే.! ఇంతకీ పెరుగులో ఉండే మెరుగు విషయాలేంటో తెల్సుకుందాం...
  • ప్రతి రోజూ పెరుగును తీసుకుంటే శరీరానికి చల్లదనం వస్తుంది. దీంతో పాటు అందులో శరీరానికి ఉపయోగపడే న్యూట్రిన్లు పుష్కలంగా ఉంటాయి.
  • పెరుగు తినటం వల్ల కడుపులోని సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా తిన్న ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. అందువల్ల ప్రశాంతంగా నిద్రపడుతుంది.
  • పెరుగులో క్యాల్షియంతో పాటు ప్రొటీన్లూ ఎక్కువగా ఉంటాయి.
  • హైడ్రేట్స్‌ ఉండటం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.
  • రోజూ అరకప్పు పెరుగు తాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
  • మానసిక ఒత్తిడిని అదుపు చేస్తుంది.
  • చర్మం మెరుపు రావాలన్నా, జుట్టు బలంగా ఉండాలన్నా పెరుగుని డైరక్ట్‌గా అప్లై చేసి ఫలితాలు పొందవచ్చు. అన్ని కాలాల్లో పెరుగుని తీసుకోవచ్చు. అందుకే పెరుగు తీసుకోవటం, పెరుగుతో చేసిన ఆహారాన్ని తినటం మర్చిపోకూడదు.
  •  దైనందిన జీవితంలో పెరుగు తీసుకోవటం వల్ల ఆరోగ్య సంబంధిత సమస్యలకి చెక్‌ పెట్టినట్టే!

Friday, April 14

రాగులు తింటే అంతా ఆరోగ్యమే!

రాగుల్లో ఉండే పోషకాలు శరీర ఆరోగ్యానికి తగిన రక్షణ కల్పిస్తాయి. వీటిని రెగ్యులర్‌గా ఆహారంలో భాగంగా తీసుకునేవారు రకరకాల అనారోగ్య సమస్యలను అధిగమించే అవకాశాలెక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతునాన్నారు...
  • రాగులను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా వృద్ధాప్య ఛాయలను దూరం చేసుకోవచ్చు. మిల్లెట్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు రాగుల్లో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి వయసు మీద పడినట్లు కనిపించనివ్వవని నిపుణులు చెబుతున్నారు.
  • రాగుల్లో ఉండే అమినోయాసిడ్స్‌ ఆకలిని తగ్గిస్తాయి. ఇంకా బరువును నియంత్రిస్తాయి. రాగిపిండితో తయారుచేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదనపు క్యాలరీలను గ్రహించకుండా నిరోధిస్తుంది.
  • రాగుల్లో ఉన్న ఫైబర్‌ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రించుకోవచ్చు. ఇంకా రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు తోడ్పడతాయి.
  • రాగులు బలవర్ధకమైన ధాన్యం. దానిలోని క్యాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఆరోగ్య పుష్టిని కలిగిస్తుంది.
  • రాగిపిండితో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. జుట్టు ఒత్తుగానూ, పొడుగ్గానూ పెరుగుతుంది.
  • రాగులలో అయోడిన్‌ బాగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి, పొడిచేసిన పిండిని కలిపి తాగించినట్లయితే వారి ఎదుగుదల బాగుంటుంది.
  • నడి వయసు మహిళ్లో ఎముకల పటుత్వం తగ్గుతూ ఉంటుంది. అందుకని మహిళలు ఎముకల పటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగిమాల్ట్‌ను తాగాలి.
  • రాగులతో చేసిన ఆహారం ఆందోళన, వ్యాకులత, నిద్రలేమిరర పరిస్థితులను దూరం చేస్తుంది. మైగ్రేన్‌ సమస్యను నివారిస్తుంది.
  • రాగులతో చేసిన ఆహారపదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయం శక్తినిస్తాయి.
  • రాగుల పిండితో తయారు చేసిన పదార్థాలను తరచుగా తిన్నట్లైతే నూతన శక్తి వస్తుంది. కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది. రాగుల పానీయం దప్పికను అరికడుతుంది.
  • సాధారణంగా రాగులతో తయారుచేసిన ఆహారాలను తీసుకోవడం ద్వారా శరీరాన్ని సహజమైన తీరులో ఉంచడానికి సహాయపడుతుంది.

Thursday, April 13

ఎండనుంచి ఉపశమనం...

విపరీతమైన ఎండ వేడి వల్ల సమస్యలు తలెత్తుతుంటాయి. వాటిని నిర్లక్ష్యం చేయకుండా వేడిని దూరం చేసుకోవాలి. ఇంట్లో దొరికే కొన్ని పదార్థాలు వేడిని దూరం చేసి సాంత్వన అందిస్తాయి...
  1. గులాబీ రేకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే వాటిని నూనెల్లో, సబ్బుల తయారీలోనూ వాడుతుంటారు. ఎండలో కమిలిన చర్మం తిరిగి జీవంతో వెలిగిపోవాలంటే.. నీడలో గులాబీరేకలని ఎండబెట్టి, వాటితో టీ తయారు చేసుకుని తాగుతూ ఉంటే ఉపశమనంగా ఉంటుంది. వేడి నుంచి సాంత్వన అందుతుంది. డయేరియా వంటి సమస్యలున్నా తగ్గిపోతాయి.
  2. పుదీనా ఆకుల్ని ఈ కాలంలో ఏ రూపంలో తీసుకున్నా ఫర్వాలేదు. పుదీనానీ చట్నీగా చేసుకోవచ్చు, సలాడ్లలో వేసుకోవచ్చు. డికాషలో ఆకులు వేసి టీలానూ కాచుకుని తాగొచ్చు. ఎలా తీసుకున్నా దాని ఫలితాలు అమోఘం. వేసవిలో తలెత్తే తలనొప్పీ, వికారాలతోపాటూ ఒత్తిడీ, నీరసం వంటివి రాకుండా పుదీనా చూస్తుంది.
  3. ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఒంట్లో వేడి పెరగకుండా ఉంటుంది. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా చూస్తుంది. దీన్నుంచి విటమిన్‌ సి అందుతుంది. రోగనిరోధక శక్తీపెరుగుతుంది.
  4. ఈ కాలంలో చెమట రూపంలో లవణాలని కోల్పోతుంటాం మనం. దాంతో వికారం, తలనొప్పి వంటి అనేక సమస్యలు తలెత్తుతుంటాయి. గుప్పెడు తులసి ఆకుల రసాన్ని మనం ఏ రూపంలో తీసుకున్నా ఎ విటమిన్‌ పుష్కలంగా అందడంతో పాటూ, పొటాషియం, మాంగనీస్‌, మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాల భర్తీ తేలిగ్గా జరుగుతుంది. ముఖ్యంగా రక్తహీనత రాకుండా చేసే ఇనుము దీని నుంచి పుష్కలంగా అందుతుంది. ు

Wednesday, April 12

వేసవిలో చర్మ సంరక్షణ..

      కొందరిలో చర్మం త్వరగా నల్లబడుతూ ఉంటుంది. ఈ ఎండాకాలంలో కాసేపు బయటకు వెళ్లినా, తీసుకునే ఆహారంలో మార్పు వచ్చినా, నీటి ప్రభావం వల్లనో చర్మం రంగుమారి నల్లగా మారుతుంది. అంతేకాక కొందరిలో చర్మం మంట కూడా పుడుతుంది. ఇలాంటి సమస్యను పిగ్మెంటేషన్‌ సమస్య అంటారు. సాధారణంగా చర్మం రంగును నిర్ణయించేే రసాయనం మెలనిన్‌. మెలనిన్‌ ఎక్కువగా ఉత్పత్తి అయితే నలుపు రంగులోకి మారడం సహజం. హార్మోన్ల ఉత్పత్తిలో తేడాలు జరిగినా, ఎప్పుడూ మందులు వాడే వారిలోనూ, వెంట్రుకలకు రంగులు వేసుకునే వారిలోనూ ఇలాంటి పిగ్మెంటేషన్‌ సమస్యలు ఎక్కువగా కనబడతాయి. సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాల ప్రభావం చర్మం రంగుపై తీవ్ర ప్రభావం చూపుతుంటాయి. కాబట్టి ఎండలో వెళ్లేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం, గొడుగు తప్పనిసరిగా వాడాలి. అలా కుదరని పరిస్థితిలో చేతి రుమాలు ముఖానికి ఎండ తగలకుండా కట్టుకోవడమైనా చేయాలి. కొన్ని చిట్కాలు పాటిస్తే మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది...
  1. నల్ల ద్రాక్ష బాగా తినాలి. పుచ్చకాయలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని తినడం వలన చర్మం కాంతివంతంగా ఉంటుంది.
  2. ఎండాకాలం దానిమ్మ పండ్లు కూడా ఆరోగ్యానికి, చర్మ రక్షణకు చాలా ఉపయోగపడతాయి. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. చర్మ రక్షణకేకాక శరీరంలోని మలినాలను తొలగించేందుకు నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది.
  3. తాజా పండ్ల రసాలను తాగుతూ ఉండాలి. మజ్జిగ చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. కాబట్టి ఎంత ఎక్కువగా వీలయితే అంత ఎక్కువ మజ్జిగ తాగడం మంచిది.
  4. ఎండలో బయటకు వెళ్లవలసినపుడు అరగంట ముందే సన్‌ స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. బయట నుండి రాగానే మళ్లీ కడిగేేసుకోవాలి.
  5. క్యాబేజి, క్యారెట్‌లతో పాటు ఓట్స్‌ కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దానిలో కొంత పాల మీగడ వేసి కలపాలి. తర్వాత కొంచెం తేనె, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి, ముఖానికి రాసుకోవాలి. అర గంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.
  6. నల్ల ద్రాక్ష గుజ్జుకు కొంచెం తేనె కలిపి స్నానానికి ముందు ముఖానికి రాసుకోవాలి. పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడుక్కోవాలి. ఇలా చేస్తూ ఉంటే ముఖంపై ఉన్న మచ్చలు మాయమవుతాయి.
  7. ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత కీరదోసను ముక్కలుగా చేసి కళ్లపైన, ముఖంపైన కాసేపు ఉంచుకుంటే చక్కని ఫలితం కనిపిస్తుంది.
  8. పిగ్మెంటేషన్‌ సమస్య రాకుండా ముందు జాగ్రత్తపడితే చాలా మంచిది. అన్నిటికీ సరైన ఔషధం మంచినీళ్లు బాగా తాగడం. ఎండలో వెళ్లినపుడు నీడలో నడవడం, రుమాలు చుట్టుకోవడం, కాసేపు చెట్ల కింద విశ్రాంతి తీసుకోవడం లాంటి జాగ్రత్తలు అవసరం.

Tuesday, April 11

అరటిపండ్లతో గుండె పదిలం...

అరటిపండ్లతో హార్ట్‌ఎటాక్‌ని అరికట్టొచ్చట! బ్రిటీష్‌-ఇటాలియన్‌ పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. రోజుకు కనీసం మూడు అరటి పండ్లు తీసుకోవడం ద్వారా గుండెపోటుకు చెక్‌ పెట్టొచ్చని తేల్చారు. రోజూ ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌లో ఒక అరటి పండు, భోజన సమయంలో మరొకటి, రాత్ర భోజనం తర్వాత ఇంకొకటి తీసుకుంటే మంచిదట. దీంతో శరీరంలోని పొటాషియం శాతం తగ్గుతుందని, మెదడు, రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించొచ్చని అంటున్నారు పరిశోధకులు. స్పానిష్‌, నట్స్‌, పాలు, చేప వంటి పొటాషియంతో కూడిన ఆహారాలను తీసుకోవడం కంటే రోజూ మూడు అరటిపండ్లు తీసుకుంటే గుండెపోటుతోపాటు రక్తపోటు లాంటి రుగ్మతలు చాలామటుకు తగ్గిపోతాయని వారు చెబుతున్నారు.

ఆరోగ్యానికి మేలు చేసే వేరుశనగ...

వేరుశనగ గురించి దాదాపు అందరికీ తెలుసు. అయితే ఇది ఆహారంలో పోషకవిలువలు అందించడమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు... 

  1. ఎక్కువగా సాయంత్రపు సమయంలో స్నాక్స్‌ గా తీసుకునే వేరుశనగను పచ్చివిగా కాకుండా, నీటిలో ఉడకబెట్టుకొని తినటం వలన మరింత మెరుగైన ప్రయోజనాలున్నాయి.
  2. ఉడికించిన వేరుశనగలో విటమిన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి శరీరానికి పుష్టినివ్వడమే కాకుండా పిండాబివృద్ధికీ, ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి.
  3. ఉడికించిన వేరుశనగలో ఉండే ఫైబర్లు (పీచుపదార్ధాలు) మలబద్ధకాన్ని తగ్గించటమే కాకుండా, హృదయ సంబంధిత వ్యాధులు, మధుమేహా వ్యాధి నుంచి ఉపశమనం కలిగిస్తాయి. -ఉడికించిన వేరుశనగలో ఉండే కొవ్వు పదార్థాలను మోనోశాచరైడ్స్‌ అంటారు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. హృదయ సంబంధిత వ్యాధులకు గురవకుండా ఉండాలంటే వీటిని తినాల్సిందే.
  4. వేయించిన వేరుశనగలో కన్నా ఉడికించిన వేరుశనగలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. ఫలితంగా బరువు పెరగకుండా ఉంటారు. వీటిలో అధిక మొత్తంలో పోషకాలుంటాయి.

Monday, April 10

తేనె కలిస్తే.. ఆ రుచే వేరు

సహజ చక్కెరలను కలిగి ఉండే తేనెను నేరుగా తీసుకోవడంతో పాటు వివిధ ఆహారాల్లో రుచికోసం కూడా వాడుకోవచ్చు. అదెలా అంటారా....ఇలా..ఇదిగో...
  • ప్రకృతిలో లభించే సహజమైన తియ్యని పదార్థం తేనె. బంగారు రంగులో ఉంటుంది. జిగురు గుణాన్ని కలిగి ఉండే తేనె ఆహార పదార్థాలను మరింత రుచిగా మారుస్తుంది.
  • తేనెతో చేసిన టోస్ట్‌ రుచికరమైనదే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. రెండు బ్రెడ్‌ ముక్కలను తీసుకొని బ్రెడ్‌ పై ఒక పొరలా తేనెను రాయాలి. తర్వాత దీనిపై పీ నట్‌ బటర ను కూడా రాసి తినాలి. ఈ రకంగా తయారు చేసిన టోస్ట్‌ చాలా బాగుంటుంది.
  • రోజు తినే బ్రేక్‌ఫాస్ట్‌ మరింత రుచిగా చేయాలనుకుంటున్నట్లైతే తాజా పండ్ల ముక్కలకు ఫ్యాట్‌ తొలగించిన పెరుగుతో పాటూ తేనె కూడా కలపాలి. వీటితో తేనెను తృణధాన్యాలను కలిపి కూడా తినవచ్చు. బ్రౌన్‌ రైస్‌ క్రాకర్‌ కు పైన బాదం బటర్‌. తేనె కలిపి కూడా తినొచ్చు.
  • రోజూ తినే సలాడ్‌కు తేనె కలపడం ద్వారా వాటికి అదుÄ్భతమైన రుచి వస్తుంది. తేనెలో ఉండే సహజ చక్కెరలు సలాడ్‌లో ఉండే ముక్కలకు అందుతాయి. దీంతో పాటు తులసి కలపటం ద్వారా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
  • తేనెతో రోస్టెడ్‌ చికెన్‌ తయారుచేసుకోవచ్చు. ఒక చిన్న గిన్నెలో తేనె, ఆవాలు, సోయాసాస్‌ను కలపాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చికెన్‌ కు అంటించాలి. ఇలా పూసిన తరువాత కనీసం 40 నుంచి 45 నిమిషాల పాటూ అలాగే ఉంచి రోస్ట్‌ చేయాలి.

మండే ఎండల్లో...

వేసవి వచ్చిందంటే ఇక పిల్లలకు ఆటలే ఆటలు. తోటి పిల్లలతో ఆటలలో పడి ఆకలి, దాహం అన్నీ మర్చిపోతారు. ఎండ వేడిమిని పెద్దగా పట్టించుకోరు. ఇటువంటప్పుడే వారు డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముంది. అందుకే పిల్లలు వేసవిలో పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తరచూ అనారోగ్యం పాలవుతారు. బయట వాతావరణం చాలా వేడిగా ఉండడంతో పిల్లల శరీర ఉష్ణోగ్రత పెరగడం, ఎక్కువ చెమటతో వంట్లో నీరు వేగంగా ఆవిరైపోవడం.. ఇవి వడదెబ్బకు దారితీస్తాయి. అందుకే ఈ కాలంలో చిన్నపిల్లల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. పెద్దవాళ్లు పిల్లలకు ఎండేముంటుందిలే అని నిర్లక్ష్యం చేయడం అనర్ధానికి దారి తీస్తుంది. మరి వారిని ఎండ బారి నుంచి కాపాడుకోవాలంటే ఏం చేయాలో చూద్దాం...
  1. ఎండ తీవ్రత పెరిగే సమయానికి పిల్లలు ఇంటి వద్దే ఉండేలా చూడాలి. రెండు పూటలా స్నానం చేయించి చెమటను పీల్చే తెల్లని లేదా లేత రంగు నూలు దుస్తులు వేయాలి.
  2. ఇంటి వద్ద ఎండ, వేడి గాలి తగలని చల్లని ప్రదేశంలో వారు ఆడుకునేలా, నిద్రపోయేలా జాగ్రత్త పడాలి.
  3. ఈ కాలంలో పిల్లలు తినడానికి ఇష్టపడరు. చల్లని పానీయాలు తాగేందుకే మొగ్గు చూపుతారు. అందుకే ఎండ తీవ్రం కాక ముందే బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తిచేసేలా చూడాలి. బేకరీ పదార్థాలు కాకుండా ఇంటి వద్ద తయారు చేసిన ఆహారాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా ఇవ్వాలి. దీనిలో నూనెలు లేకుండా ఉంటే మంచిది. దీనితోపాటు రాగి, సజ్జలు వంటి తృణధాన్యాల జావను మజ్జిగలో లేదంటే పాలలో కలిపి ఇస్తే పిల్లలు డీ హైడ్రేషన్‌కు గురికారు. ఎండా కాలంలో పిల్లలు ఆహారం తక్కువ తీసుకోవడం వల్ల ఏర్పడే పోషకాల లోటును ఇవి భర్తీ చేస్తాయి. బ్రేక్‌ఫాస్ట్‌ తరువాత కొద్ది సమయానికి నిమ్మకాయ రసం, ఖర్జూర కాయలు పిల్లలకు ఇస్తే జీర్ణశక్తి పెరుగుతుంది. దీంతో మధ్యాహ్న భోజనం చేయడానికి పిల్లలు అయిష్టత చూపరు.
  4. మధ్యాహ్న భోజనంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందించాలి. ఈ కాలంలో పిల్లలు అన్నం తక్కువ తిని చిరుతిళ్లను ఎక్కువగా ఇష్టపడతారు. శీతల పానీయాలు తాగాలని అల్లరి చేస్తారు. వారు మారాం చేస్తున్నారు కదా అని పంచదార కలిపిన జ్యూస్‌లు, కంపెనీ కూల్‌ డ్రింక్‌లు, ఐస్‌క్రీంలు పిల్లలకు ఇవ్వడం వల్ల డీ హైడ్రేషన్‌ ప్రభావం పెరుగుతుంది.
  5. ఆహారంలోనూ, చిరుతిళ్లలోనూ పాలకూర, ఉల్లి, ముల్లంగి, బీట్‌ రూట్‌, అనాస, మామిడి, కర్బూజా, పుచ్చకాయ, కీర దోసకాయ, మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం ఉండేలా చూడాలి. ఉప్పు, నూనెలు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను పిల్లలకు ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది.
  6. చెమట రూపంలో శరీరం కోల్పోయిన లవణాల్ని అందించడానికి మాత్రం మజ్జిగ, నిమ్మ రసం ద్వారా పిల్లల శరీరానికి ఉప్పు అందేలా చూడాలి.

నేరేడు పండు...

ప్రయోజనాలు మెండు...

నేరేడుపండ్లు ప్రస్తుతం మార్కెట్‌లో విరివిగా దొరుకుతున్నాయి. నిగనిగ లాడుతూ..నోరూరించే వీటిని ప్రతిరోజూ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా...
నేరేడు పండ్లు నుంచి క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్‌, సోడియం, విటమిన్‌ సి, థయామిన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు, ప్రొటీన్లు, కెరొటిన్లు లభిస్తాయి...
  1. మధుమేహం ఉన్నవారికి నేరేడు పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు అదుపులోకి వస్తాయి. ఇందులోని పోషకాలు గ్లౖెెసమిక్‌ ఇండెక్స్‌ శాతాన్ని సమతుల్యం చేస్తాయి. వీటిలోని సుగుణాలు.. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేకూరుస్తాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. రక్తశుద్ధి జరుగుతుంది.
  2. రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు ఈ పండును ఎంత తింటే అంత మంచిది. నెలసరి సమయంలో బాగా నీరసపడిపోయే అమ్మాయిలు వీటిని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. శరీరానికి సరిపడా ఇనుము అందుతుంది.
  3. వందగ్రాముల నేరేడు పండ్లలో యాభై ఐదు శాతం పొటాషియం ఉంటుంది. గుండె, మధుమేహం, రక్తపోటు ఉన్నవారు ఒక పండు తింటే సరిపోతుంది. అరుగుదల సరిగా లేనప్పుడు కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండు రసం కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
  4. చిగుళ్ల నుంచి రక్తం కారడం, దంతాలు పుచ్చిపోవడం.. దుర్వాసన రావడం వంటి సమస్యలకు నేరేడు పండ్లు చక్కటి పరిష్కారం. వీటిని నమిలినప్పుడు పులుపూ, తీపి, వగరు కలబోతగా ఉండే రసం బ్యాక్టీరియాలను దూరం చేస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  5. ఈ కాలంలో రోగనిరోధక శక్తి చాలా అవసరం ఈ పండు తీసుకోవడం వల్ల విటమిన్‌ సి అంది.. రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
  6. నేరేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు. ఇక శస్త్రచికిత్సలు చేయించుకున్నవారు వైద్యుల సలహామేరకే తినాలి. ప

Sunday, April 9

రోజుకు ఒక ఖర్జూరం తినండి., రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు..


  1. ఖర్జూరం ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని మనందరికి తెలుసు.సాధారణ ఆహార ప్రణాళికలో రోజు ఖర్జూరాన్ని భాగం చేసినట్లయితే ఆశ్చర్యకరమైన ఫలితాలను గమనించవచ్చు.మిమ్మల్ని చురకుగా ఉంచడంలోనే కాదు అంతర్గతంగా మన శరీర ప్రక్రియలను మెరుగుపరుస్తుంది.
  2. ¼ కప్ ఖర్జూరాలని తీస్కుంటే అధిక బరువునుండి విముక్తి అవొచ్చు
  3. మాంగనీస్, రాగి, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ B-6 మరియు ఫైబర్ ఇవి అన్నీ మనకు ఖర్జూరంలో లభిస్తాయి. సో, మీరు వాటిని తింటే ఈ పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి.
  4. విటమిన్ B-6 సమ్రుద్దిగా కర్జూరంలో ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది.
  5. అజీర్ణం ,ఇతర జీర్ణాశయ సంభంద సమస్యలను దూరం చేస్తుంది.
  6. డెలివరీకి నాలుగువారాల ముందుగా రోజు కర్జూరాన్ని తీస్కున్నట్టయితే డెలివరీ సమయంలో కొంచెం సులభంగా ఉంటుంది.
  7. కొలన్ క్యాన్సర్ వచ్చే చాన్సెస్ తక్కువ చేయడంలో కూడా ఖర్జూర సహకరిస్తుంది.
  8. ఖర్జూరం తీస్కోవడం వలన హెమరాయిడ్స్ (మొలలు)ముప్పునుండి తప్పించుకోవచ్చు.
  9. కర్జూరం తినడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్త అద్బుతంగా పనిచేస్తుంది.అధిక రక్తపోటుని తగ్గిస్తుంది. హార్ట్ అటాక్ వంటి వాటి నుండి రక్షణ ఉంటుంది. దీనికి కారణం కర్జూరంలో సమ్రుద్దిగా లభించే మెగ్నీషియం,పోటాషియం .
  10. శ్వాస సంభందిత ఆరోగ్యాన్ని మెరుగు పర్చడంలో కర్జూరం తోడ్పడుతుంది.
  11. కర్జూరం తినడం వల్ల వాపు,నొప్పి వంటివాటినుండి ఉపశమనం ఉంటుంది.

Tuesday, April 4

పగటి నిద్ర మంచిదేనా?

వీలున్నప్పుడు మధ్యాహ్నం ఒక గంటపాటు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదేనట. జ్ఞాపకశక్తి మెరుగుపడటానికి, శరీరం చురుగ్గా ఉండటానికి ఇది చాలా అవసరమని అంటున్నారు నిపుణులు. రక్తపోటు నియంత్రణకు మధ్యాహ్న నిద్ర దోహదపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. రాత్రి నిద్రపట్టని వారు, అనారోగ్యంతో బాధపడే వారికి పగటి నిద్ర మంచిది. వేసవిలో పగలు నిద్ర పోవచ్చు. అయితే.. పగటి నిద్రతో ఎన్ని ప్రయోజనాలున్నా కొన్ని సమస్యలు మాత్రం తప్పవని అంటున్నారు నిపుణులు. దైనందిన పనుల్లో ఆటంకం కలిగి శారీరక శ్రమ లోపిస్తుందని, తగిన వ్యాయామం లేకపోవడం వల్ల అధిక బరువు పెరిగే అవకాశం ఉందని అధ్యయానాల్లో తేలింది. పగలు ఎక్కువగా నిద్రపొతే రాత్రులు నిద్రపట్టకపోవచ్చు. తద్వారా ఆరోగ్యానికి హానికలగొచ్చు. కాబట్టి అవసరం ఉన్నంత మేరకే పగలు నిద్రపోవాలి. భారీ కాయస్తులకు పగటి నిద్ర మంచిది కాదు. అంతేకాదు.. పగలు ఎక్కువ సేపు నిద్రపోతే టైప్‌-2 డయాబెటిస్‌కి దారి తీయొచ్చని అంటున్నారు పరిశోధకులు. శరీరంలోని వివిధ రకాల హార్మోన్ల నైసర్గిక సమతౌల్యతపై ఈ పగటి నిద్ర ప్రభావం చూపిస్తుంది. ఇది శరీరంలోని రక్తంలో చక్కెర శాతం పెరుగుదలపైన కూడా ప్రభావం చూపిస్తుంది. అంతేకాక చిన్న చిన్న జబ్బులతో బాధపడే వారు తరచూ పగటి నిద్రకు అలవాటు పడడాన్ని సైతం పరిశోధకులు కనుగొన్నారు. శారీరక శ్రమ కలిగించే పనుల్లో నిమగం కావడం, ధూమపానం, మద్యపానం లాంటి అలవాట్లు మానుకోవడం ఈ పగటి నిద్రపోయే వారికి మంచిదని నిపుణులు అంటున్నారు.