ఎసిడిటీ ఏర్పడటానికి అనేక కారణాలుంటాయి. అధికంగా
మసాలా తిండి, అతి ఆహారం వంటివి కొంత మేర ఎసిడిటీ తెస్తాయి. ఎసిడిటీ
విరుగుడుగా ఎన్నోరకాల మందులు ఉన్నాయి. అయినా సహజ మార్గాలను ఎంచుకోవడమే
మేలు.
- ఎసిడిటీ ఉంటే ఆహారంలో అరటిపండు తినండి. అది మంటను తగ్గించడంలో సహాయపడతుంది.
- మసాలాలు, వేపుడు కూరలు, ఊరగాయలు, చాక్లెట్లు వంటివాటికి దూరంగా ఉండండి.
- పచ్చి క్యాబేజి, పచ్చి ఉల్లి, రాడిష్, మిరియాలు వంటివి తినొద్దు. వాటి వల్ల ఎసిడిటీ మరింత పెరుగుతుంది.
- పండని పండ్లు తీసుకోవడం పూర్తిగా తగ్గించాలి. పూర్తిగా పండిన యాపిల్ అసలే వద్దు.
- ఆహారాన్ని బాగా నమిలి మింగడం అలవాటు చేసుకోవాలి తప్ప బలవంతంగా తినొద్దు.
- హడావుడిగా ఆహారం తినే పద్ధతి మార్చుకోవాలి.
- భోజనానికీ భోజనానికీ మధ్య సమయం మరీ అధికంగా లేకుండా చూసుకోవడం మంచిది.
- నీటిని అధికంగా తీసుకోవడం చాలా మంచిది.
- రాత్రిపూట ఆహారం తీసుకునే సమయానికి, నిద్రపోయే సమయానికి మధ్య కనీసం రెండు గంటల సమయం ఉండేలా చూసుకోవాలి.
- సిగరెట్, మత్తు పానీయాల అలవాటు బాగా తగ్గించాలి. లేదా పూర్తిగా మానేయాలి.
No comments:
Post a Comment