Friday, December 9

షుగర్ ను కంట్రోల్ లో ఉంచే మెంతులు...

* రక్తంలోని చక్కర నిల్వలను నియంత్రించి మధుమేహం రాకుండా చూడగల శక్తీ మెంతులకు ఉంది.
* వీటిలోని సపోనిన్ అనే రసాయనం ఆహారం ద్వారా ఒంట్లో చేరే చెడు కొలెస్ట్రాల్ ను నివారిస్తుంది.
* మెంతి ఆకులోని పీచు ఆకలిని తగ్గించి బరువు పెరగకుండా చేస్తుంది.
* చనుబాలు పడని బాలింతలు మెంతులను ఏదోరూపంలో తీసుకుంటే చక్కగా పాలు పడతాయి.
* మెంతుల్లోని మ్యూసిలేజీ అనే పదార్ధం ఒంట్లో చేరిన ఫ్రీస్ రాడికల్స్ ను అడ్డుకొని కాన్సర్ రాకుండా చూస్తాయి.
మెంతుల్లోని గాలక్టోమన్నన్ అనే నీటిలో కరిగే స్వభావం వున్నా పీచు, జీర్ణక్రియను అవసరమైనంత మేరకు మందగింపజేసి అధిక చక్కెరలను గ్రహించకుండా చేస్తుంది. మెంతుల్లోని 4 హైడ్రాక్సీ ఐసోలూసిన్ అనే అమైనో ఆమ్లము టైప్ 1, టైప్ 2 మధుమేహాలను దరి చేరనీయకుండా చూస్తుంది.
వాడే పద్దతి..
* మెంతులను సన్నని సెగ మీద రెండు, మూడు నిమిషాల పాటు వేయించి,పొడి చేసుకుని దానిని కూరలు, వేపుళ్లలో, సలాడ్లలో చల్లుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది.
* చెంచాడు మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి మరునాటి ఉదయం మంచినీటితో తీసుకోవాలి.

* మెంతి మొలకలను సలాడ్ మీద చల్లుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
* రొట్టెలు, పరోటా, ఇడ్లీ, దోసె తయారీ పిండిలో మెంతి ఆకు తరుగు కలుపుకుంటే కావలసినంత పీచు దొరికినట్లే. (చేదుగా ఉంటాయి గనక కొంచం చాలు)
* మెంతులు, నిమ్మ రసం, తేనె కలిపి చేసే హెర్బల్ టీ విష జ్వరాలకు మందుగా పనిచేస్తుంది.
మెంతి టీ...
చెంచాడు మెంతులను మిక్సీ పట్టి, దానిని వేడినీటిలో మూడు గంటల పాటు నాననివ్వాలి. ఆ నీటిని టీ పొడితో కలిపి మరిగించి దానికి కొన్ని చుక్కల నిమ్మరసం, రవ్వంత తేనె కలుపుకొని వేడి వేడిగా ఆస్వాదించాలి.

No comments:

Post a Comment