Sunday, February 19

వారానికి రెండు సార్లు చేపల పులుసు తింటే.. ఏం జరుగుతుందో తెలుసా..?

లండన్ వైద్యులు చెప్పిన అద్బుత రహస్యం..

వారానికి కనీసం రెండు సార్లు చేపలు తింటే ఏం జరుగుతుందో తెలుసా..? లండన్ వైద్యులు చెప్పిన దానిని మీరు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి అవును..ఇప్పుడు ప్రపంచాన్ని పీడిస్తున్న వాటిలో షుగర్ వ్యాధి ఒకటి.. ఏటా ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఈ వ్యాధి బారిన ప‌డుతున్నారు. ఇందులో రెండు ర‌కాలు ఉన్నాయి. ఒక‌టి టైప్‌-1, మ‌రొక‌టి టైప్-2. క్లోమ గ్రంథి అస్స‌లు ప‌నిచేయ‌క‌పోతే టైప్‌-1, ప‌నిచేస్తున్నా దాన్నుంచి విడుద‌ల‌య్యే ఇన్సులిన్ ను శ‌రీరం స‌రిగ్గా తీసుకోక‌పోతే అప్పుడు టైప్‌-2 మ‌ధుమేహం వ‌స్తాయి. అయితే ఏది వ‌చ్చినా ఆయా వ్య‌క్తుల శ‌రీరాల్లో గ్లూకోజ్ ఎప్పుడూ ర‌క్తంలో ఉండాల్సిన ప‌రిమాణం క‌న్నా ఎక్కువ‌గానే ఉంటుంది. ఈ క్ర‌మంలో ఈ వ్యాధి శ‌రీరంలో అనేక అవ‌యవాలను ప‌నిచేయ‌కుండా చేస్తుంది. అలాగ‌ని మ‌ధుమేహం మందులకు లొంగేది కాదు. నియంత్ర‌ణ‌తోనే దీన్ని లొంగ‌దీయ‌వ‌చ్చు. అయితే ఎన్నో ర‌కాల డ‌యాబెటిక్ మందులు ఆయా వైద్య విధానాల్లో మన‌కు అందుబాటులో ఉన్నా వారానికి రెండు సార్లు చేప‌ల‌ను తింటే డ‌యాబెటిస్ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే.
         ఇది చెప్పింది ఎవరో కాదు సాక్షాత్తు లండన్ వైద్యులు. మధుమేహం కారణంగా అనేక అనారోగ్య సమస్యల వస్తాయని తెలుసు. రోగాలే కాక కంటిచూపు తగ్గుతుందనే విషయం తెలిసిందే. అయితే ఈ సమస్యకు పరిష్కారం వారానికి రెండుసార్లు చేపలను తినడమేనని సూచిస్తున్నారు వైద్యులు. మధుమేహం వల్ల కలిగే దుష్ఫలితాలను నివారించడంలో ఒమేగా ఆమ్లాలు క్రియాశీలంగా వ్యవహరిస్తాయని, అందుకే ఇవి పుష్కలంగా ఉండే చేపలను తినడం ద్వారా కంటిచూపును మెరుగుపర్చుకోవచ్చని చెబుతున్నారు. అయితే వారానికి రెండుసార్లు చేపలు తినడం.. 500 మిల్లీ గ్రాముల ఒమేగా–3తో సమానమంట. ఇటీవల లండన్ కు చెందిన డాక్టర్లు 55 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసున్న 3,614 మంది టైప్–2 డయాబెటిస్ రోగులకు వారానికి 500 మిల్లీగ్రాముల ఒమేగా–3 ఆమ్లాలను ఆహారంలోభాగంగా ఇచ్చారు. దీంతో వారిలో డయాబెటిస్ దుష్ఫలితాలు 48 శాతం తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.

No comments:

Post a Comment