- తాజా ద్రాక్ష పండ్ల జ్యూస్ తాగడం వల్ల మైగ్రెయిన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఈ జ్యూస్ను రోజుకు రెండుసార్లు తాగితే సరిపోతుంది.
- అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపి తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది. ఒత్తిడిని, ఒళ్లు నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడే అల్లం మైగ్రెయిన్ నొప్పిని కూడా తగ్గిస్తుంది.
- దాల్చిన చెక్కను పొడిగా చేసి నీటిలో కలిపి నుదుటిపై రాసుకొని 30 నిమిషాల తర్వాత వేడి నీటితో కడిగితే నొప్పి నుంచి ఉపశమనం పొందుతారు.
- వెలుతురు ఎక్కువగా వచ్చే చోట కూర్చోవడం కూడా కొన్నిసార్లు అసౌకర్యానికి, తలనొప్పి పెరగడానికి కారణం అవుతుంది. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు కాసేపు లైట్లను ఆఫ్ చేసి విశ్రాంతి తీసుకుంటే చాలావరకు ఉపశమనం కలుగుతుంది.
- మైగ్రెయిన్ నొప్పిని తగ్గించే మరో తేలికైన పద్ధతి మసాజ్. తలనొప్పి బాధపెడుతున్నప్పుడు మెడ, తల భాగాన్ని మెల్లగా మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ పెరిగి పెయిన్ తగ్గుతుంది. నిద్రలోకి జారుకుంటే చాలావరకు రిలాక్స్ అవుతారు. నొప్పి కూడా తగ్గుతుంది.
- కెఫిన్ ఉండే ఆహారపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే నొప్పి మరింత ఎక్కువవుతుంది. కాబట్టి కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.
Sunday, April 28
కెఫిన్ పదార్థాలకు దూరంగా...
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment