సాధారణంగా మధుమేహ వ్యాధి బారిన ప్రతి ఒక్కరూ పడుతున్నారు. దీంతో భారత్తో
పాటు.. ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ బాధితుల సంఖ్య పెరిగిపోతున్నారు. అయితే,
ఒక వ్యక్తికి చక్కెర సోకిందో లేదో తెలుసుకునేందుకు నడుం చుట్టుకొలతతో
గ్రహించవచ్చని వైద్య నిపుణులు చెపుతున్నారు.
సాధారణ వ్యక్తుల కంటే కూడా నడుం చుట్టూ ఎక్కువ కొవ్వు కలిగి ఉన్న
వ్యక్తులే ఐదు రెట్లు అధికంగా టైప్ 2 డయాబెటిస్ వ్యాధి బారిన పడతారని
తెలిపింది. పురుషుల్లో నడుం చుట్టుకొలత 40 అంగుళాల కంటే ఎక్కువ ఉన్నవారు
టైప్ 2 మధుమేహం బారిన పడే అవకాశం అధికమని, మహిళల్లో నడుం చుట్టుకొలత 34.6
అంగుళాలు దాటితే ప్రమాద ఘంటికలు మోగినట్టేనంటున్నారు.

No comments:
Post a Comment