Wednesday, June 14

పౌష్టికాహారం తినాల్సిందే ...

ఏ ఆహారం తినాలన్న చాలా భయపడిపోతుంటారు. నోటికి రుచిగా ఉంటే తప్ప ముద్ద దిగదు. అలా నోటికి రుచిగా నచ్చిన ఆహారం తినటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త శ్రద్ధ వహించాల్సిందే అని చెబుతున్నారు నిపుణులు...
  1. ఆకుకూరల్లో ఎక్కువగా విటమిన్‌ 'సి', 'ఎ', 'కె' లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన న్యూట్రీన్లు అధికంగా ఉంటాయి. అలాగే ఐరన్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తాయి.
  2. క్యాలీ ఫ్లవర్‌లో ఎక్కువగా మినరల్స్‌, విటమిన్స్‌, న్యూట్రీన్స్‌, యాంటీ ఆక్సిడెంట్‌లతో పాటు క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తుంది. అలాగే కిడ్ని ల పని తీరును మెరుగుపరచటంతో పాటు అధిక రక్త పోటును అదుపులో ఉంచుతుంది. క్యాలీ ఫ్లవర్‌లో ముఖ్యంగా విటమిన్‌ 'సి', 'కె', ప్రోటీన్లు, మెగ్నిషియం, పొటాషియం, పాస్పరస్‌, మాంగనీస్‌ వంటి పోషకాలు చాలా ఉంటాయి.
  3. అధిక రక్త పోటును అదుపులో ఉంచటంలో బీట్‌రూట్‌ జ్యూస్‌ బాగా పని చేస్తుంది. అలాగే రక్త కణాలను పెంచటంలో బీట్‌రూట్‌ పాత్ర కీలకం. బీట్‌రూట్‌లో ఉండే కణాలు ముఖ్యంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
  4. బాదం, బీన్స్‌, శనగలు, చిక్కుడు వంటి గింజల్లో ప్రోటీన్స్‌, ఫైబర్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించటంలో ప్రాముఖ పాత్ర పోషిస్తాయి. అలాగే వీటిలో కొలెస్ట్రాల్‌ చాలా తక్కువగా ఉంటుంది.

No comments:

Post a Comment