- • నేతిలో వేయించిన వెల్లుల్లిపాయలు ఆహారమునందు ప్రతిదినము నియమపూర్వకంగా తినినచో జీవశక్తి, ఆయుర్దాయము పెరుగును.
- • ప్రతిరోజూ వామురసము పుచ్చుకొనుచుంటే గుండెనొప్పి హరించును.
- • రోజుకు రెండు ఆకుల చొప్పున సరస్వతీ ఆకులు తింటూ ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. దానిమ్మపండ్ల రసం తీసుకుంటే రక్త వృద్ధి, శుద్ధి అగును.
- • పెద్ద ఉసిరికాయలు ఎండబెట్టి వరుగులుగా అయిన తరువాత పట్టుతేనెలో నానబెట్టి 6 మాసములు ఊరిన తర్వాత రోజూ ఒకటి తినుచుండిన రక్తపోటు, హృదయకోశ వ్యాధులు దరిచేరవు. ఎంతటివారికైనా మంచి చురుకుదనము వచ్చు.
- • బొల్లి నివారణకు బాదంచాల గింజల గంధము, ప్రతతాళక చూర్ణము కలిపి మచ్చలపై పూయాలి.
- • మునగ ఆకు రసము, మునగ ఆకుతో వండిన వంటకములు తింటే రోగములు హరించును.
- • ప్రతిదినము తేనె, అల్లపురసం కలిపి తాగిన రక్తశుద్ధి, మెదడుకు సంబంధించిన వ్యాధులకు నివారణ జరుగును.
- • తులసిఆకు పసరు, తేనె కలిపి త్రాగిన సర్వ కఫములు హరించును.
- • దెబ్బలకు, పైనుండి పడుట వలస కలిగిన నొప్పులకు శిలాజిత్తు పాలతో కలిపి తీసుకోవాలి.
- • గుంటకన్నాకు, మిరియాలు నూరి మాత్రలు చేసి సేవించిన వాతావరణ మార్పులవల్ల వచ్చే జ్వరాలు తగ్గును.
- • ఆకుకూరలు, అరటిపళ్ళు, బంగాళాదుంపలు, తులసిఆకులు బీపీ తగ్గించును.
- • రాత్రి పడుకోవడానికి ముందు చిమ్మిలి(నువ్వులతో చేసినది) తింటే మలబద్ధకం హరిస్తుంది.
- • అల్లపురసం తాగితే అజీర్ణం, మలబద్ధకం తగ్గుతాయి. వాటివల్ల వచ్చే తలపోటు తగ్గుతుంది.
- • అన్నం మొదటి ముద్ద వాము వేయించి నేతిలో తింటే ఆకలి పుడుతుంది. అజీర్ణం పోతుంది.
- • గోరుచుట్టుకు పచ్చి పసుపుదుంప మెత్తగా నూరి వేలిపై పూసి మధ్యమధ్యలో తడుపుతూ ఉండే బాధలు తగ్గి నయమగును.
- • అరటిదూట రసం సర్వరోగ నివారిణి.
- • మెంతులు, మెంతికూర ఎక్కువవాడిన చక్కెరవ్యాధి తగ్గును.
- • తెలగపిండి ఆకు రసం రోజూ ఒక తులం సేవిస్తే మూత్రపిండాలలో రాళ్ళు కరిగిపోతాయి.
- • వేడినీటిలో తేనె కలిపి తాగుతూ ఉండే స్థూలకాయం తగ్గుతుంది.
- • కుంకుడుకాయ రసం(నురుగు) వెచ్చచేసి రెండు ముక్కుల్లోనూ వేస్తే పార్శ్వనొప్పి పోతుంది.
- • నువ్వులనూనెను వెచ్చచేసి అందులో కర్పూరం కలిపి అరికాళ్ళకు మర్దనా చేస్తే సుఖ నిద్ర కలుగుతుంది.
- • కోడిరెట్ట కుక్కకాటుపై పూసిన విషము హరించును.
- • తెల్లవిష్ణుకాంత, నల్ల విష్ణుక్రాంత వేర్లను కలిపినూరి లేపనము చేసిన కుష్ఠువ్యాధి హరించును.
- • చెంగల్వకోష్ఠు, మందారపువ్వులు నూనెయందు ఉడికించి రాసిన పేను కొరుకుడు తగ్గుతుంది.
- • నల్లి రక్తం రాసిన పేనుకొరుకుడు తగ్గి జుట్టు వస్తుంది.
- • మందారపువ్వులను కపిలగోవు మూత్రంతో నూరి తలకు పట్టించిన వెంట్రుకలు ఊడుగ ఆగి కొత్త వెంట్రుకలు పెరుగును.
- • నేల ఉసిరికాయల పసరు మజ్జిగలో కలిపి తీసుకున్న పచ్చకామెర్లు తగ్గును.
- • ముల్లంగి ఉదయాన్నే పటికిబెల్లంతో కలిపి తింటే పచ్చకామెర్లు తగ్గును. గసగసాల చూర్ణం రెండు చెమ్చాలు మొదటిముద్దలో తింటే రక్త విరోచనాలు తగ్గుతాయి.
- • ముడినువ్వులు, తాటిబెల్లం చిమ్మిలి చేసి తింటే షుగరు తగ్గుతుంది.
- • కాకరాకు పసరు త్రాగితే కడుపులోని పురుగులు పోతాయి.
- • జీలకర్ర నమిలి రసం మింగితే వికారం, వాంతులు తగ్గుతాయి.
- • యాలకులు తింటే మూత్ర విసర్జన సమంగా జరుగుతుంది.
- • రొంపభారమునకు పసుపు ఆవిరిపట్టిన తగ్గును. ఖాళీకడుపుతో ఆవిరిపట్టాలి.
- • దాల్చినచెక్క రోజూ తింటే జ్ఞాపకశక్తి పెరుగును.
- • మామిడి ఆకులు రోజూ నమిలితే నోటి వ్యాధులు తగ్గును.
- • మాచికాయ గంధం రాస్తే నోటిపూత తగ్గును.
- • మజ్జిగ అన్నంలో నీరుల్లి తింటే నరములకు సత్తువ కలుగును.
- • ముల్లంగి దుంపపై ఉప్పు చల్లి తేలుకుట్టిన చోట పెడితే విషము హరించును.
- • క్యారట్ రోజూ తింటే కంటి వ్యాధులు రావు.
- • క్యాబేజీ తింటే కడుపులోని పుండ్లు తగ్గును. కంతి ఉంటే తగ్గును
Wednesday, November 30
ఈ ఆరోగ్య చిట్కాలను పాటిస్తే …..నలభై జబ్బులను దూరం...
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment