Wednesday, November 8

నీళ్లతో వైద్యం...

తాగేనీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. నీటిని ఉపయోగించి అనేక వ్యాధులను నివారించొచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేమిటో చూద్దాం...
  1. నీరు వేడి చేసి అందులో కాసింత ఉప్పు వేసి కరిగించాలి. ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, టాన్సిల్స్‌ తగ్గుతాయి.
  2. నీటిని మరిగించి కొద్దిగా పసుపు లేదా రెండు చుక్కల యూకలిప్టస్‌ ఆయిల్‌ కలిపి ఆవిరి పడితే జలుబు, ఆస్త్మా, బ్రాంకైటిస్‌ నుంచి ఉపశమనం కలుగుతుంది.
  3. ఐస్‌ ముక్కల్ని నుదిటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
  4. గ్లాసుడు గోరువెచ్చని నీటిని నెమ్మదిగా సిప్‌ చేస్తూ తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
  5. కరిస్తే సబ్బునీటితో ఆ భాగం కడిగి శుభ్రం చేయాలి. ఏకధారగా గాయం మీద నీరు పోస్తే రేబీస్‌ కలిగించే సూక్ష్మజీవులు తొలగిపోతాయి.
  6. చర్మం కాలితే వెంటనే చల్లటి నీటితో గాయాన్ని తడపాలి. దీనివల్ల కాలిన గాయం చల్లబడి మరింత పెరగకుండా ఉంటుంది.
  7. వేడినీరు తాగితే కఫం కరుగుతుంది. పసుపును మరిగేనీటిలో వేసి ఆవిరి పడితే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
  8. చిన్న చిన్న గాయాలను చల్లటి నీటిలో కడిగితే మలినాలు, సూక్ష్మజీవులు పోతాయి. రక్తం నెమ్మదిగా గడ్డకడుతుంది. రక్తం కారడం తగ్గుతుంది.
  9. వేడి నీళ్లలో ఉప్పు వేసి కాపడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.
  10. రాత్రి రాగి చెంబులో నీరు పోసి పరగడుపున తాగితే మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
  11. ముక్కులోంచి రక్తం పడుతుంటే చల్లటి నీరు తలమీద పోయాలి. నుదుట/ ముక్కుమీద తడిగుడ్డ వేయాలి.
  12. గోరువెచ్చని నీటిలో ఉప్పువేసి పుక్కిలిస్తే దంతాల నొప్పి తగ్గుతుంది.
  13. ఎక్కువనీరు తాగితే రక్తం పలచబడుతుంది. యూరిక్‌ యాసిడ్‌ లెవెల్‌ తగ్గుతుంది. మూత్రం ద్వారా యూరిక్‌ ఆమ్లం బయటికిపోతుంది.
  14. నీరు ఎక్కువగా తాగితే సూక్ష్మజీవులు వేగంగా మూత్రం ద్వారా బయటకు పోయి మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌ తగ్గుతుంది.

No comments:

Post a Comment