తాగేనీటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. నీటిని ఉపయోగించి
అనేక వ్యాధులను నివారించొచ్చని అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. అవేమిటో
చూద్దాం...
- నీరు వేడి చేసి అందులో కాసింత ఉప్పు వేసి కరిగించాలి. ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, టాన్సిల్స్ తగ్గుతాయి.
- నీటిని మరిగించి కొద్దిగా పసుపు లేదా రెండు చుక్కల యూకలిప్టస్ ఆయిల్ కలిపి ఆవిరి పడితే జలుబు, ఆస్త్మా, బ్రాంకైటిస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.
- ఐస్ ముక్కల్ని నుదిటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
- గ్లాసుడు గోరువెచ్చని నీటిని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగితే ఎక్కిళ్లు తగ్గుతాయి.
- కరిస్తే సబ్బునీటితో ఆ భాగం కడిగి శుభ్రం చేయాలి. ఏకధారగా గాయం మీద నీరు పోస్తే రేబీస్ కలిగించే సూక్ష్మజీవులు తొలగిపోతాయి.
- చర్మం కాలితే వెంటనే చల్లటి నీటితో గాయాన్ని తడపాలి. దీనివల్ల కాలిన గాయం చల్లబడి మరింత పెరగకుండా ఉంటుంది.
- వేడినీరు తాగితే కఫం కరుగుతుంది. పసుపును మరిగేనీటిలో వేసి ఆవిరి పడితే దగ్గు నుంచి ఉపశమనం కలుగుతుంది.
- చిన్న చిన్న గాయాలను చల్లటి నీటిలో కడిగితే మలినాలు, సూక్ష్మజీవులు పోతాయి. రక్తం నెమ్మదిగా గడ్డకడుతుంది. రక్తం కారడం తగ్గుతుంది.
- వేడి నీళ్లలో ఉప్పు వేసి కాపడం వల్ల ఒళ్లు నొప్పులు తగ్గుతాయి.
- రాత్రి రాగి చెంబులో నీరు పోసి పరగడుపున తాగితే మలబద్ధకం తగ్గుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది.
- ముక్కులోంచి రక్తం పడుతుంటే చల్లటి నీరు తలమీద పోయాలి. నుదుట/ ముక్కుమీద తడిగుడ్డ వేయాలి.
- గోరువెచ్చని నీటిలో ఉప్పువేసి పుక్కిలిస్తే దంతాల నొప్పి తగ్గుతుంది.
- ఎక్కువనీరు తాగితే రక్తం పలచబడుతుంది. యూరిక్ యాసిడ్ లెవెల్ తగ్గుతుంది. మూత్రం ద్వారా యూరిక్ ఆమ్లం బయటికిపోతుంది.
- నీరు ఎక్కువగా తాగితే సూక్ష్మజీవులు వేగంగా మూత్రం ద్వారా బయటకు పోయి మూత్రనాళ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.
No comments:
Post a Comment