Thursday, November 9

విరామ సమయంలో...

ఎక్కువ ఒత్తిడికి గురైతే సహజంగానే శరీరం బరువు తగ్గుతుంది, నీరసంగా అనిపిస్తుంది. అదే విధంగా తదేకంగా కొన్ని గంటల పాటు కదలకుండా పని చేస్తే సహజంగానే ఎదో తెలియని బాధకు గురి కావటం, శరీరం అలసిపోవటం, కండ్లు మంట పుట్టటం, తల నొప్పి రావటం జరుగుతుంది. అలాంటి సమయంలో ఒక ఐదు నిమిషాలు పనిలో విరామం తీసుకుంటే మెదడు ప్రశాంతంగా ఉండటంతో పాటు తాజాదనంతో నిండిపోతుంది. పనిలో ఒత్తిడి తగ్గటానికి విరామ సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే సరిపోతుందని చెబుతున్నారు నిపుణులు...
  1. అలసటను దూరం చేయటంలో అద్భుతమైన ఔషధం సంగీతం. ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు ఇష్టమైన సంగీతం వినటం మంచిది. ఇలా చేయటం వల్ల మెదడులోని అలసట భావన దూరం అవుతుంది.
  2. ఒత్తిడిని తగ్గిం చటంలో గ్రీన్‌ టీ పాత్ర కీలకం. ఎందుకంటే గ్రీన్‌ టీ ఆకుల్లో ఎమినో ఆమ్లాలు అధికంగా ఉంటాయట. ఇవి ముఖ్యంగా ఆందోళనను తగ్గించి ప్రశాంతంతను కల్గిస్తాయి. అలాగే శరీరంలోకి డొపమైన్‌, సెరొటొనిన్‌ అనే హార్మోన్లను విడుదల చేస్తాయి. ఇవి ఆనందాన్ని కలిగించటంతో పాటు డిటాఫ్సికేషన్‌కు తోడ్పడుతాయి.
  3. అలాగే పనిలో ఆందోళనను తగ్గించటంలో నిద్ర పాత్ర కీలకం. నిద్ర సరిగ్గా పోవటం వల్ల చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే పని చేసే సమయంలో బాగా నిద్ర వస్తే ఒక 15 నిమిషాలు నిద్ర పోతే చాలు కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు.
  4. గంటల తరబడి కదలకుండా కూర్చోవటం వల్ల శరీర కండరాలు ఒత్తిడికి గురి అవుతాయి. నడుము నొప్పి, తల నొప్పి వస్తాయి. అలా కాకుండా ఉండాలంటే పని చేసే సమయంలో పది నిమిషాలకోసారి అటుఇటూ తిరగటం లేదా శరీరాన్ని కదిలించటం వంటివి చేస్తుండాలి. అలాగే ప్రతి రోజు కండరాలను సంబంధించిన వ్యాయామం తప్పని సరి.

No comments:

Post a Comment