శరీరానికి కిడ్నీలు చేసే మేలు ఇంత అంత
కాదు. శరీరంలోని ఉపయోగం లేని లవణాలను చెమట, మూత్రం రూపంలో బయటకి పంపించి
అవి ఎంతో సహకరిస్తాయి. సరైన విధంగా ఆహార నియమాలు పాటించకపోవవం వల్ల
కిడ్నీలలో రాళ్లు, తదితర సమస్యల బారిన పడుతున్నారు. మన శరీరానికి ఎంతో మంచి
చేసే మూత్రపిండాల విషయంలో నిర్లక్యం చేస్తే ఆసుపత్రుల్లో లక్షలు రూపాయలు
పోసి కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కేవలం
కొత్రిమీరతో కొద్దిపాటి మెళకువలు పాటించి మూత్రపిండాలకు శుభ్రం
చేసుకోవచ్చని తెలుసా. ఎలా అంటారా ఈ చిట్కాలు చదవండి మరి.
చిన్న చిన్న ముక్కలుగా కొత్తిమీర ఆకులను
కత్తిరించాలి. కత్తిరించి ముక్కలను శుభ్రంగా కడిగి రెండు లీటర్ల నీటిలో
వేసి 10 నిమిషాలపాటు మరిగించాలి. అనంతరం ఆ నీటిని ఫిల్టర్ చేసి సీసాలో పోసి
ఫ్రీజ్ లో ఉంచాలి. ప్రతి రోజు ఒక గ్లాసు రసాన్ని తాగడం వల్ల శరీరంలోని
ప్రేగులు శుభ్రపడటంతోపాటు, కిడ్నీలోని లవణాలన్నిమూత్రం ద్వారా బయటకిపోతాయి.
అలా ప్రతి రోజు ఒక గ్లాసు త్రాగడం అలవాటుగా చేసుకుంటే మీకు ఎంతో మేలు
జరుగుతుంది. కిడ్నీ సమస్యలతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి లక్షలు లక్షలు కట్టే
కంటే మార్కెట్ లో 5 రూపాయలకి దొరికే కొత్తిమీర కట్టని తెచ్చుకోవడం వల్ల
మనకి డబ్బులు మిగలటంతో పాటు ఆరోగ్యం కూడా వస్తుంది. ఎంతో చవకైన, సులభమైన ఈ
చిట్కాని పాటించి కిడ్నీలను కాపాడుకోండి మరి.

No comments:
Post a Comment