Thursday, May 11

మిఠాయిలు ఎక్కువ తింటే ముప్పే!

స్వీటు అంటే ఇష్టముండని వారుండరు. మోతాదులో ఎక్కువ, తక్కువ తేడా తప్ప మిఠాయిలంటే ఎవరికైనా పసందే. అయితే.. తక్కువ తింటే ఏం లేదు గానీ ఎక్కువ తింటేనే ఆరోగ్య సమస్యను ఎదుర్కొక తప్పదంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా స్వీట్ల వల్ల మానసిక ఒత్తిడి తీవ్రమవుతుందని ఆస్ట్రేలియాలోని యూనివర్శిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌ వేల్స్‌ పరిశోధకులు వెల్లడించారు. తీపి తినడంతో మెదడులోని హిప్పోకాంపస్‌ దెబ్బతింటుందని, దీంతో జ్ఞాపకశక్తి క్షీణిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా కృతిమ తీపితో అనర్థాలు తప్పవని మరో అధ్యయనంలో తేలింది. లావుగా ఉన్నవారు ఆర్టిఫిషియల్‌ స్వీట్లు అధిక మొత్తంలో తీసుకుంటారని, వీటి వల్ల శరీరంలో గ్లూకోజ్‌ నియంత్రణ సరిగా ఉండదని వెల్లడైంది. అంతేకాదు.. గర్భిణులు కృత్రిమ స్వీట్నర్స్‌ వాడితే ఊబకాయులైన పిల్లలు జన్మిస్తారని తేలింది.

No comments:

Post a Comment