వాషింగ్టన్:
అధిక పోషకాలనందించే పాలు, గుడ్లు, జంతు మాంసం మానవులకు కీడు చేస్తాయా?
ఎన్నో ఏళ్లుగా మానవులు వీటిని తమ ఆహారంగా మార్చుకున్నారు. అయితే ఎక్కువకాలం
బతకాలంటే మాత్రం వీటిని దూరం చేసుకోవాల్సిందే అంటున్నారు పరిశోధకులు.
మసాచుసెట్స్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయం వెల్లడించారు. దాదాపు 30
ఏళ్లపాటు 35 లక్షల మందిపై పరిశోధనలు జరిపి ఈ విషయం బయటపెట్టారు.
పాలు,
గుడ్లు, పశుమాంసం (రెడ్ మీట్) లాంటి జంతు ఉత్పత్తుల వల్ల మరణం
దగ్గరవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ‘రెడ్ మీట్, పాలు, గుడ్లు వల్ల
శరీరానికి ప్రోటీన్లు అందుతాయనే మాట నిజమే. అయితే ఆ ప్రోటీన్లలో చాలా భాగం
హాని చేస్తాయి. చాలా రకాల దీర్ఘవ్యాధులు చుట్టుముడతాయి. వీటి కంటే పప్పులు,
చిరుధాన్యాలు, పళ్లు, కూరగాయలు మంచి ఆహార పదార్థాల’ని పరిశోధకులు
సూచిస్తున్నారు.
No comments:
Post a Comment