Monday, August 8

తెలివైన పిల్ల‌లు పుట్టాలంటే గ‌ర్భిణీలు ఇలా చేయాలి

ప్ర‌తి మ‌హిళ‌కు మాతృత్వం అనేది చాలా ఇంపార్టెంట్‌. మ‌హిళ‌గా పుట్టి వివాహ‌మ‌య్యాక ఆమె త‌ల్లి అయ్యేందుకు చాలా ఆతృత ప‌డుతుంది. ఇదిలా ఉంటే ప్ర‌తి మ‌హిళకు త‌ల్లి అవ్వ‌డం ఎంత ముఖ్య‌మో అదే ఆమెకు పుట్టే బిడ్డ‌లు తెలివైన వాళ్లుగా పుట్ట‌డం కూడా అంతే ముఖ్యం. తెలివైన పిల్ల‌లు పుట్టాలంటే ఏం చేయాలి అనే అంశంపై ప‌రిశోధ‌కులు చేసిన స‌ర్వేలో ఆస‌క్తిక‌ర అంశాలు వెల్ల‌డ‌య్యాయి. వీరు జ‌రిపిన అధ్య‌య‌నాల్లో గ‌ర్భధారణ సమయంలో పండ్లు అధికంగా తినే మహిళలు తెలివైన పిల్లలకు జన్మనిస్తున్నారని వెల్లడైంది.
మ‌హిళ‌లు గ‌ర్భ‌ధార‌ణ టైంలో ఎక్కువ‌గా పండ్లు తింటే వాళ్ల‌కు పుట్టే పిల్లల్లో మేధస్సు త్వరగా వృద్ధి చెందుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. కెనడాలోని ఆల్బెర్టా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 800మంది చిన్నారులను పరిశీలించారు. అంతేగాక వీరి కుటుంబ ఆదాయం, తల్లిదండ్రుల చదువు వంటి అంశాలను కూడా వీరు నమోదుచేసుకున్నారు. వీటి ఆధారంగా చేసుకుని వీరి ఐక్యూని గణించారు. సగటున 100పాయింట్లు నిర్ధారించగా.. 65శాతం మంది పిల్ల‌లు 85 నుంచి 115 ఐక్యూ కలిగి ఉన్నారని తేలింది. రోజుకి ఆరు లేదా ఏడుసార్లు పండ్లు లేదా పండ్ల రసాలు తీసుకున్న గర్భిణులకు పుట్టిన పిల్లలు 6 నుంచి ఏడు పాయింట్లు అధికంగా సాధించారు.

No comments:

Post a Comment