సెల్ ఫోన్…. ఇప్పుడు ఈ వస్తువు లేని ఇల్లు లేదు కాదు కాదు దాదాపు మనిషి
లేడు అంటే బాగుటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి మనిషి దగ్గర సెల్ ఫోన్ అనేది
ఒక నిత్య వస్తువు అయ్యింది అనే కంటే మనిషి జీవితంలో ఒక భాగం అయ్యింది
అనొచ్చు. సెల్ ఫోన్ వలన ఎంత మేలు జరుగుతుందో అంతే కీడు కూడా జరుగుతుంది
అంటున్నారు శాస్త్రవేత్తలు. సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించే వారి పరిస్థితి
రోజు రోజుకు మరీ దారుణంగా ఉంటుందట!. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ వచ్చిన సమయం
నుండి ఫోన్ లోనే అన్ని అందుబాటులోకి రావడం, అలాగే ఫేస్ బుక్,వాట్సప్ వంటి
ఆప్స్ తో నిత్యం సెల్ ఫోన్ చేతిలోనే ఉండటం వలన చాలా ప్రమాధం
అంటున్నారు శాస్త్రవేత్తలు.
ఈ సెల్ ఫోన్ నుండి నుంచి వెలువడే
రేడియేషన్ తో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇటీవల జరిపిన అధ్యయనాలు
చెబుతున్నాయి. యూఎస్ కు చెందిన ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ స్టడీస్ ఎలుకల పై
జరిపిన పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది.మగ ఎలుకల పై తొమ్మిది గంటలపాటు
రేడియేషన్ ప్రభావం పడగా వాటిలో రెండు నుంచి మూడు శాతం క్యాన్సర్ లక్షణాలు
కనిపించాయి. మగ ఎలుకల విషయం ఇలా ఉంటే ఆడ ఎలుకలు మాత్రం రేడియేషన్
ప్రభావానికి గురి కాకపోయినా వాటి కంటే వేగంగా చనిపోతున్నాయి. దీని పై
ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు శాస్త్రవేత్తలు.
ఇలా సెల్ ఫోన్ ని ఎక్కువ సమయం వాడటం వల్ల
రేడియేషన్ ఎఫెక్ట్ కి గురై క్యాన్సర్ వచ్చే ఆవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని
వారి పరిశోధనలో తేలింది. సిగ్నల్ తక్కువ ఉన్నప్పుడు, ఛార్జింగ్ తక్కువ
ఉన్నప్పుడు మొబైల్ ఎక్కువ రేడియేషన్ ని విడుదల చేస్తుందని తెలిపారు, అదే
పనిగా ఫోన్ మాట్లాడటం వల్ల కూడా రేడియేషన్ కి గురై అయ్యే అవకాశం ఉంది.కావున
సిగ్నల్, ఛార్జింగ్ తక్కువగా ఉన్నప్పుడు మొబైల్ ని వాడకండి.
No comments:
Post a Comment